ఇళ్లన్నావ్.. రోడ్డున పడేశావ్
పేదల సొంతింటి కల నెరవేరుస్తామని ఆశలు పెంచి, హామీలు గుప్పించిన జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత మోసం చేశారు. ఐదేళ్లుగా సొంత గూడులేని వారి గోడును పట్టించుకోకుండా నిర్లక్ష్య వైఖరి అవలంబించారు.
బొబ్బిలిలో అసంపూర్తిగా ఉన్న టిడ్కో ఇళ్ల నిర్మాణం
న్యూస్టుడే, బొబ్బిలి: పేదల సొంతింటి కల నెరవేరుస్తామని ఆశలు పెంచి, హామీలు గుప్పించిన జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత మోసం చేశారు. ఐదేళ్లుగా సొంత గూడులేని వారి గోడును పట్టించుకోకుండా నిర్లక్ష్య వైఖరి అవలంబించారు. గత ప్రభుత్వ హయాంలో పట్టణ ప్రాంత పేదలకు ఇళ్లు ఇవ్వాలని దాదాపు పూర్తి చేసిన టిడ్కో సముదాయాల్ని కూడా లబ్ధిదారులకు అప్పగించలేదు. దీంతో వారికి వేదనే మిగిలింది.
లబ్ధిదారుల నిలదీత
బొబ్బిలి పట్టణంలోని రామన్నదొరవలస వద్ద 2,072 మందికి పక్కా గృహాలు నిర్మించేందుకు పనులు ప్రారంభించారు. ఇంతలో ప్రభుత్వం మారడంతో పనులు మందగించాయి. ఇందులో 26 బ్లాకుల్లో 1,280 ప్లాట్లను మాత్రం సిద్ధం చేశారు. సదుపాయాలు కల్పించలేదు. ఎన్నికల ముందు అప్పగించేందుకు వైకాపా నాయకులు ప్రయత్నించారు. కానీ లబ్ధిదారులు తిప్పకొట్టారు. కమిషనర్ రామలక్ష్మి, పుర అధ్యక్షుడు వెంకట మురళీకృష్ణ లబ్ధిదారులతో సమావేశమై, చర్చించారు. రోడ్లు, నీరు, కాలువలు, విద్యుత్తు లేకుండా ఎలా ఉండాలని లబ్ధిదారులు నిలదీశారు. దీంతో అప్పగింతలు వాయిదాపడ్డాయి. మరోవైపు ఇళ్లు అప్పగించకుండానే బ్యాంకు వాయిదాలు కట్టాల్సి వస్తోందని లబ్ధిదారులు వాపోతున్నారు.
మోక్షం కలగలేదు
సౌకర్యాలు లేక నిరుపయోగంగా ఉన్న సముదాయం
రామన్నదొరవలసలో టిడ్కో గృహాలకు రహదారులు, డ్రైన్లు వేసేందుకు సముదాయాల మధ్య మట్టిని తవ్వేసి ఆరునెలలు అవుతోంది. ఇంతవరకు పనులు ప్రారంభించలేదు. సీసీ రోడ్లు, కాలువలు, ఇంటింటి కుళాయిలు, తాగునీటి రిజర్వాయర్ నిర్మాణానికి నిధులు కేటాయించామని చెబుతున్నా గుత్తేదార్లు ఒక అడుగు రహదారి కూడా వేయలేదు. పట్టణం నుంచి సముదాయాల వద్దకు వెళ్లేందుకు ప్రధాన రహదారి మార్గం లేదు. పారిశ్రామికవాడ నుంచి బీటీ రహదారి వేస్తామని గతంలో చెప్పుకొచ్చారు. ఆ పనులు చేపట్టలేదు. గుత్తేదారు పనులు చేయాల్సి ఉందని టిడ్కో ఏఈ నవీన్కుమార్ అన్నారు.
గూడు లేదు.. డబ్బులు లేవు
- బొబ్బిలి పట్టణంలోని రెడ్డికవీధికి చెందిన ఓ లబ్ధిదారు
టిడ్కో ఇళ్ల కోసం రూ.25 వేలు మార్జిన్మనీగా చెల్లించాను. ఐదేళ్లు అవుతోంది. ఆపై నా ఇళ్లు రద్దు చేసి.. జగనన్న కాలనీలో ఇంటిపట్టా ఇచ్చారు. చెల్లించిన మొత్తాలు ఇవ్వకుండా తిప్పుతున్నారు. అధికారులను అడిగితే ప్రభుత్వం వద్ద ఉన్నాయి, ఇస్తామని చెబుతున్నారు. ఇంతవరకు రాలేదు. అప్పు చేసి ఇచ్చినా, ప్రయోజనం లేకుండా పోయింది. ఇబ్బందులు పడుతున్నా. ఎప్పుడొస్తాయో తెలియదు.
నగదు తీసేస్తున్నారు
- రాఘవరావు, లబ్ధిదారుడు, బొబ్బిలి
నాకు రెండు పడకల గది ప్లాట్ మంజూరు చేశామని చెప్పారు. ఇంతవరకు అప్పగించలేదు. మరోవైపు ప్రతీనెల రూ.3 వేలు వాయిదా బ్యాంకర్లు లాగేస్తున్నారు. నేను ఎల్ఐసీ ఏజెంటుగా పనిచేస్తున్నాను. ఆయా కమిషన్ మొత్తాలు ఖాతాలో పడగానే తీసేస్తున్నారు. వాయిదాలు కడుతున్నా ఇంటిలో మాత్రం ఇంతవరకు దిగలేదు. సదుపాయాలు కల్పించి ఎప్పుడు ఇస్తారో చెప్పండి.
ఇంత జాప్యమా?
- ఆర్.నిర్మల, లబ్ధిదారురాలు, బొబ్బిలి
ఇళ్లు నిర్మించడానికి ఐదేళ్లు పట్టింది. ఇంకా రహదారులు, కాలువలు, తాగునీటి సదుపాయం లేదు. వీటిని నిర్మించడానికి ఇంకెన్నేళ్ల్లు పడుతుందో తెలియదు. ఇంతవరకు ఇళ్లు అప్పగించకపోతే ఎలా? అక్కడ మేమెలా నివసించగలం. అధికారులు, నేతలు చెప్పిన మాటలకు, పరిస్థితులకు పొంతన లేదు. మరోవైపు బ్యాంకుల నుంచి డబ్బులు కట్టాలని ఒత్తిడి వస్తోంది
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్వల్ప ఘర్షణలు మినహా ఎన్నికలు ప్రశాంతం
[ 13-05-2024]
బలిజిపేట మండలంలోని అన్ని గ్రామాల్లో సోమవారం సార్వత్రిక ఎన్నికలు తుమరాడ, చిలకలపల్లి మినహా మిగతా చోట్ల ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. -
ఈవీఎం మొరాయింపు.. ఓటర్ల పడిగాపులు
[ 13-05-2024]
పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలం బాలేరు గ్రామంలో 136 పోలింగ్ కేంద్రం వద్ద ఈవీఎం మొరాయించింది. -
బతుకుదెరువుకు వెళ్లాం.. భవిత మార్చేందుకు వచ్చాం
[ 13-05-2024]
ఎక్కడెక్కడికో వెళ్లి ప్రైవేటు ఉద్యోగాలు, కూలీ పనులు చేసుకొని జీవనం సాగిస్తున్న వారు ఎన్నడూ లేని విధంగా స్వగ్రామాలకు తరలి వస్తున్నారు. -
ఓ నిర్ణేతా.. మార్చుకో నీ తలరాత..!
[ 13-05-2024]
ప్రత్యేక శ్రద్ధ చూపాయి. సాగుకు ఆర్థిక చేయూత, బ్యాంకు రుణాలు, రుణాలపై వడ్డీ రాయితీ, పండించే పంటలకు గిట్టుబాటు ధర, వ్యవసాయ పరికరాలకు సబ్సిడీ.. సాగులో ముందడుగేయాలంటే ఇవన్నీ కీలకమే. -
వారి స్ఫూర్తి వీరికెక్కడిది
[ 13-05-2024]
పార్లమెంట్ నిధులు (ఎంపీ ల్యాడ్స్) వినియోగంలో ఉమ్మడి జిల్లాలో వైకాపా ఎంపీల అలసత్వం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. -
గుప్పుమంటున్న గంజాయి!
[ 13-05-2024]
విజయనగరంలోని వైఎస్సార్ నగర్ సమీపంలో నెల రోజుల కిందట గంజాయి మత్తులో కొంతమంది యువకులు రైల్వే కూలీలను కొట్టారు. -
మీ విజయం కాంక్షిస్తున్నా
[ 13-05-2024]
విజయనగరం పార్లమెంటు స్థానం నుంచి ఎన్డీయే కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న కలిశెట్టి అప్పలనాయుడు విజయాన్ని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. -
అసౌకర్యాలతో సిబ్బందికి అవస్థలు
[ 13-05-2024]
బొబ్బిలి నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి ఈవీఎంల పంపిణీ కేంద్రంలో అసౌకర్యాల తో ఉద్యోగులు అవస్థలు పడ్డారు. -
మహిళలకు ప్రత్యేక కేంద్రం..
[ 13-05-2024]
చీపురుపల్లి మండలం మెట్టపల్లి పోలింగ్ కేంద్రం 165 ప్రత్యేకతను చాటింది. ఈసీ ఆదేశాల మేరకు మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్న మెట్టపల్లిలో మహిళా ఓటింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. -
అర్ధరాత్రి దాటాక ఆయువు తీశారు!
[ 13-05-2024]
ఇంటి ఆరుబయట నిద్రిస్తున్న విశ్రాంత ఉద్యోగి, తెదేపా సానుభూతిపరుడి హత్య రేగిడి మండలంలోని చినశిర్లాంలో కలకలం రేపింది. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
[ 13-05-2024]
ద్విచక్రవాహనం ఫ్లైఓవర్ పైనుంచి కింద పడటంతో జామి మండలానికి చెందిన యువకుడు దుర్మరణం పాలైన ఘటన విశాఖపట్నంలో జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
మహిళ కిడ్నాప్ కేసు.. హెచ్డీ రేవణ్ణకు బెయిల్
-
అది టీకప్పులో తుపానులాంటిది.. కేఎల్ రాహుల్-సంజీవ్ గోయెంకా ఎపిసోడ్పై ఎల్ఎస్జీ
-
కుప్పకూలిన భారీ హోర్డింగ్.. ఎనిమిది మంది మృతి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి ఈవీ రాక ఆలస్యం? కారణం ఇదే..!
-
‘ఇక నేను పెళ్లి చేసుకోవాలి’: రాహుల్ గాంధీ ఆసక్తికర కామెంట్