logo

ఆహార నాణ్యత విస్మరిస్తే చర్యలు

జిల్లా ఆసుపత్రిలో రోగులకు పెట్టే ఆహార నాణ్యత విషయంలో జాగ్రత్తలు పాటించాలని పర్యవేక్షకురాలు డా.విజయలక్ష్మి నిర్వాహకులకు సూచించారు.

Published : 02 Jun 2023 05:56 IST

జిల్లాసుపత్రిలో ఆహారాన్ని పరిశీలిస్తున్న పర్యవేక్షకురాలు డా.విజయలక్ష్మి, ఆర్‌ఎంవో శ్రీనివాస్‌

కామారెడ్డి పట్టణం, న్యూస్‌టుడే: జిల్లా ఆసుపత్రిలో రోగులకు పెట్టే ఆహార నాణ్యత విషయంలో జాగ్రత్తలు పాటించాలని పర్యవేక్షకురాలు డా.విజయలక్ష్మి నిర్వాహకులకు సూచించారు. ‘ఈనాడు’ లో గురువారం ‘అదే బువ్వ.. కూర’ శీర్షికన కథనం ప్రచురితమైంది. స్పందించిన వైద్యాధికారులు మధ్యాహ్నం రోగులకు అందించే ఆహారాన్ని పరిశీలించారు. పౌష్టికాహారాన్ని అందించాలన్నారు. నాణ్యత విస్మరిస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. రోగుల నుంచి వివరాలు సేకరించారు. ఆర్‌ఎంవో డా.శ్రీనివాస్‌, పలువురు వైద్యులు, సిబ్బంది ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని