logo

బోర్ వెల్ వ్యాన్ బోల్తా.. 12 మందికి గాయాలు

బోర్‌వెల్‌ వ్యాన్ బోల్తా పడి 12మంది గాయపడ్డారు. ఈ ఘటన ఆదివారం ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లాలో జరిగింది.

Published : 28 Apr 2024 13:03 IST

పర్లాఖెముండి :  బోర్‌వెల్‌ వ్యాన్ బోల్తా పడి 12మంది గాయపడ్డారు. ఈ ఘటన ఆదివారం ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లాలో జరిగింది.  మోహన, దిగపోండి అగ్నిమాపక  శాఖ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం..  ఒడిశా రాష్ట్రం గజపతి సరిహద్దు ప్రాంతమైన బెల్లగూడ గ్రామ సమీపంలో మలుపు వద్ద  ఘాట్‌ రోడ్డుపై ప్రయాణిస్తున్న బోర్ వెల్ వ్యాను అదుపుతప్పి బోల్తా పడింది. వ్యానులో ప్రయాణిస్తున్న 12 మంది కార్మికుల్లో..  ఎనిమిది మంది స్వల్పంగా, నలుగురు తీవ్రంగా  గాయపడ్డారు. సమాచారం అందుకున్న మోహన, దిగపోండి అగ్నిమాపక శాఖ  సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని  క్షతగాత్రులను దిగపోండి ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు. 
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని