గుండ్లకమ్మలో ఇసుక తోడేళ్లు
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా వైకాపా నాయకుల ఇసుక దందాకు అడ్డుకట్ట పడడం లేదు. పైపెచ్చు... గుండ్లకమ్మ పరిధిలో యంత్రాలతో మరింతగా తోడేస్తున్నారు. అధికారులకు సమాచారం ఉన్నా... అటుగా వెళ్లి హెచ్చించిన దాఖాలాలు సైతం లేకపోవడం గమనార్హం.
జలాశయాన్ని తొలిచేస్తున్న అక్రమార్కులు
తవ్వకాలతో ఏర్పడిన ఓ గుంతలో చేరిన నీరు
న్యూస్టుడే - మద్దిపాడు, సంతనూలతపాడు: ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా వైకాపా నాయకుల ఇసుక దందాకు అడ్డుకట్ట పడడం లేదు. పైపెచ్చు... గుండ్లకమ్మ పరిధిలో యంత్రాలతో మరింతగా తోడేస్తున్నారు. అధికారులకు సమాచారం ఉన్నా... అటుగా వెళ్లి హెచ్చించిన దాఖాలాలు సైతం లేకపోవడం గమనార్హం.
మరింతగా తోడేస్తున్నారు... : గుండ్లకమ్మ జలాశయం పరిసరాలతో పాటు... ఆ పరిధిలోని మల్లవరం, కొలసనకోట, వెల్లంపల్లి, నందిపాడు, ఇనమనమెళ్లూరు తదితర గ్రామాల్లో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు సాగుతున్నాయి. అన్ని చోట్లా అధికారపార్టీ నాయకులే దందా సాగిస్తున్నారు. భారీ పొక్లెయిన్లతో బాహాటంగానే తవ్వకాలు సాగిస్తున్నా... అధికారులకు అంతా తెలిసినా పట్టించుకోవడం లేదు. గేట్లు కొట్టుకుపోయి జలాశయం ఖాళీ అవ్వడంతో మరింతగా ఇసుక తోడేస్తున్నారు. ఇందుకోసమే కొత్త గేట్లు పెట్టడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. సంతనూతలపాడు మండలం మద్దులూరు సమీపంలోని ముసి వాగులోనూ జేసీబీలతో ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారు. ఇక్కడి నుంచి నిత్యం పదుల సంఖ్యలో ట్రాక్టర్లు తరలుతున్నాయి.
దూరాన్ని బట్టి ధర... : మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ దొరికే ఇసుక నాణ్యమైనది కావడంతో డిమాండ్ ఎక్కువ. అందుకు అనుగుణంగానే అక్రమార్కులు ధరలు వసూలు చేస్తున్నారు. దూరాన్ని బట్టి ట్రక్కు ఇసుకకు రూ.3,500 నుంచి రూ.4 వేల వరకు వసూలు చేస్తున్నారు. దూరం పెరిగితే ధర మరింత పెంచేస్తున్నారు. నిత్యం పదుల సంఖ్యలో ట్రాక్టర్లు... వందల ట్రిప్పులు రవాణా సాగిస్తున్నాయి. ఇందుకోసం ప్రత్యేక మార్గాలు సైతం ఏర్పాటు చేసుకున్నారు. తవ్వకాల కారణంగా ఎక్కడికక్కడ భారీ గుంతలు ఏర్పడడంతో పరిస్థితి ప్రమాదకరంగా మారుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్రమాలు రూ.2,000 కోట్లు.. ‘బలి’పీఠంపై ఒంగోలు
[ 12-05-2024]
అక్రమాలంటేనే తెలియని సుద్దపూసనంటూ గప్పాలు కొట్టుకుంటుంటారు. మరోవైపు.. అదే నోటితో ‘పదవిలో ఉన్నప్పుడు ఖర్చులకు కొంత పుచ్చుకున్నాను’ అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతారు. -
అంతా సానుకూలం.. పోలింగ్కు సన్నద్ధమవుదాం
[ 12-05-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజాగళం సభలో పాల్గొనేందుకు తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం రాత్రి ఒంగోలు వచ్చారు. -
రాష్ట్రాన్ని గంజాయి రాజధానిగా మార్చిన జగన్
[ 12-05-2024]
సీఎం జగన్మోహన్రెడ్డి రాష్ట్రాన్ని గంజాయికి రాజధానిగా మార్చారని సీనినటుడు శివాజీ ధ్వజమెత్తారు. మండలంలో పెదఉల్లగల్లు, లక్ష్మీనగర్ గ్రామాల్లో దర్శి ఎన్టీఏ కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మీకి మద్దతుగా ఆమెతో కలిసి శివాజీ ప్రచారం నిర్వహించారు. -
నేడు పోలింగ్ సామగ్రి తరలింపు
[ 12-05-2024]
మార్కాపురం నియోజకవర్గంలో ఎన్నికల నిర్వహణకు సమయం దగ్గరపడుతున్న వేళ అధికారులు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం మార్కాపురంలోని ఎస్వీకేపీ డిగ్రీ కళాశాలలో ఈవీఎంలు, ఈవీప్యాడ్లు పంపిణీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. -
స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి
[ 12-05-2024]
ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా ఈ నెల 13న నిర్వహించనున్న ఎన్నికల్లో ఓటుహక్కును వినియోగించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని కలెక్టర్ దినేష్కుమార్ పిలుపునిచ్చారు. -
భరించలేం.. పాపాల భైరవుడ్ని పంపేద్దాం
[ 12-05-2024]
నిలువెత్తు వంచనా రూపం.. ఇక పాలనంతా పచ్చి మోసం..ఒక్క పొరపాటుకు అయిదేళ్ల నరకం ! ఇదీ జగన్ అరాచక పాలనపై వెల్లువెత్తుతున్న జనాగ్రహం. యువతకు కొలువుల్లేవ్..శ్రామికులకు పనుల్లేవ్.. ఉద్యోగులకు ఒకటినే జీతాల్లేవ్ ! మరో పక్క అన్నం పెట్టే రైతన్న పొలం బీడయ్యింది.. ఇల్లాలికి కుటుంబం భారమైంది. -
వైభవంగా రంగనాయకస్వామి కల్యాణం
[ 12-05-2024]
రాచర్ల మండలం జెల్లివారిపుల్లలచెరువు గ్రామ సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో కొలువైన నెమలిగుండ్ల రంగనాయకస్వామి కల్యాణోత్సవాన్ని శనివారం వైభవంగా నిర్వహించారు. -
అన్నింటా విధ్వంసం.. ఎక్కడా లేదు సంతోషం
[ 12-05-2024]
వైకాపా పాలనలో ఏ ఒక్క వర్గం సంతోషకరంగా లేదు. 2019 నుంచి 2024 వరకు డీఎస్సీ విడుదల చేయకపోవడంతో పాటు ఉద్యోగాలు భర్తీ చేయక, ఉపాధి చూపకపోవడంతో యువతలో అనేక మంది నిరుద్యోగులుగా మారారు. -
జగన్ చట్టం.. జనులకు నష్టం
[ 12-05-2024]
వైకాపా ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారింది. ఎన్నో ఏళ్లుగా తాము అనుభవిస్తున్న భూములకు గత ఎన్నికల కోడ్కు ముందు రీసర్వే పేరుతో రైతులకు నోటీసులు జారీచేసింది. -
ఓటమి భయంతోనే తప్పుడు ప్రచారం
[ 12-05-2024]
ఓటమి భయంతో వైకాపా నాయకులు ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లు తీసేస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ సాధిక్ పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
11 నెలల తర్వాత ఓటీటీలోకి వస్తున్న రొమాంటిక్ కామెడీ మూవీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సంజూ క్యాచ్ ఔట్ నిర్ణయం ఆలస్యం వల్లే.. పంత్పై మ్యాచ్ బ్యాన్: గంగూలీ
-
ఘర్షణలున్నా చైనాతో వాణిజ్యం అందుకే పెరుగుతోంది : జైశంకర్
-
పోలీసును కొట్టి చంపిన పౌరులు..పాక్ ఆక్రమిత కశ్మీర్లో అసలేం జరుగుతోంది..?
-
ఓటర్లకు పంచేందుకు తరలింపు.. ఒంగోలులో 6 లారీల బియ్యం పట్టివేత