logo

లారీని ఢీకొన్న బస్సు.. ఇద్దరు మృతి

లారీని వెనక నుంచి బస్సు ఢీకొట్టిన ఘటన కటక్‌ నగరానికి చేరువగా 57వ నెంబరు రహదారి హరడాజల్‌ జంక్షన్‌ వద్ద చోటుచేసుకుంది.

Published : 28 Apr 2024 13:04 IST

భువనేశ్వర్‌: లారీని వెనక నుంచి బస్సు ఢీకొట్టిన ఘటన కటక్‌ నగరానికి చేరువగా 57వ నెంబరు రహదారి హరడాజల్‌ జంక్షన్‌ వద్ద చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల  ప్రకారం.. 40 మంది ప్రయాణికులతో జయపురం నుంచి కటక్‌వైపు ఓ బస్సు వెళ్తోంది. అతివేగంగా వెళ్తూ  హరడాజల్‌ జంక్షన్‌ వెనక లారీని వెనక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌, హెల్పర్‌ అక్కడిక్కడే మృతి చెందారు. బస్సులోని ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టు మార్టంకు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు