ప్రభుత్వం చెంతే ప్రతిపాదనలు
ఎలాంటి విపత్తు ఎదురైనా ముందు గుర్తుకొచ్చేది అగ్నిమాపకశాఖ.. ఆ శాఖనే ప్రభుత్వం పట్టించుకుకోలేదు. వేసవిలో పెద్దసంఖ్యలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటుంటాయి.
అగ్నిమాపక కేంద్రాలపై జగన్ చిన్నచూపు
భర్తీకాని 60 పోస్టులు
న్యూస్టుడే, నెల్లూరు (నేర విభాగం)
- చేజర్ల ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగితే పొదలకూరు నుంచి అగ్నిమాపక శకటం వెళ్లాలి. చేజర్ల, పొదలకూరు మధ్య దాదాపు 45 కి.మీ దూరం ఉంది. అంటే దాదాపు గంటకుపైగా ప్రయాణం చేయాలి. ఈలోపు ఆస్తి నష్టం జరిగిపోతోంది.
- నెల్లూరు నగరంలో రెండు అగ్నిమాపక శకటాలు ఉన్నాయి. కోవూరు వైపు, ముత్తుకూరు వైపు, బుచ్చి, సంగం వరకు, వెంకటాచలం వైపు అగ్ని ప్రమాదాలు జరిగితే ఇక్కడి నుంచే వాహనం వెళ్లాలి. వీటి ప్రయాణం కూడా గంటల్లోనే ఉంది.
- జిల్లాలో మరికొన్ని అగ్నిమాపక కేంద్రాలు కావాలని, ఆ శాఖ అధికారులు ఎన్నోసార్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఎక్కడెకక్కడ కావాలి? ఏయే ప్రాంతాల్లో పెడితే బాగుంటుందనే వివరాలతో అభ్యర్థించారు. నేటికీ కొత్తవి మంజూరు కాలేదు.
ఎలాంటి విపత్తు ఎదురైనా ముందు గుర్తుకొచ్చేది అగ్నిమాపకశాఖ.. ఆ శాఖనే ప్రభుత్వం పట్టించుకుకోలేదు. వేసవిలో పెద్దసంఖ్యలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటుంటాయి. విద్యుత్తు షార్ట్సర్క్యూట్తో గడ్డి వాముల దగ్ధం కావడం, ఇళ్లు, దుకాణాల్లో నిప్పు రాజుకుంటుంది. విలువైన వస్తువులు అగ్నికి ఆహుతవుతుంటాయి. కొన్ని ప్రమాదాల్లో ప్రాణాలే పోతున్నాయి. పలితంగా ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతోంది. ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయి. అగ్ని ప్రమాదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. జిల్లాలో అగ్నిమాపక శాఖ కేంద్రాలు, సిబ్బంది కొరత వెంటాడుతోంది.
సిబ్బంది కొరత..
అగ్నిమాపక శాఖలో ఏళ్లుగా సిబ్బంది కొరత వెంటాడుతూనే ఉంది. జిల్లాలో ఉన్న 9 ఫైర్ స్టేషన్లలోనూ సిబ్బంది, వాహనాల కొరత ఉంది. ప్రస్తుతం ఉన్న పోస్టులకు మరో 60 ఉద్యోగాల భర్తీ జరగాల్సి ఉంది. హోంగార్డుల సాయంతో వాటిని నెట్టుకొస్తున్నారు. ప్రస్తుతం జిల్లా అగ్నిమాపక అధికారి, సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటరు, స్టేషన్ ఫైర్ అధికారులు పది మంది, లీడింగ్ ఫైర్మెన్లు 28, డ్రైవర్ ఆపరేటర్లు 41 మంది, ఫైర్మెన్లు 100 మంది ఉన్నారు. ఇంకా సీనియర్ అసిస్టెంట్, రీడింగ్ ఫైర్మెన్ ఒకటి, డ్రైవర్ ఆపరేటర్లు 8, ఫైర్మెన్ 40 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది.
కొత్త కేంద్రాలకు ప్రతిపాదించిన ప్రాంతాలు
నెల్లూరు గ్రామీణ పరిధిలోని అయ్యప్పగుడి వద్ద, వెంకటాచలం, కోవూరు నియోజకవర్గంలోని రాజుపాళెం, బుచ్చిరెడ్డిపాళెం, కావలి నియోజకవర్గం పరిధిలో అల్లూరు, ఆత్మకూరు నియోజకవర్గంలో సంగం ప్రాంతాలు ఉన్నాయి. బుచ్చిలో దాదాపు స్థల సేకరణ పూర్తయింది. ప్రభుత్వం నుంచి క్లియరెన్సు రావాల్సి ఉంది. నెల్లూరులో మరో కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఉన్నతాధికారులు స్పందించి కొత్త కేంద్రాలు మంజూరు చేయడంతోపాటు సిబ్బందిని నియమించి అగ్నిప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా ఎన్నికల ప్రచారం
[ 03-05-2024]
క్లస్టర్ ఇన్ఛార్జ్, తెదేపా సీనియర్ నాయకుడు, నెల్లూరు పార్లమెంట్ ఉపాధ్యక్షులు మన్నవ రవిచంద్ర ఆధ్వర్యంలో 19వ వార్డు ఇన్ఛార్జ్ వేగూరి చంద్రశేఖర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
సీనియర్ ఫ్యాకల్టీకి ఎస్వీ వర్సిటీ డాక్టరేట్
[ 03-05-2024]
కావలి పట్టణానికి చెందిన సురేఖ కుమారికి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేసింది. -
పరిశ్రమలు రావాలంటే బాబు రావాలి
[ 03-05-2024]
కోవూరు మండల వలసలతో వైకాపా బక్కచిక్కుతుంటే తెదేపా బలపడుతోంది. -
నగరంలో నేడు చంద్రబాబు, పవన్కల్యాణ్ పర్యటన
[ 03-05-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడుతో పాటు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ శుక్రవారం నెల్లూరు నగరంలో పర్యటించనున్నారు. -
జగన్.. ఏడి‘పింఛన్’!
[ 03-05-2024]
అవ్వా తాతల జీవితాల్లో ఆనందం, సంతోషం చూడాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని.. అందుకే వారి ఇంటి వద్దనే పింఛను డబ్బు పంపిణీ చేసే విధానాన్ని ప్రారంభిస్తున్నామని పదే పదే చెప్పిన జగన్.. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు వారిని ఇబ్బంది పెట్టేందుకూ వెనుకాడటం లేదు. -
జిల్లా ఓటర్లు 19,44,874
[ 03-05-2024]
జిల్లాలో ఓటర్ల లెక్క తేలింది. నియోజకవర్గాల వారీగా ఓటుహక్కు వినియోగించుకునే వారి తుది జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది. జిల్లాలో గత జననవరి 22వ తేదీ నాటికి 19,08,498 ఉండగా- తాజా జాబితా ప్రకారం ఆ సంఖ్య పెరిగింది. -
వంతెన నిర్లక్ష్యం.. ఈ వంతున
[ 03-05-2024]
జిల్లాలో పలు రహదారులు, శిథిలమైన వంతెనలు భయపెడుతున్నాయి. దశాబ్దాల క్రితం నిర్మించినవి కావడంతో కాలం చెల్లిపోయాయి. వీటిపై రాకపోకలు ప్రమాదకరంగా సాగిస్తున్నారు. -
ఉక్కపోత.. ఇక్కట్ల కలబోత
[ 03-05-2024]
ఎండలు ఠారెస్తున్నాయి.. బయటకు రావాలంటే హడలెత్తుతున్నారు.. సామాన్య ప్రజలే ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.. అనారోగ్యం బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు ఎలా ఉంటారో అర్థం చేసుకోవచ్చు. -
హత్య కేసులో నిందితుల అరెస్టు
[ 03-05-2024]
ఇటీవల జాకీర్హుస్సేన్ నగర్లో జరిగిన హత్య కేసులో నిందితులను నవాబుపేట పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నవాబుపేట ఇన్స్పెక్టర్ ఎం.బాబి వివరాలు వెల్లడించారు. -
రూ.1.20 కోట్ల మద్యం స్వాధీనం
[ 03-05-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో మద్యం దుకాణాలు, బార్లను తనిఖీ చేస్తున్నామని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె.నాగమల్లేశ్వరరెడ్డి పేర్కొన్నారు. -
బకింగ్హామ్ కాలువపై శ్రద్ధేది ఏలికా..?
[ 03-05-2024]
కరేడు పంచాయతీ పరిధిలోని సముద్ర తీరంలో ఇతర ప్రాంతాలకు చెందిన పలువురు హెచరీల నిర్మాణాలు చేపట్టారు. ఇప్పటికే ఎనిమిది హెచరీల నిర్మాణాలు పూర్తయ్యాయి. -
జనంమెచ్చని స్మార్ట్ టౌన్షిప్
[ 03-05-2024]
మధ్య తరగతి ప్రజల సొంతింటి కలను నెరవేరుస్తామంటూ ప్రభుత్వం ప్రతిపాదించిన ఎంఐజీ లేఅవుట్కు ప్రజల నుంచి స్పందన కరవైంది. -
పండుటాకులతో రాజకీయం
[ 03-05-2024]
ఎండలు మండిపోతున్నాయి. యువకులే బయటకు వచ్చే పరిస్థితులు లేవు. గడప దాటితే కుప్పకూలే పరిస్థితి. ఈసమయంలో పింఛనుదారులకు ప్రభుత్వం నరకం చూపించింది. ఇంటికొచ్చి నగదు ఇచ్చే వీలున్నా బ్యాంకుల్లో జమ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆ ఒక్కడే.. ఐపీఎల్లో నన్ను భయపెట్టిన బ్యాటర్: గౌతమ్ గంభీర్
-
సునీత, వైఎస్ షర్మిల పిటిషన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు
-
సూచీలకు ‘హెవీ’ స్ట్రోక్.. 700 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రోహిత్ తర్వాత పాండ్యనే కెప్టెన్.. మరింత బాధ్యతగా ఆడాలి: మాజీ క్రికెటర్
-
భారత కంపెనీపై దిల్లీ హైకోర్టుకు టెస్లా.. కారణం ఇదే..
-
నా స్థాయికి తగ్గ బౌలింగ్ చేయలేకపోయా: ముంబయి స్టార్ ఆల్రౌండర్