logo

రాజ్యాంగాన్ని కాపాడుకుందాం

భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందామని డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి పి. శంకర్ అన్నారు.

Published : 23 Apr 2024 21:10 IST

కామారెడ్డి పట్టణం: భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందామని డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి పి. శంకర్ అన్నారు. జిల్లా కేంద్రంలో మంగళవారం దళిత బహజన ఫ్రంట్ ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ ప్రచారోద్యమ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మహనీయులైన ఫులే, అంబేడ్కర్, జగ్జీవన్‌రామ్‌ జయంతి ఉత్సవాల సందర్భంగా కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. విద్య, ఉద్యోగాలు, సంపదను అణగారినవర్గాలకు రాజకీయ నేతలు దూరం చేశారన్నారు. కార్యక్రమంలో తెలంగాణ జనసమితి జిల్లా కన్వీనర్ కుంబాల లక్ష్మణ్, భారతీయ విద్యార్ధిమోర్చా రాష్ట్ర ప్రధానకార్యదర్శి విఠల్, ప్రతినిధులు లావణ్య, సంతోశ్, ప్రవీణ్ తదితరులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని