సమన్వయంతో పనిచేయాలి
ఎన్నికల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారిణి, కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు.
మాట్లాడుతున్న జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నాగలక్ష్మి
విజయనగరం అర్బన్, న్యూస్టుడే: ఎన్నికల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారిణి, కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కౌంటర్ల ఏర్పాటు, విధులు, సదుపాయాలు, పార్కింగ్ తదితర అంశాలను వివరించారు. ఈవీఎం, సామగ్రితో తిరిగి వచ్చేవారికి రిసెప్షన్ కేంద్రాల్లో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. ఒక్కో సెంటర్కు ఇద్దరు జిల్లా అధికారులను నియమించినట్లు తెలిపారు. లెక్కింపు కేంద్రమైన జేఎన్టీయూ గురజాడ విద్యాలయానికి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సుధారాణి, జడ్పీ ఉప సీఈవో రాజ్కుమార్, లెండి కళాశాలకు మెప్మా పీడీ సుధాకర్, గృహనిర్మాణశాఖ పీడీ శ్రీనివాసరావును నియమించామన్నారు. స్ట్రాంగ్రూంలలో ఈవీఎంలను నిర్దేశించిన విధంగా భద్రపరచాలని, సెక్టార్ అధికారుల కౌంటర్లలో రిజర్వ్డ్ ఈవీఎంలను అందజేయాలన్నారు. సంయుక్త కలెక్టర్ కె.కార్తీక్, సహాయ కలెక్టర్ వెంకట త్రివినాగ్, డీఆర్వో ఎస్.డి.అనిత తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాకిస్తామన్న డబ్బులు ఏమయ్యాయి
[ 14-05-2024]
ఓట్లు వేస్తే డబ్బులు ఇస్తామన్నారని, చాలామందికి ఇవ్వలేదంటూ కొత్తవలస మండలం వీరభద్రపురంలోని దాసరిపేటకు చెందిన పలువురు మహిళలు ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావును సోమవారం రాత్రి నిలదీశారు. -
స్ఫూర్తి చాటిన ఓటర్లు
[ 14-05-2024]
వయోభారం.. అనారోగ్యం.. వర్షం.. విద్యుత్తు లేకపోవడం వంటి ఇబ్బందులున్నా రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవడంలో స్ఫూర్తి చాటారు. -
ఒక్క ఓటు.. గంటన్నర ఉద్రిక్తత
[ 14-05-2024]
పాలకొండ పట్టణంలోని పెదకాపువీధి ప్రాథమిక పాఠశాలలో నం.177 పోలింగ్ కేంద్రంలో ఒక్క ఓటు కోసం గంటన్నరపాటు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. -
వర్షమొచ్చినా.. చీకటైనా ఓటింగ్
[ 14-05-2024]
శృంగవరపుకోట నియోజకవర్గంలో సోమవారం సాయంత్రం భారీ వర్షం, విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో పలుచోట్ల పోలింగ్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. -
వైకాపా శ్రేణుల వీరంగం
[ 14-05-2024]
పార్వతీపురం పట్టణంలోని జగన్నాథపురం పోలింగ్ కేంద్రం వద్ద తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య గొడవ తోపులాటకు దారితీసింది. -
తెదేపా ఏజెంటుపై దాడి
[ 14-05-2024]
బొబ్బిలి మండలంలోని ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడి స్వగ్రామం పక్కిలో తెదేపా పోలింగ్ ఏజెంటు రెడ్డి బాబురావుపై వైకాపా కార్యకర్తలు దాడిచేసి గాయపరిచారు. బాధితుడి వివరాల మేరకు.. -
ఎన్నికల్ని బహిష్కరించిన భోజరాజపురం
[ 14-05-2024]
దత్తిరాజేరు మండలం గుచ్చిమి పంచాయతీ పరిధిలోని భోజరాజపురం గ్రామస్థులు సోమవారం పోలింగ్ను బహిష్కరించారు. గ్రామంలోని ఏ ఒక్కరూ ఓటు వేయలేదు. -
తరలివచ్చారు.. బస్సుల్లేక ఇరుక్కుపోయారు
[ 14-05-2024]
ఓటుహక్కును సద్వినియోగం చేసుకునేందుకు దూరప్రాంతాల నుంచి తరలివచ్చిన వారికి చిక్కులు తప్పలేదు. విజయనగరం, హైదరాబాద్, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాల నుంచి చాలామంది ఆదివారం అర్ధరాత్రి విజయనగరంలోని కాంప్లెక్స్కు చేరుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
34 ఏళ్లకే నానమ్మ.. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పారంటే!
-
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక
-
కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు కూలీలు మృతి
-
ఆగని బెదిరింపు మెయిల్స్.. తాజాగా తిహాడ్ జైలుకు!
-
ఎయిర్టెల్ లాభం 31% డౌన్.. కొత్తగా 78 లక్షల మంది కస్టమర్లు
-
బికినీలో అనన్య పాండే.. కాబోయే భర్తతో వరలక్ష్మి ఫొటో