logo

బిజదలో చేరికలు.. సన్నాహక సమావేశాలు

ఎన్నికల తేదీలు దగ్గరపడుతున్నకొద్దీ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఒక పార్టీ నుంచి మరో పార్టీకి దూకుళ్లు అధికమవుతున్నాయి.

Published : 23 Apr 2024 02:48 IST

బిజదలో చేరిన వారితో భృగు బక్షిపాత్ర్‌, డాక్టర్‌ చ్యవుపట్నాయక్‌, దొళాయి తదితరులు

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: ఎన్నికల తేదీలు దగ్గరపడుతున్నకొద్దీ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఒక పార్టీ నుంచి మరో పార్టీకి దూకుళ్లు అధికమవుతున్నాయి. తాజాగా ఒక రాజకీయ పార్టీకి చెందిన పలువురు నాయకులు వందలాది మంది మద్దతుదారులతో కలిసి ఆదివారం బిజదలో చేరారు. సాయంత్రం బెంగాళీ వీధిలోని బ్రహ్మపుర లోక్‌సభ బిజద ఎన్నికల కార్యాలయంలో వారంతా బిజదలో చేరగా, వారికి పార్టీ నేతలు కండువాలు కప్పి స్వాగతించారు. కార్యక్రమంలో బ్రహ్మపుర లోక్‌సభ బిజద అభ్యర్థి భృగు బక్షిపాత్ర్‌, బ్రహ్మపుర అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్‌ రమేష్‌చంద్ర చ్యవపట్నాయక్‌, బీఈఎంసీ మేయరు సంఘమిత్ర దొళాయి, అర్బన్‌ బ్యాంకు అధ్యక్షుడు ఆర్‌.మురళీమోహన్‌ తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మపుర సిట్టింగ్‌ ఎమ్మెల్యే, గోపాలపూర్‌ అసెంబ్లీ బిజద అభ్యర్థి బిక్రం కుమార్‌ పండా నాయకత్వంలో ఆదివారం సాయంత్రం ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. గజపతినగర్‌లోని ఆయన నివాస భవనం ఎదురుగా మైదానంలో నిర్వహించిన ఇందులో పలువురు బిజద నాయకులు, బీఈఎంసీ కార్పొరేటర్లు, గోపాలపూర్‌్ నియోజకవర్గం ప్రజాప్రతినిధులు, ఇతర నాయకులు పాల్గొని వివిధ అంశాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా బిజదలో చేరిన పలువుర్ని పండా స్వాగతించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని