పొట్టంగిలో అన్నతో చెల్లి పోటీ
పొట్టంగి నియోజకవర్గంలో ఎన్నికలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో ఎన్నికల బరిలో ఉన్న అధికార బిజద పార్టీ అభ్యర్థి ప్రఫుల్ల కుమార్ పంగితో ఆయన చెల్లి అంబికా పంగి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ పడుతుండడం చర్చనీయాంశమైంది.
సిమిలిగుడ, న్యూస్టుడే: పొట్టంగి నియోజకవర్గంలో ఎన్నికలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో ఎన్నికల బరిలో ఉన్న అధికార బిజద పార్టీ అభ్యర్థి ప్రఫుల్ల కుమార్ పంగితో ఆయన చెల్లి అంబికా పంగి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ పడుతుండడం చర్చనీయాంశమైంది. పొట్టంగిలో ఈసారి పదిమంది నామినేషన్లు వేయగా అందులో అధికంగా స్వతంత్ర అభ్యర్థులున్న విషయం తెలిసిందే. మాజీ మంత్రి జయరామ్ పంగి కుమార్తె అంబికా గతంలో జిల్లా పరిషత్ సభ్యురాలిగా, సమితి సభ్యురాలిగా చేశారు. ప్రస్తుతం ఆమె పెద్దనాన్న కుమారుడు ప్రఫుల్ల బిజద తరఫున పోటీ చేస్తుండగా, అంబికా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. దీంతో పొట్టంగిలో అన్నాచెల్లెలి మధ్య పోటీ నెలకొంది. ఒకే కుటుంబం నుంచి ఇద్దరు అభ్యర్థులు పోటీలో ఉండడంతో ఇక్కడ ఓట్లు చీలే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అంబికా కాంగ్రెస్ తరఫున టికెట్ ఆశించి రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగారు. ప్రఫుల్ల తన చెల్లిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. సోమవారం నామినేషన్ల ఉపసంహరణ జరగనుంది. అంబికా పోటీ నుంచి తప్పుకుంటారో, అన్నతో తలపడతారో వేచి చూడాల్సిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజధాని స్థానం... ఎవరి సొంతం?
[ 14-05-2024]
రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్న రాజధాని నగరంలో ఎన్నికల వేడి ఎండ తీవ్రతను మించిపోయింది. -
ఓటేసిన అభ్యర్థులు.. ప్రముఖులు
[ 14-05-2024]
బ్రహ్మపుర లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకులు సోమవారం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
స్వల్ప ఘటనలు మినహా తొలివిడత ప్రశాంతం
[ 14-05-2024]
రాష్ట్రంలో సోమవారం తొలివిడత పోలింగులో స్వల్ప ఘటనలు మినహాయిస్తే ప్రశాంతంగా జరిగినట్లు ప్రధాన ఎన్నికల అధికారి (ఎస్ఈసీ) నికుంజబిహారీ ధొళో భువనేశ్వర్లో విలేకరులకు చెప్పారు. -
పోలింగ్ బహిష్కరణ...
[ 14-05-2024]
మొదటివిడత పోలింగు రోజున పలు జిల్లాల్లోని గ్రామాల ప్రజలు పోలింగ్ను బహిష్కరించారు. -
ముగ్గురు ప్రిసైడింగ్ అధికారులపై చర్యలు
[ 14-05-2024]
రాష్ట్రంలో తొలివిడత పోలింగ్లో అక్రమానికి పాల్పడిన ముగ్గురు ప్రిసైడింగ్ అధికారులపై చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (ఎస్ఈసీ) నికుంజ బిహారీ ధొళొ సోమవారం సాయంత్రం భువనేశ్వర్లో విలేకరులకు చెప్పారు. -
ఉత్సాహంగా ఓట్ల పండగలో...
[ 14-05-2024]
రాష్ట్రంలో తొలివిడత పోలింగ్ సోమవారం పూర్తయింది. ఎండను సైతం లెక్క చేయకుండా ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. -
ఆనందమానందమాయె
[ 14-05-2024]
చందనయాత్ర నేపథ్యంలో పూరీ తూర్పు తీరధామం ఆనందసాగరాన్ని తలపిస్తోంది. -
బైజయంత్కు మతి భ్రమించింది: అమర్
[ 14-05-2024]
భాజపా నేత బైజయంత్ పండాకు మతి భ్రమించిందని బిజద అధికార ప్రతినిధి అమర్ పట్నాయక్ అన్నారు. -
మూడు ట్రక్కుల ఢీ
[ 14-05-2024]
ఘటాల్- పంచుకురా రహదారిపై ఆదివారం మూడు ట్రక్కులు ఒకదానికొకటి ఢీ కొన్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
హోర్డింగ్ కూలిన ఘటనలో 14కు చేరిన మృతులు.. యాడ్ ఏజెన్సీపై కేసు
-
టీ20 వరల్డ్కప్.. హార్దిక్ను ఎంపిక చేయడం రోహిత్కు ఇష్టం లేదా..?
-
సీఎం ఇంట్లో ఎంపీపై దాడి: ఎవరీ బిభవ్ కుమార్..?
-
ఇరాన్తో డీల్.. భారత్కు అమెరికా వార్నింగ్..!
-
వారణాసితో నా బంధం విడదీయలేనిది: ఎమోషనల్ వీడియో షేర్ చేసిన ప్రధాని మోదీ
-
కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు ‘మహా’తలపోటు