పేపరుమిల్లు ఉద్యోగుల సమస్యతో రాజకీయం
జయపురం పేపరు మిల్లు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహినిపతి విఫలమయ్యారని బిజద మాజీ మంత్రి రబినారాయణ నందో ఆరోపించారు.
నేతల పరస్పర ఆరోపణలు
మీడియా సమావేశంలో మాట్లాడుతున్న రబినారాయణ నందో
జయపురం, న్యూస్టుడే: జయపురం పేపరు మిల్లు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహినిపతి విఫలమయ్యారని బిజద మాజీ మంత్రి రబినారాయణ నందో ఆరోపించారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పదేళ్లుగా బాహినిపతి ఎటువంటి చర్యలు తీసుకోలేదని, తన భార్య డా।।ఇందిరా నందోను గెలిపిస్తే రథయాత్రలోగా సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులు ఉన్నత విద్య కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా జయపురంలో ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటు చేస్తామన్నారు.
ఎమ్మెల్యే తారాప్రసాద్
ఎమ్మెల్యే తారాప్రసాద్ తన ఇంట్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గతంలో పేపరుమిల్లులో ఎలాంటి సమస్యలు లేవని, రబి నారాయణ 2009లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక మొదలయ్యాయన్నారు. 2014లో తాను గెలిచిన తరువాత ప్రభుత్వంతో పోరాడి 400 మంది ఉద్యోగులకు ఈపీఎఫ్ ఇప్పించామన్నారు. ఈ సమస్యపై దాదాపు 20 సార్లు యాజమాన్యంతో, మూడుసార్లు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్తో సమావేశమైనట్లు పేర్కొన్నారు. చేనేతశాఖ మంత్రి, జల వనరుల మంత్రి, విద్యుదత్తుశాఖా మంత్రి దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందన్నారు. మంత్రిగా ఉన్నప్పుడు రబినారాయణ ఎన్నిసార్లు అసెంబ్లీలో ఈ సమస్య ప్రస్తావించారని ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్నాథుని ఆశీస్సులెవరికి?
[ 15-05-2024]
హరి (జగన్నాథుడు) నామస్మరణతో నిరంతర మార్మోగే పూరీ తుర్పుతీర దివ్యధామంలో ఇప్పుడు రాజకీయ వేడి పెరిగింది. ఎన్నికల నేపథ్యంలో ప్రచారం ఊపందుకుంది. -
స్ట్రాంగ్రూంలో ఈవీఎంల భద్రత
[ 15-05-2024]
బ్రహ్మపుర లోక్సభ, దాని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సోమవారం ప్రశాంతంగా పోలింగు జరిగింది. -
రాయగడ జిల్లాలో 74.44 శాతం పోలింగ్
[ 15-05-2024]
తొలిదశలో సోమవారం జరిగిన ఎన్నికల్లో రాయగడ జిల్లాలో 74.44 శాతం పోలింగ్ జరిగింది. మూడు నియోజకవర్గాలున్న జిల్లాలో బిసంకటక్ శాసనసభ స్థానంలో అత్యధికంగా 77.93 శాతం పోలింగ్ నమోదైంది. -
కోస్తా, తీర, పశ్చిమ జిల్లాల్లో ప్రచారం ముమ్మరం
[ 15-05-2024]
ఉత్తరకోస్తా, తీర, పశ్చిమ జిల్లాల్లో ఈ నెల 20, 25, జూన్ 1 తేదీల్లో పోలింగ్ జరగనుండగా ఎన్నికల ప్రచారం ఊపందుకుంది -
తెలుగు ఓటర్లవైపు పార్టీల చూపు
[ 15-05-2024]
లోక్సభ ఎన్నికల్లో తెలుగు ఓటర్లను ఆకర్షించడానికి తృణమూల్ కాంగ్రెస్, భాజపా, వామపక్ష పార్టీల కూటమి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి -
నేడు కటక్లో అమిత్షా రోడ్షో
[ 15-05-2024]
కేంద్ర హోంమంత్రి అమిత్షా బుధవారం సాయంత్రం కటక్ వస్తున్నారు. భాజపా నగరశాఖ ఆధ్వర్యంలో 10 కిలోమీటర్ల మేర రోడ్షో నిర్వహించనున్నట్లు పార్టీ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షుడు గోలక్ మహాపాత్ర్ మంగళవారం భువనేశ్వర్లో విలేకరులకు చెప్పారు. -
ఇలా వస్తానని... అలా మాయమైంది
[ 15-05-2024]
ఇప్పుడే వస్తానని తోటి మహిళను నమ్మించి, ఆమె చేతిలో శిశువును పెట్టి ఓ మాతృమూర్తి పరారైంది. -
చకచకా రథ చక్రాల పనులు
[ 15-05-2024]
తెల్లవారక ముందే స్నానం, తర్వాత పురుషోత్తమ దర్శనం... స్వామి తీర్థ ప్రసాదాల ఆరగింత... అనంతరం శ్రీక్షేత్ర కార్యాలయం ఆవరణలో ఏర్పాటైన చలవ పందిరికి చేరుకుని రథచక్రాల పనులు.. ఇవీ ప్రస్తుతం శ్రీక్షేత్రం ఆవరణలో మహరణా (వడ్రంగి) సేవాయత్ల నిత్యకృత్యాలు. జులై 7న ఇక్కడ విశ్వప్రసిద్ధ రథయాత్ర నిర్వహించనున్నారు. -
బ్రహ్మపుర లోక్సభ భాజపా అభ్యర్థి ప్రదీప్పై దాడి
[ 15-05-2024]
బ్రహ్మపుర లోక్సభ నియోజకవర్గం భాజపా అభ్యర్థి ప్రదీప్ కుమార్ పాణిగ్రహిపై బ్రహ్మపుర అసెంబ్లీ సెగ్మెంట్ స్వతంత్ర అభ్యర్థి శిబశంకర దాస్ (పింటు దాస్) సోమవారం రాత్రి దాడి చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ముసుగు మనుషుల దాడి: డ్రగ్లార్డ్ ‘ది ఫ్లై’ని విడిపించుకొని పారిపోయిన గ్యాంగ్..!
-
పవర్ప్లేలో వికెట్లు కోల్పోవడం పెద్ద దెబ్బే: కేఎల్ రాహుల్
-
మాజీ మంత్రి అఖిలప్రియ బాడీగార్డ్పై హత్యాయత్నం
-
తెలంగాణలో రెండు వారాలు సినిమా ప్రదర్శనల నిలిపివేత!
-
గో డిజిట్ ఐపీఓ ప్రారంభం.. పూర్తి వివరాలివే..
-
హార్దిక్ టైటిల్ విన్నింగ్ కెప్టెన్.. వారిద్దరు ఐపీఎల్లో ఏం సాధించారు?: గంభీర్