కూటమి గెలిస్తే స్వర్ణాంధ్రప్రదేశ్
రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్గా మారాలంటే కూటమి గెలుపు అవసరమని తెదేపా విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు కిమిడి నాగార్జున అన్నారు.
మాట్లాడుతున్న నాగార్జున, చిత్రంలో కలిశెట్టి, అదితి, యశస్వి
విజయనగరం అర్బన్, న్యూస్టుడే: రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్గా మారాలంటే కూటమి గెలుపు అవసరమని తెదేపా విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు కిమిడి నాగార్జున అన్నారు. శనివారం అశోక్బంగ్లాలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్మోహన్రెడ్డి రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. ఎక్కడ చూసినా దౌర్జన్యాలు, కక్ష పూరిత చర్యలేనన్నారు. రాజకీయంగా ప్రతిపక్షాలను అణగదొక్కాలనే ఆలోచన తప్ప.. ప్రజా ప్రయోజనాలను పక్కన పెట్టేశారని మండిపడ్డారు. దీంతో అన్ని రంగాల్లో రాష్ట్రం దివాలా తీసిందన్నారు. సంక్షేమం పేరుతో రూ.10 ఇచ్చి, రూ.100 వసూలు చేశారని విమర్శించారు. పన్నులు, ధరలు పెంచి దోచేశారన్నారు. ఓటర్లు ఆలోచించి, కూటమి అభ్యర్థులకు మద్దతు తెలపాలని కోరారు. ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు, విజయనగరం ఎమ్మెల్యే అభ్యర్థిని అదితి గజపతిరాజు, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యశస్వి, మాజీ ఎమ్మెల్యే కేఏ.నాయుడు, భాజపా నాయకులు ఎస్.లక్ష్మీనరసింహం, ఇమంది సుధీర్, తెదేపా రాష్ట్ర పరిశీలకుడు కర్రోతు నర్సింగరావు పాల్గొన్నారు.
మీసాల గీతతో సమావేశం
ఈనాడు, విజయనగరం: రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కూటమి విజయం అవసరమని, దీనికి గానూ నాయకులంతా సహకరించాలని విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు కిమిడి నాగార్జున కోరారు. మాజీ ఎమ్మెల్యే మీసాల గీతను శనివారం ఆమె నివాసంలో కలిశారు. ఆమె స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన నేపథ్యంలో చర్చించారు. పార్టీ పరంగా అండగా ఉంటామని, అధినేతతో మాట్లాడాలని కోరారు. నామినేషన్ను ఉపసంహరించుకోవాలని సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఖాకీలపైనే లాఠీన్యం
[ 12-05-2024]
ఉద్యోగులకు అది చేస్తాం.. ఇది చేస్తాం అని మాటలు చెప్పి.. వారికి తీరని అన్యాయం చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్కే దక్కుతుంది. నెత్తిన టోపీతో శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం శ్రమించే వారికి జగన్ పెద్ద టోపీˆయే పెట్టారు. -
మౌలిక సౌకర్యాల మాటే మరిచారు
[ 12-05-2024]
భామిని మండలంలోని తువ్వ కొండల్లో నం.129 మణిగ పోలింగ్ కేంద్రం ఉంది. యాతంగూడ, మూలగూడ, చీమలగూడ, భూర్జగూడ, పెద్దమూలగూడ గ్రామాల నుంచి గిరిజన ఓటర్లు ఏడు కిలోమీటర్లు దూరం నడిచి ఇక్కడికి చేరుకోవాల్సి ఉంది. -
కొఠియాపై సర్కారు ఖిన్ను
[ 12-05-2024]
రాష్ట్రాల విభజన సమయంలో కొఠియాలోని 21 గ్రామాలపై వివాదం నెలకొంది. 1965లో ఆ గ్రామాలు తమవేనని ఒడిశా తొలిసారి కోర్టుకు వెళ్లగా స్టేటస్కో ఇచ్చింది. -
291 సమస్యాత్మక కేంద్రాల గుర్తింపు
[ 12-05-2024]
సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు యంత్రాంగం సన్నద్ధమైంది. నాలుగు నియోజకవర్గాల్లో 7,83,440 మంది ఓటర్లు ఉన్నారు. -
మైళ్లకొద్ది నడవాలి.. కొండలు, వాగులూ దాటి వెళ్లాలి
[ 12-05-2024]
పాచిపెంట మండలంలో గిరిశిఖర గ్రామాల ప్రజలు ఓటేయాలంటే వాగులు, వంకలు దాటాలి. మైళ్ల దూరం నడిచి పోలింగు కేంద్రాలకు చేరుకోవాలి. కొండల మీదుగా ఉన్న అధ్వానదారులతో నరకయాతన పడాలి. -
‘మందు’ జాగ్రత్త..
[ 12-05-2024]
సాధారణ ఎన్నికల సందర్భంగా శనివారం సాయంత్రం నుంచి మద్యనిషేధం అమల్లోకి వచ్చింది. ఉదయం మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. -
ఎన్నికల ప్రచారానికి తెర
[ 12-05-2024]
సాధారణ ఎన్నికల ప్రచారం శనివారం ముగియడంతో రాజకీయ పార్టీల ప్రచార వాహనాలు పార్టీ కార్యాలయాలకు చేరాయి. -
ఎన్ని‘కల’లో!!
[ 12-05-2024]
కర్ర ఒంపును పొయ్యి తీస్తుందంటారు. అధికారం చేతిలో ఉందని ఇష్టారాజ్యంగా వ్యవహరించి వేధిస్తే జనాలకూ ఓ రోజు వస్తుంది. ఆ రోజు మాత్రం ఓటరే మారాజు.
తాజా వార్తలు (Latest News)
-
విరాట్ కోహ్లీపై విమర్శలు వద్దు.. మరింత ప్రమాదకరంగా మారతాడు: హేడెన్
-
112 ఏళ్ల నుంచి తప్పనిసరి ఓటింగ్..!
-
11 నెలల తర్వాత ఓటీటీలోకి వస్తున్న రొమాంటిక్ కామెడీ మూవీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సంజూ క్యాచ్ ఔట్ నిర్ణయం ఆలస్యం వల్లే.. పంత్పై మ్యాచ్ బ్యాన్: గంగూలీ
-
ఘర్షణలున్నా చైనాతో వాణిజ్యం అందుకే పెరుగుతోంది : జైశంకర్