logo

జగన్‌ బస్సులనూ వదల్లే

గత రెండు రోజులుగా ఉత్తరాంధ్రలో ఆర్టీసీ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యమంత్రి సిద్ధం సభలకు బస్సులన్నీ వెళ్లిపోవడంతో చాలామంది తమ ప్రయాణాలను సైతం వాయిదా వేసుకున్నారు.

Published : 25 Apr 2024 04:30 IST

ఖాళీగా దర్శనమిస్తున్న విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్‌

విజయనగరం కోట, న్యూస్‌టుడే: గత రెండు రోజులుగా ఉత్తరాంధ్రలో ఆర్టీసీ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యమంత్రి సిద్ధం సభలకు బస్సులన్నీ వెళ్లిపోవడంతో చాలామంది తమ ప్రయాణాలను సైతం వాయిదా వేసుకున్నారు. మంగళవారం చెల్లూరులో జరిగిన సభ కోసం ఏకంగా 1100 బస్సులు సమకూర్చారు. బుధవారం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో జరిగిన సభకు విజయనగరం డిపో నుంచి 72, శృంగవరపుకోట డిపో నుంచి 40 వెళ్లాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సర్వీసుల కోసం గంటల తరబడి ఎదురు చూశారు. ముఖ్యంగా శ్రీకాకుళం వైపు వెళ్లే సర్వీసులు లేకపోవడంతో ఇక్కట్లు ఎదురయ్యాయి.

కిక్కిరిసిన శ్రీకాకుళం బస్సు ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న ప్రయాణికులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని