అన్నకు నచ్చని తమ్ముడి పెళ్లి
వద్దని చెప్పినా వినకుండా తనకు నచ్చని అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని తమ్ముడిపై కోపం పెంచుకున్న అన్న..
వధువు అమ్మమ్మ ఇంటికి నిప్పుపెట్టిన ప్రబుద్ధుడు
నిజామాబాద్ నేరవిభాగం, న్యూస్టుడే: వద్దని చెప్పినా వినకుండా తనకు నచ్చని అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని తమ్ముడిపై కోపం పెంచుకున్న అన్న.. తమ్ముడి భార్య అమ్మమ్మ ఇంటికి నిప్పంటించిన ఘటన నగరంలో ఐదో ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. శాంతినగర్కు చెందిన మజర్, అమర్ ఇద్దరు అన్నదమ్ములు. ప్లంబింగ్ పనిచేసుకునే అమర్కు ఏడాది కిందట హైదరాబాద్కు చెందిన యువతితో నిశ్చితార్థం జరిగింది. ఆ యువతిని తన తమ్ముడు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక మజర్ ఏడాది నుంచి అడ్డుకుంటున్నాడు. అయినా వినకుండా అమర్ శుక్రవారం పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన అన్న తాను వద్దన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని కోపం పెంచుకున్నాడు. నూతన దంపతులు శాంతినగర్లో అమ్మాయి అమ్మమ్మ ఇంట్లో ఉన్నారని తెలిసి శుక్రవారం అర్ధరాత్రి మజర్ తన స్నేహితులు సల్మాన్, ఇలియాస్, సమీర్, ఇమ్రాన్లతో కలిసి వెళ్లి ఆ ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. పెళ్లికి వచ్చిన కానుకలు మంటల్లో కాలిబూడిదయ్యాయి. అగ్నిమాపక శాఖకు సమాచారం ఇవ్వడంతో వారు మంటలను అదుపు చేశారు. యువతి అమ్మమ్మ మౌలాబీ శనివారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో అశోక్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జహీరాబాద్లో మూడురంగుల జెండా ఎగరాలి
[ 12-05-2024]
కామారెడ్డి జిల్లా కేంద్రంలో శనివారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్షోకు పార్టీ అగ్రనాయకురాలు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. -
ఓటేయడమే నిజమైన గౌరవం
[ 12-05-2024]
ప్రజాస్వామ్యానికి తల్లిలాంటిది భారతదేశం.. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఖ్యాతి. ఆ ప్రజాస్వామ్యానికి కేంద్ర బిందువు ఓటు. -
నిశ్శబ్ద ఘడియల్లో పటిష్ఠ నిఘా
[ 12-05-2024]
ప్రచార ఘట్టం ముగియటంతో నిశ్శబ్ద వ్యవధిగా పరిగణించే పోలింగ్కు 42 గంటల ముందు పటిష్ఠ నిఘా ఏర్పాటు చేసినట్లు నిజామాబాద్ లోక్సభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజీవ్గాంధీ హన్మంతు స్పష్టం చేశారు. -
ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తే కఠిన చర్యలు
[ 12-05-2024]
ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎన్నికల అధికారి జితేశ్ వి పాటిల్ పేర్కొన్నారు. -
పోలింగ్ నిర్వహణకు అంతా సిద్ధం
[ 12-05-2024]
లోక్సభ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 13వ తేదీన నిర్వహించే ఎన్నికలకు జిల్లా యంత్రాంగం ముందుగానే సన్నద్ధమైంది. -
ఇబ్బందులు తలెత్తొద్దు: కలెక్టర్
[ 12-05-2024]
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా జుక్కల్ నియోజకవర్గరంలోని మద్నూర్లో ఏర్పాటుచేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం, ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జితేశ్ వి పాటిల్ శనివారం పరిశీలించారు. -
‘భారాసతోనే గ్రామాల అభివృద్ధి’
[ 12-05-2024]
భారాసతోనే గ్రామాల అభివృద్ధి జరుగుతుందని జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్కుమార్ అన్నారు. శ -
మోదీ పాలనలో మహిళలకు సముచిత స్థానం
[ 12-05-2024]
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనలో మహిళలకు సముచిత స్థానం కల్పించారని సినీనటి జీవిత పేర్కొన్నారు. -
పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి
[ 12-05-2024]
జహీరాబాద్ లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా మూడో విడత ర్యాండమైజేషన్ను శనివారం పూర్తి చేశారు. -
పుస్తకాలొస్తున్నాయ్..!
[ 12-05-2024]
జిల్లాలో ప్రభుత్వ బడుల్లో ఉచిత పాఠ్య పుస్తకాల సరఫరా ప్రారంభమైంది. -
ఎన్నికల సామగ్రి పంపిణీ నేడు
[ 12-05-2024]
లోక్సభ ఎన్నికల్లో వినియోగించే ఈవీఎంలు ఇతర ఎన్నికల సామగ్రిని ఆదివారం పంపిణీ చేయనున్నారు. -
‘ముమ్మాటికీ భారాసదే విజయం’
[ 12-05-2024]
ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా తన విజయం ఆపలేరని భారాస నిజామాబాద్ పార్లమెంటు అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. -
ఈ గుర్తింపు కార్డులుంటే చాలు
[ 12-05-2024]
భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఓటరు జాబితాలో పేరున్న వారు ఓటు వేసే హక్కు ఉంది. -
ఉన్నతాధికారులపై అసత్య ఆరోపణలు సరికాదు
[ 12-05-2024]
టీఎస్ ఆర్టీసీ ఉన్నతాధికారులపై మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి అసత్య ఆరోపణలు చేయడం సరికాదని ఆర్ఎం జానీరెడ్డి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
వ్యర్థాలు తగులబెడుతున్నారా?
[ 12-05-2024]
యాసంగి వరికోత పనులు పూర్తయ్యాయి. వానాకాలం పంటసాగు కోసం రైతులు సన్నద్ధం అవుతున్నారు. -
ఆర్మూర్- ఆదిలాబాద్ రైల్వేలైన్ తెస్తా
[ 12-05-2024]
తాను ఎంపీగా గెలిస్తే ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ఆర్మూర్-ఆదిలాబాద్ రైల్వేలైన్ ఏర్పాటుకు కృషి చేస్తానని నిజామాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి జీవన్రెడ్డి తెలిపారు. -
జీవాల దాహార్తి తీర్చారు
[ 12-05-2024]
నవీపేట మేకల అంగడిలో నెలకొన్న నీటి సమస్యను పంచాయతీ అధికారులు పరిష్కరించారు. ‘ -
డీఎంహెచ్వోపై ఉన్నతాధికారుల గుర్రు
[ 12-05-2024]
కామారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వ్యవహారం చర్చనీయాంశమైంది. మహిళా ఆరోగ్య అధికారులను వేధిస్తున్నారని పేర్కొంటూ తాజాగా కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. -
ట్రాఫిక్ దారి మళ్లింపు
[ 12-05-2024]
లోక్సభ ఎన్నికల సందర్భంగా ఈ నెల 13న జిల్లాలో పలు పోలింగ్ బూత్ల వద్ద వాహనాల దారి మళ్లింపు చేపడుతున్నట్లు పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. -
ఇసుక తోడేస్తున్నారు.. చర్యలు తీసుకోండి
[ 12-05-2024]
బిచ్కుంద మండలంలోని గుండె నెమిలి గ్రామంలోని మంజీరా నదిలో అక్రమంగా ఇసుక తోడేస్తున్నారంటూ వాజీద్నగర్కు చెందిన గుట్టమీది వినోద శనివారం కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
విరాట్ కోహ్లీపై విమర్శలు వద్దు.. మరింత ప్రమాదకరంగా మారతాడు: హేడెన్
-
112 ఏళ్ల నుంచి తప్పనిసరి ఓటింగ్..!
-
11 నెలల తర్వాత ఓటీటీలోకి వస్తున్న రొమాంటిక్ కామెడీ మూవీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సంజూ క్యాచ్ ఔట్ నిర్ణయం ఆలస్యం వల్లే.. పంత్పై మ్యాచ్ బ్యాన్: గంగూలీ
-
ఘర్షణలున్నా చైనాతో వాణిజ్యం అందుకే పెరుగుతోంది : జైశంకర్