పోలింగ్ శాతాన్ని పెంచేందుకు చర్యలు
స్వీప్ కార్యక్రమాల్లో భాగంగా ఓటర్లను చైతన్య పరిచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని జిల్లా ఎన్నికల అధికారిణి, కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు.
గోడప్రతులు ఆవిష్కరిస్తున్న కలెక్టర్ నాగలక్ష్మి, అధికారులు
విజయనగరం ఉడాకాలనీ, న్యూస్టుడే: స్వీప్ కార్యక్రమాల్లో భాగంగా ఓటర్లను చైతన్య పరిచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని జిల్లా ఎన్నికల అధికారిణి, కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. ఓటు ప్రాముఖ్యతను తెలియజేసే గోడప్రతులను శనివారం తన ఛాంబర్లో ఆవిష్కరించారు. అన్ని సచివాలయాలు, ఆర్టీసీ బస్సులు, గ్రామాల్లోని ఖాళీ గోడలపై అంటించి అవగాహన కల్పించాలన్నారు. పోలింగ్ శాతం పెంపుపై దృష్టి సారించామని చెప్పారు. కలెక్టరేట్ వద్ద సెల్ఫీ పాయింట్, మోడల్ పోలింగ్ బూత్ ఏర్పాటు, ఫ్లాష్ మాబ్ తదితర కార్యక్రమాలు ఉంటాయన్నారు. సహాయక కలెక్టర్ వెంకట త్రివినాగ్, డీఆర్వో అనిత, స్వీప్ నోడల్ అధికారి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
నియోజకవర్గాల కేటాయింపు: విజయనగరం ఉడాకాలనీ, న్యూస్టుడే: ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని నియోజకవర్గాలకు అవసరమైన పీవో, ఏపీవో, ఓపీవోల కేటాయింపు ప్రక్రియ శనివారం పూర్తయింది. కలెక్టర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకులు హనీష్ చాబ్రా, సీతారాం జాట్, కలెక్టర్ నాగలక్ష్మి తదితరుల పర్యవేక్షణలో కేటాయింపు సాగింది. 12,522 మందిలో 2087 మంది పీవోలు, ఏపీవోలు ఉన్నారు. జేసీ కార్తీక్, సహాయ కలెక్టర్ వెంకట త్రివినాగ్, డీఆర్వో అనిత పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఖాకీలపైనే లాఠీన్యం
[ 12-05-2024]
ఉద్యోగులకు అది చేస్తాం.. ఇది చేస్తాం అని మాటలు చెప్పి.. వారికి తీరని అన్యాయం చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్కే దక్కుతుంది. నెత్తిన టోపీతో శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం శ్రమించే వారికి జగన్ పెద్ద టోపీˆయే పెట్టారు. -
మౌలిక సౌకర్యాల మాటే మరిచారు
[ 12-05-2024]
భామిని మండలంలోని తువ్వ కొండల్లో నం.129 మణిగ పోలింగ్ కేంద్రం ఉంది. యాతంగూడ, మూలగూడ, చీమలగూడ, భూర్జగూడ, పెద్దమూలగూడ గ్రామాల నుంచి గిరిజన ఓటర్లు ఏడు కిలోమీటర్లు దూరం నడిచి ఇక్కడికి చేరుకోవాల్సి ఉంది. -
కొఠియాపై సర్కారు ఖిన్ను
[ 12-05-2024]
రాష్ట్రాల విభజన సమయంలో కొఠియాలోని 21 గ్రామాలపై వివాదం నెలకొంది. 1965లో ఆ గ్రామాలు తమవేనని ఒడిశా తొలిసారి కోర్టుకు వెళ్లగా స్టేటస్కో ఇచ్చింది. -
291 సమస్యాత్మక కేంద్రాల గుర్తింపు
[ 12-05-2024]
సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు యంత్రాంగం సన్నద్ధమైంది. నాలుగు నియోజకవర్గాల్లో 7,83,440 మంది ఓటర్లు ఉన్నారు. -
మైళ్లకొద్ది నడవాలి.. కొండలు, వాగులూ దాటి వెళ్లాలి
[ 12-05-2024]
పాచిపెంట మండలంలో గిరిశిఖర గ్రామాల ప్రజలు ఓటేయాలంటే వాగులు, వంకలు దాటాలి. మైళ్ల దూరం నడిచి పోలింగు కేంద్రాలకు చేరుకోవాలి. కొండల మీదుగా ఉన్న అధ్వానదారులతో నరకయాతన పడాలి. -
‘మందు’ జాగ్రత్త..
[ 12-05-2024]
సాధారణ ఎన్నికల సందర్భంగా శనివారం సాయంత్రం నుంచి మద్యనిషేధం అమల్లోకి వచ్చింది. ఉదయం మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. -
ఎన్నికల ప్రచారానికి తెర
[ 12-05-2024]
సాధారణ ఎన్నికల ప్రచారం శనివారం ముగియడంతో రాజకీయ పార్టీల ప్రచార వాహనాలు పార్టీ కార్యాలయాలకు చేరాయి. -
ఎన్ని‘కల’లో!!
[ 12-05-2024]
కర్ర ఒంపును పొయ్యి తీస్తుందంటారు. అధికారం చేతిలో ఉందని ఇష్టారాజ్యంగా వ్యవహరించి వేధిస్తే జనాలకూ ఓ రోజు వస్తుంది. ఆ రోజు మాత్రం ఓటరే మారాజు.
తాజా వార్తలు (Latest News)
-
‘త్రినయని’ సీరియల్ నటి పవిత్రా జయరాం దుర్మరణం
-
రూ.58, రూ.59తో బీఎస్ఎన్ఎల్లో 2 కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు
-
తొలిసారిగా పంది కిడ్నీ మార్పిడి చేయించుకున్న వ్యక్తి మృతి
-
పంత్ లేకపోవడం వారికి నష్టమే.. మమ్మల్ని దిల్లీ ఓడించడం కష్టమే: బెంగళూరు కోచ్
-
విరాట్ కోహ్లీపై విమర్శలు వద్దు.. మరింత ప్రమాదకరంగా మారతాడు: హేడెన్
-
112 ఏళ్ల నుంచి తప్పనిసరి ఓటింగ్..!