logo

బైక్‌ర్యాలీతో ఎన్నికల ప్రచారం

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నాగిరెడ్డిపేట మండలంలోని 25 గ్రామాల్లో స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్‌రావు ఆధ్వర్యంలో ఆదివారం బైక్ ర్యాలీ నిర్వహించారు.

Updated : 28 Apr 2024 13:20 IST

నాగిరెడ్డిపేట: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నాగిరెడ్డిపేట మండలంలోని 25 గ్రామాల్లో స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్‌రావు ఆధ్వర్యంలో ఆదివారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలు ప్రజలకు లబ్ధి చేకూర్చాయని, ఈ పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి సురేష్ షేత్కర్‌కు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీధర్ గౌడ్, నాయకులు రామచంద్ర రెడ్డి, విట్టల్ రెడ్డి, షాహిద్ పా, సురేందర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని