ఐదేళ్లలో పెరిగిన ఓటర్లు.. 1,45,912
జహీరాబాద్ లోక్సభ స్థానంలో ఓటర్ల సంఖ్య భారీగా పెరిగింది. 2014 నుంచి 2019 వరకు ఈ నియోజకవర్గంలో 53 వేల ఓటర్లు మాత్రమే పెరిగారు.
జహీరాబాద్ లోక్సభ స్థానంలో మహిళలే అధికం
పోలింగ్కేంద్రం వద్ద బారులుదీరిన ఓటర్లు(పాతచిత్రం)
కామారెడ్డి కలెక్టరేట్, న్యూస్టుడే : జహీరాబాద్ లోక్సభ స్థానంలో ఓటర్ల సంఖ్య భారీగా పెరిగింది. 2014 నుంచి 2019 వరకు ఈ నియోజకవర్గంలో 53 వేల ఓటర్లు మాత్రమే పెరిగారు. 2019 నుంచి 2024 మధ్య 1,45,912 మంది పెరగడం గమనార్హం. పెరిగిన ఓటర్లలోనూ మహిళల సంఖ్యే అధికంగా ఉంది. జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఓటర్లు అధికంగా పెరిగారు. ప్రస్తుతం అధికారులు విడుదల చేసిన తుదిజాబితా ప్రకారం జహీరాబాద్ లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం ఓటర్ల సంఖ్య 16,40,755. ఒక్క నారాయణఖేడ్ నియోజకవర్గంలో మాత్రమే మహిళా ఓటర్ల కంటే పురుష ఓటర్లు స్వల్పంగా ఎక్కువగా ఉన్నారు. మిగతా అన్ని చోట్ల మహిళలే అధికంగా ఉన్నారు.
ఏడాదంతా నమోదు
గతంలో ఓటర్ల నమోదు కార్యక్రమం ఏడాది పొడవునా సాగేది. గత ఏడాది నుంచి ఏడాదికి నాలుగుసార్లు తుదిజాబితా విడుదల చేస్తున్నారు. ప్రతి నాలుగునెలలకోసారి నమోదు కార్యక్రమాలు, తుదిజాబితాలు విడుదల చేస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశానుసారం బూత్స్థాయి అధికారులు ఇంటింటా కొత్త ఓటర్ల వివరాలు సేకరించారు. 18 సంవత్సరాలు నిండిన వారికి దరఖాస్తు ఫారాలు అందించి ఓటరుజాబితాలో పేర్లు నమోదు చేశారు. అంతేకాకుండా కళాశాలల్లో ఓటరు చైతన్య నమోదు కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో అర్హత కలిగిన ప్రతి వ్యక్తికి ఓటు హక్కు కల్పించారు. దీంతో ఓటర్ల సంఖ్య అధికంగా పెరిగింది.
పోలింగ్ కేంద్రాలకు వస్తారా..?
ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించడం సవాలుగా మారుతోంది. వేసవిలో వృద్ధులు, దివ్యాంగులకు సరైన వసతులు కల్పించకపోతే వారు ఓటు వేసేందుకు అంతగా ఆసక్తి చూపకపోవచ్చు. ప్రస్తుతం రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పెరుగుతుండడతో ఆ ప్రభావం పోలింగ్శాతంపై పడే అవకాశాలు ఉన్నట్లు అభ్యర్థులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. జహీరాబాద్ లోక్సభకు 2009లో జరిగిన ఎన్నికల్లో 74.67 శాతం, 2014లో 77.28 శాతం, 2019లో 69.70 శాతం పోలింగ్ నమోదైంది. ప్రస్తుతం ఓటర్ల సంఖ్య భారీగా పెరిగినా.. వీరందరు వచ్చి ఓటు వేయాల్సిన అవసరం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
4,78,734 మంది ఓటుకు దూరం
[ 16-05-2024]
ప్రజాస్వామ్యంలో ఓటు చాలా కీలకమైంది. ఒక్క ఓటు తేడాతో ఓడిన వారు చాలా మంది ఉన్నారు. -
వైద్యశాఖలో లైంగిక వేధింపుల కలకలం
[ 16-05-2024]
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కామారెడ్డి వైద్య ఆరోగ్యశాఖ అధికారి లక్ష్మణ్సింగ్పై బుధవారం విచారణ చేపట్టారు. -
తెవివి వీసీ పదవి ఎవరికి దక్కేనో..!
[ 16-05-2024]
తెలంగాణ విశ్వవిద్యాలయ వైస్ఛాన్స్లర్(వీసీ) పదవి ఎవరిని వరిస్తుందోననే చర్చ సాగుతోంది. -
అభివృద్ధి పనులకు ఆటంకం
[ 16-05-2024]
రాష్ట్రవ్యాప్తంగా లోక్సభ స్థానాలకు పోలింగ్ సోమవారం ముగిసింది. జూన్ నాలుగో తేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి. -
ఆదర్శంగా ఓటేశారు
[ 16-05-2024]
పార్లమెంటు ఎన్నికల్లో ప్రత్యేకంగా మహిళా, యువ, దివ్యాంగ, ఆదర్శ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. -
ఓటింగ్లో మహిళలదే పైచేయి
[ 16-05-2024]
జహీరాబాద్ లోక్సభ ఎన్నికల్లో పురుషుల కంటే మహిళలే ఎక్కువ మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
సీఎంసీలో అభ్యర్థుల భవితవ్యం
[ 16-05-2024]
లోక్సభ ఎన్నికల సమరం ముగిసింది. జూన్ 4వ తేదీన ఓట్లను లెక్కించనున్నారు. -
పండించిన పంట తిరిగి ఇచ్చేయండి!
[ 16-05-2024]
తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ రైతులతో పండించిన సెనగ పంట ధర చెల్లింపు విషయంలో ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతోంది. -
రేపటి నుంచి సినిమా థియేటర్లు బంద్
[ 16-05-2024]
రాష్ట్ర వ్యాప్తంగా సినిమా థియేటర్ల నిర్వాహకుల నిర్ణయం మేరకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈ నెల 17 నుంచి పదిహేను రోజుల పాటు సినిమా థియేటర్లు బంద్ పాటిస్తున్నారు. -
ఉపాధ్యాయురాలికి నోటీసు జారీ
[ 16-05-2024]
విద్యాశాఖ నుంచి అనుమతి లేకుండా దీర్ఘకాలికంగా విధులకు గైర్హాజరవుతున్న ఉపాధ్యాయురాలు సుహాసినికి తుది షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు డీఈవో రాజు బుధవారం తెలిపారు.