కాలూరుకు చెందిన గర్భిణి మృతి
నిజామాబాద్ గ్రామీణ మండలం కాలూరుకు చెందిన గర్భిణి మృతిచెందడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆదివారం ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు.
ఆసుపత్రి ఎదుట గ్రామస్థుల ఆందోళన
వైద్యుడితో వాగ్వాదం చేస్తున్న కుటుంబ సభ్యులు, గ్రామస్థులు
నిజామాబాద్ వైద్యవిభాగం, న్యూస్టుడే: నిజామాబాద్ గ్రామీణ మండలం కాలూరుకు చెందిన గర్భిణి మృతిచెందడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆదివారం ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళ్తే.. స్రవంతి(35) నాలుగు నెలల గర్భిణి. శనివారం ఉదయం కడుపునొప్పి రావడంతో వీక్లీమార్కెట్ వద్ద ఉన్న ఆసుపత్రికి వెళ్లారు. స్కానింగ్ చేసి కడుపులో పిండం చనిపోయిందని, అబార్షన్ అవసరం లేదని, మాత్రలు వేసుకుంటే సరిపోతుందని చెప్పి పంపించారు. వారి సూచన మేరకు మాత్ర వేసుకుంది. శనివారం రాత్రి తీవ్ర రక్తస్రావం కావడంతో వైద్యుడికి ఫోన్ చేయగా రక్తస్రావం కోసమే మాత్ర ఇచ్చానని, రాత్రి ఆసుపత్రికి రావొద్దని చెప్పారు. అర్ధరాత్రి దాటిన తర్వాత బాధితులు మళ్లీ ఫోన్ చేయగా సదరు వైద్యుడు ఉదయం రావాలని ఫోన్ పెట్టేశారు. ఆదివారం ఉదయం ఆసుపత్రికి తీసుకురాగా తీవ్ర రక్తస్రావమవుతుందని మరో ప్రైవేటు ఆసుపత్రికి పంపించారు. అక్కడి వైద్యులు పరిశీలించి గర్భిణి మృతి చెందినట్లు గుర్తిచారు. దీంతో బాధితులు మొదట చూపించిన ఆసుపత్రికి వచ్చి వైద్యుడి నిర్లక్ష్యం వల్లే స్రవంతి మృతి చెందిందని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. జిల్లా కేంద్రంలో అబార్షన్లు చేస్తున్నా జిల్లా వైద్యారోగ్య శాఖకు పట్టడం లేదు. నిబంధనల ప్రకారం వారి అనుమతి తప్పనిసరి. కానీ, ఇవేవీ లేకుండానే మాత్రతో గర్భవిచ్ఛిత్తికి ప్రయత్నించారు. జిల్లా కేంద్రంలో పలు చోట్ల అబార్షన్ల పేరుతో గర్భిణుల ప్రాణాల మీదకు తెస్తున్నారు. మాత్ర ఇస్తే తప్పనిసరిగా ఆసుపత్రిలో చేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ విషయమై జిల్లా వైద్యాధికారి సుదర్శనంను ‘న్యూస్టుడే’ వివరణ కోరగా.. ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి సదరు ఆసుపత్రిపై విచారణ చేస్తామన్నారు. వైద్యులు, కుటుంబ సభ్యులతో మాట్లాడి నివేదిక ఇస్తారు.. ఆసుపత్రి నిర్లక్ష్యమని తేలితే కఠిన చర్యలుంటాయని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థులు... విజ్ఞాన దీపికలు
[ 15-05-2024]
గిరిరాజ్ కళాశాల విద్యార్థులు పరిశోధనల్లో రాణిస్తున్నారు. ఇందూరు సాహిత్యం, చారిత్రక, పర్యాటక, ప్రజా సంక్షేమం విషయాల సేకరణ, క్షేత్ర పర్యటనలు వంటి అంశాల్లో రాణిస్తూ అబ్బురపరుస్తున్నారు. -
చివరి ఆయకట్టుకు నీరందించండి
[ 15-05-2024]
జిల్లాలోని ముఖ్యమైన ప్రాజెక్టుల్లో రామడుగు ఒకటి. ఈ ప్రాజెక్టు ఆయకట్టు ద్వారా ధర్పల్లి, డిచ్పల్లి, జక్రాన్పల్లి, భీంగల్, వేల్పూర్ మండలాల్లోని గ్రామాలకు రెండు పంటల నీరందిస్తున్నారు. -
ఈ గ్రామాలు ఆదర్శం
[ 15-05-2024]
లోక్సభ ఎన్నికల్లో కొన్ని గ్రామాలు ఆదర్శంగా నిలిచాయి. ఎన్నికల కమిషన్ ఎన్ని స్వీప్ కార్యక్రమాలు నిర్వహించినా కొన్ని గ్రామాల్లో సరాసరిగా 75 శాతం కంటే అధికంగా పోలింగ్ నమోదు కాలేదు -
ఆలోచన అదిరే!
[ 15-05-2024]
ఎండలు మండుతున్న తరుణంలో ద్విచక్రవాహనాలపై ప్రయాణమంటే భయపడాల్సిన పరిస్థితి. దీనికి ప్రత్యామ్నాయం ఆలోచించాడు పెద్దకొడప్గల్ మండలం వడ్లం గ్రామానికి చెందిన యువకుడు బోగేష్. ఈయన హైదరాబాద్లో ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తాడు. -
పైకి గాంభీర్యం.. లోలోన లెక్కలు
[ 15-05-2024]
నిజామాబాద్ లోక్సభ స్థానంలో విజయంపై ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. పోలింగ్ ముగిసి ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉండగా.. గెలుపుపై ఎవరికి వారు తమకు అనుకూలంగా చెప్పుకొంటున్నారు. -
ప్రవేశాల పెంపునకు కసరత్తు
[ 15-05-2024]
గురుకులాలు, కేజీబీవీలు, ఆదర్శ పాఠశాలల్ని కళాశాలలుగా ఆప్గ్రేడ్ చేయడంతో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకు విద్యార్థులు మొగ్గు చూపడం లేదని అధ్యాపకులు పేర్కొంటున్నారు. -
నేడు విచారణ
[ 15-05-2024]
కామారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి లక్ష్మణ్సింగ్ వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. -
ఆలస్యంగా కొనుగోళ్లు
[ 15-05-2024]
తల్లి బిడ్డలను కంటికి రెప్పలాగా ఎలా దాచుకుంటుందో.. అన్నదాతలు సైతం ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని కాపాడుకొని నానా అవస్థలు పడి కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తే లారీలు రాక వర్షానికి తడిసి ఎండిపోతుంటే పట్టించుకునే నాథుడే కరవయ్యారు. -
పెరిగిన ఓటింగ్తో ఉత్కంఠ
[ 15-05-2024]
హోరాహోరీగా సాగిన సార్వత్రిక సమరం ముగిసింది. జహీరాబాద్ లోక్సభ పరిధిలో 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 69.67 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఈ సారి 74.63 నమోదైంది. సుమారు ఐదుశాతం మేర పోలింగ్ పెరిగింది -
ఆమె కదిలింది
[ 15-05-2024]
లోక్సభ ఎన్నికల్లోనూ అసెంబ్లీ పోలింగ్ మాదిరిగానే ఓటర్లు పోటెత్తారు. నవంబరులో శాసనసభకు నిర్వహించిన ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ఏడు స్థానాల్లో 12,39,568 ఓట్లు పోలయ్యాయి -
‘1.30 లక్షల మెజారిటీతో గెలుస్తాం’
[ 15-05-2024]
నిజామాబాద్ పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్ విజయం తథ్యమని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేశారు. -
ఉద్యోగిపై ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు
[ 15-05-2024]
విద్యుత్తు శాఖలో పనిచేసే ఉద్యోగి ఒక పార్టీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేశారనే విషయం ఆ శాఖలో గుప్పుమంటోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఎవరి లెక్కలు వారివే.. భారీ ఆధిక్యంపై కాంగ్రెస్ ధీమా
-
ఆంధ్రప్రదేశ్లో 44 రోజులు... రూ.17 వేల కోట్ల అప్పులు
-
హైదరాబాద్ జూలో తెల్ల పులి మృత్యువాత
-
మాకూ మోదీలాంటి నాయకుడు రావాలి: పాక్-అమెరికన్ వ్యాపారవేత్త
-
ప్రలోభ పెట్టినా ‘చెవి’లో పువ్వే!.. సహకరించని సొంత పార్టీ నేతలు
-
అమ్మకు మందులు తెచ్చేందుకు వెళ్లి అనంతలోకాలకు..