చేపల వేట.. చెరువుకే చేటంట
చేపల వేట కోసం ఏకంగా చెరువుకే చేటు తెచ్చిన వైనమిది. సంతనూతలపాడు మండలం ఎనికపాడులో మంచినీటి చెరువు పక్కన సుమారు 32 ఎకరాల్లో మరొకటి ఉంది.
జేసీబీతో చెరువు కట్టను తొలగిస్తున్న దృశ్యం
సంతనూతలపాడు, న్యూస్టుడే: చేపల వేట కోసం ఏకంగా చెరువుకే చేటు తెచ్చిన వైనమిది. సంతనూతలపాడు మండలం ఎనికపాడులో మంచినీటి చెరువు పక్కన సుమారు 32 ఎకరాల్లో మరొకటి ఉంది. ఇందులో కొద్దిరోజుల క్రితం వరకు పుష్కలంగా నీరుండేది. చేపల పెంపకందారులు ఇటీవల వాటిని పట్టించేందుకు నిర్ణయించారు. దీంతో తూముల నుంచి బయటకు వదిలారు. ఇంకా 40 శాతం వరకు నీరు చెరువులో ఉండిపోయింది. చేపలు పట్టేందుకు వీలుపడదంటూ ఈ నీటిని బయటకు పంపేందుకు సిద్ధపడ్డారు. ఇందుకుగాను శనివారం సాయంత్రం ఏకంగా జేసీబీ సాయంతో కట్టను తొలగించే పని చేపట్టారు. సుమారు 10 నుంచి 15 అడుగుల వెడల్పు 15 అడుగుల ఎత్తు కలిగిన కట్టను తవ్వేశారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు అక్కడికి చేరుకుని తవ్వకం పనులను అడ్డుకున్నారు. చేపల వేట కోసం ఏకంగా కట్టను ధ్వంసం చేయడం ఏంటని ప్రశ్నించారు. నీరు ఖాళీ చేస్తే ఖరీఫ్ సీజన్లో పంటల సాగుకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
అడ్డుకునేందుకు కట్టపై గుమిగూడిన గ్రామస్థులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాలిపోయిన కంటి‘పాప’..
[ 16-05-2024]
అమ్మమ్మ, తాతయ్యలతో కలిసి పెద్దమ్మ ఇంటి వద్ద వేసవి సెలవులను ఆనందంగా గడపాలనుకున్న ఆ చిన్నారిని చూసి విధికి కన్ను కుట్టింది. -
ఓటెత్తిన జనం.. మనమే ప్రథమం
[ 16-05-2024]
2024 సార్వత్రిక ఎన్నికల వేళ జిల్లా ప్రజలు ఓటెత్తారు. ప్రకాశం నలుమూలలా స్ఫూర్తి పరిఢవిల్లేలా చేశారు. -
దొంగలకు పోలీసుల వత్తాసు
[ 16-05-2024]
ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయించేందుకు ప్రయత్నించిన వారిని వదిలి.. అడ్డుకున్న వారిపై పోలీసులు కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. -
గిరిజనంతో మూడు ముక్కలాట
[ 16-05-2024]
వైకాపా ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి చెంచు గిరిజనులు అండగా నిలుస్తున్నారు. అటువంటి వారిని ఆ పార్టీ ప్రభుత్వం తీవ్ర అన్యాయానికి గురిచేసింది. -
పట్టుదలే విజయానికి మెట్టు
[ 16-05-2024]
‘అపజయాలు పలకరించినా కుంగిపోవద్దు. ఎందరు నిరాశపరిచినా తగ్గొద్దు. ఎంచుకున్న లక్ష్యం నుంచి మళ్లొద్దు. -
నిధులివ్వక వ్యధ
[ 16-05-2024]
లక్షలాదిమంది తాగు, సాగు నీటి అవసరాలు తీర్చే చెరువుల నిర్వహణను ప్రభుత్వం గాలికొదిలేసింది. -
ఉపశమనానికో ఉపాయం
[ 16-05-2024]
రోజు రోజుకీ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇళ్ల నుంచి బయటికి వచ్చేందుకే బెంబేలెత్తుతున్నారు. -
డయాలసిస్ రోగులతో చెలగాటం
[ 16-05-2024]
వారికి వారంలో రెండు మూడుసార్లు డయాలసిస్ చేస్తేనే ప్రాణం దక్కేది. -
నాసిరకం ఐస్క్రీం.. విక్రయాలపై కేసులు
[ 16-05-2024]
పొదిలిలో ఐస్క్రీమ్ బండ్ల వారు విక్రయిస్తున్న ఐస్క్రీముల్లో నాణ్యత లోపించడంతో వారిపై కేసులు నమోదు చేశారు. -
గెలుపుపై ఎవరి ధీమా వారిదే
[ 16-05-2024]
సార్వత్రిక ఎన్నికల సమరం పోలింగ్తో ముగిసింది. మార్కాపురం నియోజకవర్గంలో గతంలో నమోదు కానీ పోలింగ్ శాతం నమోదైంది. -
ఓటేశాం.. వెళ్లొస్తాం
[ 16-05-2024]
ఓట్ల పండుగ సోమవారంతో పూర్తయింది. -
అదుపుతప్పి కల్వర్టును ఢీకొన్న కారు
[ 16-05-2024]
కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొన్న సంఘటనలో తెదేపా నాయకుడితో పాటు ఇద్దరు విద్యార్థులకు గాయాలయ్యాయి. -
వై.పాలెం తహసీల్దార్, సర్వేయర్కు గాయాలు
[ 16-05-2024]
లారీ-కారు ఢీకొన్న ప్రమాదంలో వై.పాలెం తహసీల్దారుకు గాయాలైన సంఘటన మండలంలోని తోకపల్లి సమీపంలో బుధవారం చోటు చేసుకుంది.