మగువ.. ప్రచారంలో తెగువ
ఎన్నికల ప్రచారం ఊపందుకున్న తరుణంలో మహిళలు ముందంజలో ఉన్నారు. మగవారికి ఏమాత్రం తీసిపోకుండా పాదయాత్రలు, రోడ్షోలు, బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు.
ఓటర్లకు చేరువవుతున్న నేతలు
భువనేశ్వర్, న్యూస్టుడే: ఎన్నికల ప్రచారం ఊపందుకున్న తరుణంలో మహిళలు ముందంజలో ఉన్నారు. మగవారికి ఏమాత్రం తీసిపోకుండా పాదయాత్రలు, రోడ్షోలు, బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. వివిధ వార్డులు, బస్తీల్లో ఇంటింటికీ తిరిగి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. వ్యాయామం, నడక కోసం వచ్చేవారితో ఉదయాన్నే మాట కలుపుతూ తమకు ఓట్లు ఎందుకు వేయాలో వివరించి గెలిపించమని అడుగుతున్నారు.
ముందంజలో అపరాజిత
భువనేశ్వర్ సిటింగ్ ఎంపీ అపరాజిత షడంగి ఐఏఎస్ మాజీ అధికారి. ప్రభుత్వ ఉన్నతాధికారిణిగా మన్ననలందుకున్నారు. వీఆర్ఎస్ తీసుకుని గతసారి ఎన్నికల బరిలో దిగిన ఆమె భువనేశ్వర్ లోక్సభ స్థానానికి భాజపా అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు. గత అయిదేళ్లు రాజధాని ప్రాంతాలకు ఉత్తమ సేవలందించిన అపరాజిత ఈసారి మళ్లీ బరిలో ఉన్నారు. ప్రచారంలో ప్రత్యర్థుల కంటే ముందంజలో ఉన్న ఆమె ఓటర్లకు దగ్గరవుతున్నారు.
- బిజు, నవీన్ మంత్రివర్గాల్లో కీలకమైన ఆర్థిక, వ్యవసాయ శాఖ మంత్రిగా విధులు నిర్వహించిన రామకృష్ణ పట్నాయక్ కుమార్తె అనితా శుభదర్శిని ఈసారి ఎన్నికల్లో అస్కా లోక్సభ భాజపా అభ్యర్థిగా రంగంలో నిలిచారు. మరో బిజద దివంగత నేత హరప్రసాద్ సాహు కుమార్తె రంజితా సాహును ముఖ్యమంత్రి నవీన్ నిలిపారు. అనితా, రంజితాలు ఉన్నత విద్యావంతులు. తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలిచారు. ప్రచారంలో నువ్వా? నేనా? అన్న రీతిలో పోటీపడి ఓటర్లకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు.
జగత్సింగ్పూర్లో బిజద అభ్యర్థి రాజశ్రీ మల్లిక పాదయాత్ర
అంతఃపురం నుంచి జనాల మధ్యకు...
రాణులు ప్రజల ముందుకు రారు. అంతఃపురంలో ఉంటారన్నది నిన్నటి మాట. ప్రజాస్వామ్య వ్యవస్థ బలపడిన తర్వాత వారు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ప్రజల మధ్యకు వస్తున్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్ తర్వాత ఒడిశాలో రాజులు, రాణుల ప్రభావం నేటికీ కొనసాగుతోంది. కలహండి రాజు అర్కకేసరిదేవ్ 2014 నుంచి 2019 వరకు బిజద ఎంపీ, గతసారి ఆయనకు సీఎం టిక్కెట్టు ఇవ్వలేదు. తర్వాత ఆయన, భార్య మాళవిక దేవి భాజపాలో చేరారు. ఈసారి ఎన్నికల్లో కమలదళం సిటింగ్ ఎంపీ బసంత పండాను కాదని మాళవికను అభ్యర్థిగా చేసింది. తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలో ఉన్న మాళవిక పాదయాత్రలు చేస్తూ ఓటర్లకు దగ్గరవుతున్నారు.
మరో విజయానికి తహతహ
తహసీల్దారుగా విధులు నిర్వహించి గతసారి ఎన్నికల సమయంలో ఉద్యోగానికి రాజీనామా చేసి బిజదలో చేరి జాజ్పూర్ ఎంపీ అయిన శర్మిష్ఠ శెఠిని నవీన్ ఈసారి మళ్లీ పోటీకి అవకాశం ఇచ్చారు. ఇదివరకు బిజదకు స్టార్ ప్రచారకురాలిగా సీఎం వెంట ఉన్న ప్రముఖ ఒడియా సినీనటి బర్షా ప్రియదర్శిని ఈసారి జాజ్పూర్ లోక్సభ సెగ్మెంటులోని బొడొచొణా అసెంబ్లీ స్థానం నుంచి బిజద అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. శర్మిష్ఠ, బర్షాలు ఇద్దరు కలిసి ప్రస్తుతం ప్రచారంలో తలమునకలై ఉన్నారు.
మరో ఛాన్స్ కోసం
జగత్సింగ్పూర్ ప్రస్తుత లోక్సభ సభ్యురాలు రాజశ్రీ మల్లిక్ మళ్లీ బిజద అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గడిచిన అయిదేళ్లు ప్రజలకు చేసిందేమీ లేదన్న అపవాదు ఉంది. ఈసారి రాజశ్రీకి మళ్లీ టిక్కెట్టు కేటాయించరన్న అంచనాల మధ్య నవీన్ మళ్లీ ఆమెను నిలబెట్టారు. తప్పులుంటే క్షమించాలని, తాను ఈ ప్రాంతాలకు దూరం కాలేదని, మరో అవకాశమిస్తే తానేమిటో నిరూపించుకుంటానని రాజశ్రీ ముమ్మర ప్రచారం చేస్తున్నారు. పాదయాత్రŸగా ఇంటింటికి వెళ్లి ఓటర్లకు విన్నవిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజధాని స్థానం... ఎవరి సొంతం?
[ 14-05-2024]
రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్న రాజధాని నగరంలో ఎన్నికల వేడి ఎండ తీవ్రతను మించిపోయింది. -
ఓటేసిన అభ్యర్థులు.. ప్రముఖులు
[ 14-05-2024]
బ్రహ్మపుర లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకులు సోమవారం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
స్వల్ప ఘటనలు మినహా తొలివిడత ప్రశాంతం
[ 14-05-2024]
రాష్ట్రంలో సోమవారం తొలివిడత పోలింగులో స్వల్ప ఘటనలు మినహాయిస్తే ప్రశాంతంగా జరిగినట్లు ప్రధాన ఎన్నికల అధికారి (ఎస్ఈసీ) నికుంజబిహారీ ధొళో భువనేశ్వర్లో విలేకరులకు చెప్పారు. -
పోలింగ్ బహిష్కరణ...
[ 14-05-2024]
మొదటివిడత పోలింగు రోజున పలు జిల్లాల్లోని గ్రామాల ప్రజలు పోలింగ్ను బహిష్కరించారు. -
ముగ్గురు ప్రిసైడింగ్ అధికారులపై చర్యలు
[ 14-05-2024]
రాష్ట్రంలో తొలివిడత పోలింగ్లో అక్రమానికి పాల్పడిన ముగ్గురు ప్రిసైడింగ్ అధికారులపై చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (ఎస్ఈసీ) నికుంజ బిహారీ ధొళొ సోమవారం సాయంత్రం భువనేశ్వర్లో విలేకరులకు చెప్పారు. -
ఉత్సాహంగా ఓట్ల పండగలో...
[ 14-05-2024]
రాష్ట్రంలో తొలివిడత పోలింగ్ సోమవారం పూర్తయింది. ఎండను సైతం లెక్క చేయకుండా ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. -
ఆనందమానందమాయె
[ 14-05-2024]
చందనయాత్ర నేపథ్యంలో పూరీ తూర్పు తీరధామం ఆనందసాగరాన్ని తలపిస్తోంది. -
బైజయంత్కు మతి భ్రమించింది: అమర్
[ 14-05-2024]
భాజపా నేత బైజయంత్ పండాకు మతి భ్రమించిందని బిజద అధికార ప్రతినిధి అమర్ పట్నాయక్ అన్నారు. -
మూడు ట్రక్కుల ఢీ
[ 14-05-2024]
ఘటాల్- పంచుకురా రహదారిపై ఆదివారం మూడు ట్రక్కులు ఒకదానికొకటి ఢీ కొన్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
చరణ్ వల్లే ఆ డిప్రెషన్ నుంచి బయటపడ్డా: ఉపాసన
-
హోర్డింగ్ కూలిన ఘటనలో 14కు చేరిన మృతులు.. యాడ్ ఏజెన్సీపై కేసు
-
టీ20 వరల్డ్కప్.. హార్దిక్ను ఎంపిక చేయడం రోహిత్కు ఇష్టం లేదా..?
-
సీఎం ఇంట్లో ఎంపీపై దాడి: ఎవరీ బిభవ్ కుమార్..?
-
ఇరాన్తో డీల్.. భారత్కు అమెరికా వార్నింగ్..!
-
వారణాసితో నా బంధం విడదీయలేనిది: ఎమోషనల్ వీడియో షేర్ చేసిన ప్రధాని మోదీ