‘నా.. నా’లుక వరకే మీరు
‘నా ఎస్సీలు... నా ఎస్టీలు’ అంటూ మైకులు పగిలేలా మాటలు చెప్పే జగన్.. చేతల్లో ఆయా వర్గాలకు తీరని ద్రోహం చేస్తున్నారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ఆశయమని వేదికలపై పలుకుతూ.. తన అయిదేళ్ల పాలనలో వారి బతుకులనే సంక్షోభంలో పడేశారు.
సంక్షేమమంటూ సంక్షోభంలోకి నెట్టారు
నిధుల్లేక ఉత్తుత్తిగా మిగిలిన కార్పొరేషన్లు
ఎస్సీలను దగా చేస్తున్న జగన్
‘నా ఎస్సీలు... నా ఎస్టీలు’ అంటూ మైకులు పగిలేలా మాటలు చెప్పే జగన్.. చేతల్లో ఆయా వర్గాలకు తీరని ద్రోహం చేస్తున్నారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ఆశయమని వేదికలపై పలుకుతూ.. తన అయిదేళ్ల పాలనలో వారి బతుకులనే సంక్షోభంలో పడేశారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ఎస్సీ, ఎస్టీల జీవనోపాధి మెరుగుకు వివిధ పథకాల ద్వారా చేయూతనిచ్చేందుకు రాజ్యాంగ బద్ధంగా కార్పొరేషన్లనూ దిష్టిబొమ్మలుగా మార్చారు. గతంలో అమలు చేసిన పథకాలకూ మంగళం పాడారు. బటన్ నొక్కానంటూ ఉత్తుత్తి మాటలు చెబుతూ.. వారి స్వయం ఉపాధికి పాడి కట్టారు. చదువులు, భూ కొనుగోలు, శిక్షణ తరగతులను రద్దు చేశారు. కాలనీల్లో మౌలిక వసతులూ కల్పించడం లేదు.
ఏటా వెయ్యి మంది చదువులపై వేటు...
ప్రతిభావంతులైన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు బెస్ట్ ఎవైలబుల్ స్కూల్ పథకం ఉంది. కోరుకున్న చోట ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో చదివేందుకు అవకాశం ఉంటుంది. తెదేపా ప్రభుత్వ హయాంలో 2014-19 మధ్య జిల్లాకు చెందిన సుమారు అయిదు వేల మందికి ఈ పథకం కింద లబ్ధి చేకూరింది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేయడంతో ఏటా 1,000 మంది విద్యార్థులు కార్పొరేట్ విద్యకు దూరమయ్యారు.
పేరు మార్చేసి.. కత్తెరేసి...
జిల్లా నుంచి విదేశీ విద్య అభ్యసించే వారి సంఖ్య పెరుగుతోంది. గత ప్రభుత్వ హయాంలో అంబేడ్కర్ విదేశీ విద్య పథకం కింద 15 దేశాల్లో కోరుకున్న చోట ఉన్నత విద్యను అభ్యసించేందుకు సుమారు 40 మంది విద్యార్థులకు ఆర్థికసాయం అందించారు. జగన్ కొలువుదీరాక మూడేళ్లపాటు అమలు చేయలేదు. ఆ తర్వాత జగనన్న విదేశీ విద్య అని పేరు మార్చారు. దీనిపై ప్రతిపక్షాలతో పాటు, దళితులు ఆందోళన చేపట్టినా వెనక్కి తగ్గలేదు. పైగా క్యూఎస్ ర్యాంకింగ్ టాప్-200లో ఉన్న విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందినవారికే సాయం అంటూ ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు తీరని అన్యాయం చేశారు.
దుప్పట్లు ఇచ్చింది లేదు...
3 నుంచి 10వ తరగతి వరకు చదివే ఎస్సీ విద్యార్థులకు జిల్లాలో 61 వసతి గృహాలున్నాయి. వీటిలో 21 అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. కళాశాల విద్యార్థులకు చెందిన మరో 20 వసతిగృహాల్లో 13 అద్దె భవనాలే దిక్కు. మౌలిక వసతుల నిమిత్తం నాడు- నేడు కింద ప్రతిపాదించినా ఇంతవరకు పనులు ప్రారంభించనే లేదు. ప్రవేశాల సమయంలోనే దుప్పట్లు, దోమతెరలు ఇవ్వాల్సి ఉన్నా చలికాలంలో అరకొరగా పంపిణీ చేసి చేతులు దులుపుకొన్నారు. ఆరు నెలలుగా డైట్, కాస్మోటిక్ ఛార్జీల బకాయిలు చెల్లించలేదు. ఆఖరికి వంటకు సరిపడా గ్యాస్ కూడా సరఫరా చేయడం లేదు.
పాత యూనిట్లకే కొత్తగా రంగులు...
2018-19 ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ లబ్ధిదారులకు స్వయం ఉపాధి కల్పించడంతో పాటు, గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలకు తొలి విడతగా మండలానికి ఒక్కో యూనిట్ కింద ట్రాక్టర్, డ్రైన్ క్లీనింగ్ యంత్రం మంజూరు చేశారు. అందుకు గత ప్రభుత్వ హయాంలోనే కొందరు లబ్ధిదారులకు యూనిట్లు పంపిణీ చేయగా, ఆ తర్వాత 2019 ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రావడంతో నిలిచిపోయింది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పంపిణీ ఆపేయడంతో సదరు వాహనాలు ప్రగతి భవన్ ఆవరణలోనే ఉండిపోయాయి. వైకాపా వచ్చాక 2022 ఏప్రిల్లో కొత్తగా పది మంది లబ్ధిదారులను ఎంపిక చేసి పాత యూనిట్లకు కొత్తగా రంగులేసి ఇచ్చారు.
కార్లంటూ రెండేళ్లుగా కబుర్లు...
జాతీయ షెడ్యూల్్్డ కులాల ఆర్థికాభివృద్ధి సంస్థ(ఎన్ఎస్ఎఫ్డీసీ) సహకారంతో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా జిల్లాకు 11 ఇన్నోవా కార్లు కేటాయించారు. అందుకు సుమారు 400 మంది నుంచి దరఖాస్తులు స్వీకరించి 2022 జనవరిలో ఒంగోలు టీటీడీసీ కార్యాలయంలో సంబంధిత అధికారులు ముఖాముఖి నిర్వహించారు. లబ్ధిదారుల ఎంపిక చేపట్టి రెండేళ్లు దాటినా ఇంతవరకు కార్ల ఊసేలేదు.
స్వయం ఉపాధికీ తూట్లు...
తెదేపా ప్రభుత్వ హయాంలో జిల్లా వ్యాప్తంగా 20 వేల మందికి పైగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 50 శాతం వరకు రాయితీ రుణాలు పొందారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సుమారు 20 వేల మంది నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ముఖాముఖి నిర్వహించి మూలకు నెట్టేశారు. యూనిట్ల మంజూరు ఊసేలేదు.
- తెదేపా ప్రభుత్వ హయాంలో ఎన్ఎస్ఎఫ్డీసీ పథకం కింద 35 శాతం రాయితీపై సుమారు 500 మంది లబ్ధిదారులకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పలు రకాల కార్లు, ఆటోలు మంజూరు చేశారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక ఆయా వర్గాలకు ఇంతవరకు ఒక్క యూనిట్ కూడా మంజూరు చేయలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్రమాలు రూ.2,000 కోట్లు.. ‘బలి’పీఠంపై ఒంగోలు
[ 12-05-2024]
అక్రమాలంటేనే తెలియని సుద్దపూసనంటూ గప్పాలు కొట్టుకుంటుంటారు. మరోవైపు.. అదే నోటితో ‘పదవిలో ఉన్నప్పుడు ఖర్చులకు కొంత పుచ్చుకున్నాను’ అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతారు. -
అంతా సానుకూలం.. పోలింగ్కు సన్నద్ధమవుదాం
[ 12-05-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజాగళం సభలో పాల్గొనేందుకు తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం రాత్రి ఒంగోలు వచ్చారు. -
రాష్ట్రాన్ని గంజాయి రాజధానిగా మార్చిన జగన్
[ 12-05-2024]
సీఎం జగన్మోహన్రెడ్డి రాష్ట్రాన్ని గంజాయికి రాజధానిగా మార్చారని సీనినటుడు శివాజీ ధ్వజమెత్తారు. మండలంలో పెదఉల్లగల్లు, లక్ష్మీనగర్ గ్రామాల్లో దర్శి ఎన్టీఏ కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మీకి మద్దతుగా ఆమెతో కలిసి శివాజీ ప్రచారం నిర్వహించారు. -
నేడు పోలింగ్ సామగ్రి తరలింపు
[ 12-05-2024]
మార్కాపురం నియోజకవర్గంలో ఎన్నికల నిర్వహణకు సమయం దగ్గరపడుతున్న వేళ అధికారులు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం మార్కాపురంలోని ఎస్వీకేపీ డిగ్రీ కళాశాలలో ఈవీఎంలు, ఈవీప్యాడ్లు పంపిణీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. -
స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి
[ 12-05-2024]
ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా ఈ నెల 13న నిర్వహించనున్న ఎన్నికల్లో ఓటుహక్కును వినియోగించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని కలెక్టర్ దినేష్కుమార్ పిలుపునిచ్చారు. -
భరించలేం.. పాపాల భైరవుడ్ని పంపేద్దాం
[ 12-05-2024]
నిలువెత్తు వంచనా రూపం.. ఇక పాలనంతా పచ్చి మోసం..ఒక్క పొరపాటుకు అయిదేళ్ల నరకం ! ఇదీ జగన్ అరాచక పాలనపై వెల్లువెత్తుతున్న జనాగ్రహం. యువతకు కొలువుల్లేవ్..శ్రామికులకు పనుల్లేవ్.. ఉద్యోగులకు ఒకటినే జీతాల్లేవ్ ! మరో పక్క అన్నం పెట్టే రైతన్న పొలం బీడయ్యింది.. ఇల్లాలికి కుటుంబం భారమైంది. -
వైభవంగా రంగనాయకస్వామి కల్యాణం
[ 12-05-2024]
రాచర్ల మండలం జెల్లివారిపుల్లలచెరువు గ్రామ సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో కొలువైన నెమలిగుండ్ల రంగనాయకస్వామి కల్యాణోత్సవాన్ని శనివారం వైభవంగా నిర్వహించారు. -
అన్నింటా విధ్వంసం.. ఎక్కడా లేదు సంతోషం
[ 12-05-2024]
వైకాపా పాలనలో ఏ ఒక్క వర్గం సంతోషకరంగా లేదు. 2019 నుంచి 2024 వరకు డీఎస్సీ విడుదల చేయకపోవడంతో పాటు ఉద్యోగాలు భర్తీ చేయక, ఉపాధి చూపకపోవడంతో యువతలో అనేక మంది నిరుద్యోగులుగా మారారు. -
జగన్ చట్టం.. జనులకు నష్టం
[ 12-05-2024]
వైకాపా ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారింది. ఎన్నో ఏళ్లుగా తాము అనుభవిస్తున్న భూములకు గత ఎన్నికల కోడ్కు ముందు రీసర్వే పేరుతో రైతులకు నోటీసులు జారీచేసింది. -
ఓటమి భయంతోనే తప్పుడు ప్రచారం
[ 12-05-2024]
ఓటమి భయంతో వైకాపా నాయకులు ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లు తీసేస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ సాధిక్ పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘త్రినయని’ సీరియల్ నటి పవిత్రా జయరాం దుర్మరణం
-
రూ.58, రూ.59తో బీఎస్ఎన్ఎల్లో 2 కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు
-
తొలిసారిగా పంది కిడ్నీ మార్పిడి చేయించుకున్న వ్యక్తి మృతి
-
పంత్ లేకపోవడం వారికి నష్టమే.. మమ్మల్ని దిల్లీ ఓడించడం కష్టమే: బెంగళూరు కోచ్
-
విరాట్ కోహ్లీపై విమర్శలు వద్దు.. మరింత ప్రమాదకరంగా మారతాడు: హేడెన్
-
112 ఏళ్ల నుంచి తప్పనిసరి ఓటింగ్..!