ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
వచ్చే నెల 13న నిర్వహించే పార్లమెంట్ ఎన్నికల పోలింగ్కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు రిటర్నింగ్ అధికారి, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు స్పష్టం చేశారు.
నిజామాబాద్ కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న రిటర్నింగ్ అధికారి రాజీవ్గాంధీ హన్మంతు, చిత్రంలో నిజామాబాద్ సీపీ కల్మేశ్వర్ శింగెనవార్, అదనపు కలెక్టర్ అంకిత్, జగిత్యాల జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషా, ఎస్పీ సన్ ప్రీత్సింగ్, ఎన్నికల పరిశీలకులు
నిజామాబాద్ కలెక్టరేట్, న్యూస్టుడే: వచ్చే నెల 13న నిర్వహించే పార్లమెంట్ ఎన్నికల పోలింగ్కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు రిటర్నింగ్ అధికారి, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు స్పష్టం చేశారు. ఎన్నికల పరిశీలకులు ఎలిస్వజ్, డీఎం నెమ్జి, పోలీసు పరిశీలకుడు రాజేశ్ మీనా శనివారం నిజామాబాద్ కలెక్టరేట్లో జగిత్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ యాస్మిన్ బాషా, ఎస్పీ సన్ ప్రీత్ సింగ్తో పాటు రెండు జిల్లాలకు చెందిన నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. రిటర్నింగ్ అధికారి రాజీవ్గాంధీ హన్మంతు ఎన్నికల ఏర్పాట్ల గురించి వివరించారు. పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 17,04,867 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ గ్రామీణం, బాల్కొండ నియోజకవర్గాల్లో 1,288, జగిత్యాల జిల్లాలో జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాల్లో 516 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికల నియమావళి తూచా తప్పకుండా అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా నగదు, మద్యం, కానుకల పంపిణీపై గట్టి నిఘా పెట్టామన్నారు. ఇప్పటి వరకు రూ.1.22 కోట్ల నగదు, రూ. 1.28 కోట్ల విలువ చేసే బంగారం, ఇతర వస్తువులు సీజ్ చేశామన్నారు. మహారాష్ట్ర నుంచి మద్యం, ఇతర వస్తువులు అక్రమంగా జిల్లాలోకి తరలించకుండా సరిహద్దు ప్రాంతాల్లో నాలుగు చోట్ల అంతర్రాష్ట్ర చెక్పోస్టులు ఏర్పాటు చేసీ సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. మొదటి ర్యాండమైజేషన్ పూర్తిచేసి నియోజకవర్గ కేంద్రాల్లోని స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచామని చెప్పారు. 15 మంది కంటే ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు పోటీలో ఉంటే వాటికి అనుగుణంగా బ్యాలెట్ యూనిట్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఇంటి వద్దే ఓటు వేసేందుకు 80 ఏళ్లు పైబడిన వారు 859, దివ్యాంగ ఓటర్లు 899 మందిని గుర్తించామని వెల్లడించారు. జగిత్యాల జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషా కోరుట్ల, జగిత్యాలలో ఏర్పాట్లను వివరించారు. సీపీ కల్మేశ్వర్ మాట్లాడుతూ.. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా పోలీసుల సమన్వయంతో సరిహద్దు ప్రాంతాల నుంచి మద్యం, నగదు రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పాత నేరస్థులు, రౌడీషీట్ ఉన్న 943 మందిని బైండోవర్ చేశామని, లైసెన్స్ కలిగిన 76 ఆయుధాలను డిపాజిట్ చేయించామన్నారు. అదనపు కలెక్టర్ అంకిత్, నగర కమిషనర్ మకరందు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్టీసీ ఎండీ సజ్జనార్పై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు
[ 11-05-2024]
టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్పై రాష్ట్ర, కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారులకు ఫిర్యాదు చేసినట్లు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే, భారాస నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి పేర్కొన్నారు. -
సాయంత్రానికి మైకులు బంద్
[ 11-05-2024]
లోక్సభ ఎన్నికల్లో పార్టీలకు కీలక ఘట్టమైన ప్రచార పర్వం శనివారం సాయంత్రం ఆరు గంటలకు ముగియనుంది. మార్చి 16న షెడ్యూల్.. ఏప్రిల్ 18న నోటిఫికేషన్ వెలువడగా.. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి 29 మంది బరిలో దిగారు. -
అర్హులందరికీ రేషన్కార్డులు ఇప్పిస్తా
[ 11-05-2024]
అర్హులందరికీ రేషన్ కార్డులు ఇప్పించేందుకు తన వంతు కృషి చేస్తానని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. భాజపా జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
‘భాజపా సర్కారు రైతుల్ని మోసగించింది’
[ 11-05-2024]
కేంద్రంలోని భాజపా సర్కారు రైతులను మోసగించిందని, ప్రజలకు ఆదాయం పెంచుతామని చెప్పి అన్ని రకాల ధరల్ని రెట్టింపు చేసిందని మాజీమంత్రి మండవ వెంకటేశ్వరరావు విమర్శించారు. డి -
‘ముఖ్యమంత్రి మాటలు నమ్మొద్ద్దు’
[ 11-05-2024]
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాటలు ప్రజలు, కార్యకర్తలు ఎవరూ నమ్మొద్దని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ కల్యాణ మండపంలో శుక్రవారం నిర్వహించిన పార్టీ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. -
నేటితో ప్రచారానికి తెర
[ 11-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రం ముగియనుంది. మిగిలిన సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. -
‘కాంగ్రెస్ హయాంలో కుంభకోణాలు’
[ 11-05-2024]
కాంగ్రెస్కు అధికారం ఇస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు తగ్గించి ఓ వర్గానికి కల్పిస్తుందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. బాన్సువాడలో శుక్రవారం జహీరాబాద్ లోక్సభ భాజపా అభ్యర్థి, ఎంపీ బీబీపాటిల్తో కలిసి రోడ్ షో నిర్వహించారు. -
కార్నర్ సమావేశంగా మార్పు
[ 11-05-2024]
జిల్లాకేంద్రంలో కాంగ్రెస్ కార్నర్ సమావేశ స్థలాన్ని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ శుక్రవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో శనివారం తలపెట్టిన కాంగ్రెస్ జనజాతర సభను కార్నర్ సమావేశంగా మార్చినట్లు పేర్కొన్నారు. -
‘ఆశీర్వదిస్తే నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తా’
[ 11-05-2024]
ఓటర్లు ఆశీర్వదించి గెలిపిస్తే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని భారాస జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్కుమార్ అన్నారు. శుక్రవారం రాత్రి ఝరాసంగంలో పాత బస్టాండు కూడలి వద్ద నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. -
ఏడాదిన్నర తర్వాత హత్య కేసు ఛేదన
[ 11-05-2024]
ఏడాదిన్నర కిందట మూసేసిన కేసును సాంకేతికతను వినియోగించి పోలీసులు ఛేదించారు. కామారెడ్డి జిల్లాకేంద్రంలో డీఎస్పీ నాగేశ్వర్రావుతో కలిసి శిక్షణ ఐపీఎస్ కాజోల్ సింగ్ వివరాలు వెల్లడించారు. -
బిడ్డా.. ఓటు మరవొద్దు!
[ 11-05-2024]
ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. రాజ్యాంగం మనకు వజ్రాయుధం వంటి ఓటుహక్కును కల్పించింది. దానిని సద్వినియోగం చేసుకోవడం మన బాధ్యత. ప్రతి ఓటు గెలుపోటములను నిర్దేశిస్తుంది. -
తప్పులకు తావు లేదిక
[ 11-05-2024]
ఉపాధ్యాయుల హాజరుకు మొన్నటి వరకు బయోమెట్రిక్ విధానం అమలులో ఉండేది. ప్రస్తుతం ఈ విద్యా సంవత్సరం నుంచి ముఖ గుర్తింపు విధానం అమలు చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. -
సందేశం.. ఆచరణీయం
[ 11-05-2024]
ఎన్నికల్లో ప్రలోభాలు ఎక్కువగా ఉంటాయనే అపవాదు ఉంది. దానిని తొలగించడానికి వివిధ రూపాల్లో ఎవరో ఒకరు స్పందిస్తుంటారు. తాజాగా లోక్సభ ఎన్నికల్లో అలాంటి అవగాహన పెంచే సందేశాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. -
హోటల్ వ్యాపారం మాటున డ్రగ్స్ దందా
[ 11-05-2024]
ప్రేమలో విఫలమైన ఒక చెఫ్ డ్రగ్స్కు అలవాటుపడి.. దాన్నే వ్యాపారంగా మార్చుకున్నాడు. చివరకు పోలీసులకు చిక్కారు. కేసు వివరాలను హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీ రష్మీ పెరుమాల్ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఓపెన్ఏఐతో యాపిల్ జట్టు..! ఇక ఐఫోన్లో చాట్జీపీటీ?
-
కడపలో షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ హెడ్ ఆఫీసులో సోదాలు
-
ఆ ఇద్దరు ఏం మాట్లాడుకున్నారో తెలియదు.. కామెంట్ చేయడం బాగోదు: గంగూలీ
-
ఏపీఎస్ ఆర్టీసీ వెబ్సైట్లో సాంకేతిక సమస్య.. టికెట్లకు ప్రయాణికుల అవస్థలు
-
చెన్నైతో మ్యాచ్.. గిల్ సహా గుజరాత్ టీమ్కు భారీ జరిమానా
-
నిజమైన ఎస్సీ కాదంటూనే కడియం కుమార్తెకు కాంగ్రెస్ టికెట్: మందకృష్ణ మాదిగ