బిజదలో చేరికలు.. సన్నాహక సమావేశాలు
ఎన్నికల తేదీలు దగ్గరపడుతున్నకొద్దీ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఒక పార్టీ నుంచి మరో పార్టీకి దూకుళ్లు అధికమవుతున్నాయి.
బిజదలో చేరిన వారితో భృగు బక్షిపాత్ర్, డాక్టర్ చ్యవుపట్నాయక్, దొళాయి తదితరులు
బ్రహ్మపుర నగరం, న్యూస్టుడే: ఎన్నికల తేదీలు దగ్గరపడుతున్నకొద్దీ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఒక పార్టీ నుంచి మరో పార్టీకి దూకుళ్లు అధికమవుతున్నాయి. తాజాగా ఒక రాజకీయ పార్టీకి చెందిన పలువురు నాయకులు వందలాది మంది మద్దతుదారులతో కలిసి ఆదివారం బిజదలో చేరారు. సాయంత్రం బెంగాళీ వీధిలోని బ్రహ్మపుర లోక్సభ బిజద ఎన్నికల కార్యాలయంలో వారంతా బిజదలో చేరగా, వారికి పార్టీ నేతలు కండువాలు కప్పి స్వాగతించారు. కార్యక్రమంలో బ్రహ్మపుర లోక్సభ బిజద అభ్యర్థి భృగు బక్షిపాత్ర్, బ్రహ్మపుర అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ రమేష్చంద్ర చ్యవపట్నాయక్, బీఈఎంసీ మేయరు సంఘమిత్ర దొళాయి, అర్బన్ బ్యాంకు అధ్యక్షుడు ఆర్.మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మపుర సిట్టింగ్ ఎమ్మెల్యే, గోపాలపూర్ అసెంబ్లీ బిజద అభ్యర్థి బిక్రం కుమార్ పండా నాయకత్వంలో ఆదివారం సాయంత్రం ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. గజపతినగర్లోని ఆయన నివాస భవనం ఎదురుగా మైదానంలో నిర్వహించిన ఇందులో పలువురు బిజద నాయకులు, బీఈఎంసీ కార్పొరేటర్లు, గోపాలపూర్్ నియోజకవర్గం ప్రజాప్రతినిధులు, ఇతర నాయకులు పాల్గొని వివిధ అంశాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా బిజదలో చేరిన పలువుర్ని పండా స్వాగతించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘బ్రహ్మపుర’ విజేత ఎవరు?
[ 04-05-2024]
ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రాతినిధ్యం వహిస్తున్న గంజాం జిల్లాలోని బ్రహ్మపుర లోక్సభ స్థానం ప్రతిష్ఠాత్మకమైంది. -
నేడు జయశంకర్, రేపు నడ్డా, ఎల్లుండి ప్రధాని మోదీ రాష్ట్రానికి రాక
[ 04-05-2024]
విదేశాంగ మంత్రి ఎస్.జయశంకర్ శనివారం రెండు రోజుల రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. -
ఉమ్మర్కోట్లో విజయం ఎవరిదో?
[ 04-05-2024]
గత ఐదేళ్ల క్రితం వరకు బిజదకు కంచుకోటైన ఉమ్మర్కోట్ నియోజకవర్గంలో ఈసారి ఎవరు విజయం సాధిస్తారోనని ఉత్కంఠ నెలకొంది. -
కాంగ్రెస్ విజయాన్ని ఏ శక్తి ఆపలేదు: భట్టి
[ 04-05-2024]
కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్రలు చేసి, పేద, బడుగు వర్గాల ప్రజల మనస్సులు దోచిన రాహుల్గాంధీ ప్రధాని కానున్నారని, కాంగ్రెస్ విజయాన్ని ఏ శక్తి ఆపలేదని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. -
సుజాతపై ఈసీ కొరడా
[ 04-05-2024]
మిషన్ శక్తి శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి సుజాత కార్తికేయన్ను ప్రజాసంబంధాలు లేని శాఖకు తక్షణం బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
బిజదలో చేరిన జనా సామల్
[ 04-05-2024]
ఒడియా సినీనటి, భాజపా నేత జనా సామల్ శుక్రవారం ఆ పార్టీని వీడి బిజదలో చేరారు. -
నీరివ్వరా?.. ఓటు వేయం
[ 04-05-2024]
గుక్కెడు నీటి కోసం ప్రజలు అల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని రాయగడ సమితి లైలై పంచాయతీ ఖర్జీసాహి గ్రామస్థులు శుక్రవారం కలెక్టర్ కార్యాలయం వద్ద ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. -
తెలుగులో ప్రచారం
[ 04-05-2024]
ఎన్నికల దగ్గర పడుతుండడంతో ప్రచారాల హోరు పెరిగింది -
చరవాణుల వెలుగులో అంత్యక్రియలు
[ 04-05-2024]
జయపురంలోని జయనగర్ ప్రాంతంలో ఉన్న భూత్నాధ్ శ్మశానంలో విద్యుత్తు దీపాలు లేకపోవడంతో చీకట్లోనే అంత్యక్రియలు జరుపుతున్న పరిస్థితి.