శిద్దా ఇంట్లో దోపిడీకి విఫలయత్నం
మాజీమంత్రి శిద్దా రాఘవరావు ఇంట్లో దోపిడీకి విఫలయత్నం జరిగింది. అదనపు ఎస్పీ(క్రైమ్స్) ఎస్.వి.శ్రీధర్రావు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
శిద్దా తనయుడు సుధీర్బాబుతో మాట్లాడుతున్న అదనపు ఎస్పీ శ్రీధర్రావు
ఒంగోలు నేరవిభాగం, న్యూస్టుడే: మాజీమంత్రి శిద్దా రాఘవరావు ఇంట్లో దోపిడీకి విఫలయత్నం జరిగింది. అదనపు ఎస్పీ(క్రైమ్స్) ఎస్.వి.శ్రీధర్రావు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. శుక్రవారం అర్ధరాత్రి 12.45 గంటల సమయంలో ఇద్దరు ఆగంతకులు కత్తులతో శిద్దా రాఘవరావు ఇంటి ఆవరణలోకి ప్రవేశించారు. అక్కడ సెల్ఫోన్ చూస్తున్న కాపలాదారు కలవకొల్లు దుర్గాప్రసాద్పై లంఘించగా, ఆయన తీవ్రంగా ప్రతిఘటిస్తూ కేకలు వేయటంతో పక్కనే నిద్రిస్తున్న గన్మెన్ మోహన్ అప్రమత్తమయ్యారు. దీంతో వారు అక్కడినుంచి పరారయ్యారు. వారు వెంటనే ఈ విషయాన్ని ఒకటో పట్టణ సీఐ ఎం.లక్ష్మణ్కు సమాచారమందించగా వారు నేర స్థలాన్ని పరిశీలించారు. దొంగల కోసం గాలించినా వారి ఆచూకీ దొరకలేదు. శనివారం ఉదయం నేరస్థలాన్ని అదనపు ఎస్పీ(క్రైమ్స్) శ్రీధర్రావు, ఒంగోలు డీఎస్పీ కిషోర్బాబు, సీఐ లక్ష్మణ్ సందర్శించారు. మాజీమంత్రి తనయుడు, తితిదే బోర్డు సభ్యుడు సుధీర్బాబుతో మాట్లాడి నేరస్థలంలోని సీసీ ఫుటేజీని పరిశీలించారు. ఇద్దరు ఆగంతకులు కత్తులతో ప్రవేశించిన దృశ్యాలు వాటిలో నమోదయ్యాయి. వస్తువులేవీ చోరీకి గురికాలేదని, కాపలాదారు దుర్గాప్రసాద్కు సైతం గాయాలేమీ కాలేదని అదనపు ఎస్పీ శ్రీధర్రావు తెలిపారు. దీనిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్రమాలు రూ.2,000 కోట్లు.. ‘బలి’పీఠంపై ఒంగోలు
[ 12-05-2024]
అక్రమాలంటేనే తెలియని సుద్దపూసనంటూ గప్పాలు కొట్టుకుంటుంటారు. మరోవైపు.. అదే నోటితో ‘పదవిలో ఉన్నప్పుడు ఖర్చులకు కొంత పుచ్చుకున్నాను’ అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతారు. -
అంతా సానుకూలం.. పోలింగ్కు సన్నద్ధమవుదాం
[ 12-05-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజాగళం సభలో పాల్గొనేందుకు తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం రాత్రి ఒంగోలు వచ్చారు. -
రాష్ట్రాన్ని గంజాయి రాజధానిగా మార్చిన జగన్
[ 12-05-2024]
సీఎం జగన్మోహన్రెడ్డి రాష్ట్రాన్ని గంజాయికి రాజధానిగా మార్చారని సీనినటుడు శివాజీ ధ్వజమెత్తారు. మండలంలో పెదఉల్లగల్లు, లక్ష్మీనగర్ గ్రామాల్లో దర్శి ఎన్టీఏ కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మీకి మద్దతుగా ఆమెతో కలిసి శివాజీ ప్రచారం నిర్వహించారు. -
నేడు పోలింగ్ సామగ్రి తరలింపు
[ 12-05-2024]
మార్కాపురం నియోజకవర్గంలో ఎన్నికల నిర్వహణకు సమయం దగ్గరపడుతున్న వేళ అధికారులు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం మార్కాపురంలోని ఎస్వీకేపీ డిగ్రీ కళాశాలలో ఈవీఎంలు, ఈవీప్యాడ్లు పంపిణీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. -
స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి
[ 12-05-2024]
ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా ఈ నెల 13న నిర్వహించనున్న ఎన్నికల్లో ఓటుహక్కును వినియోగించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని కలెక్టర్ దినేష్కుమార్ పిలుపునిచ్చారు. -
భరించలేం.. పాపాల భైరవుడ్ని పంపేద్దాం
[ 12-05-2024]
నిలువెత్తు వంచనా రూపం.. ఇక పాలనంతా పచ్చి మోసం..ఒక్క పొరపాటుకు అయిదేళ్ల నరకం ! ఇదీ జగన్ అరాచక పాలనపై వెల్లువెత్తుతున్న జనాగ్రహం. యువతకు కొలువుల్లేవ్..శ్రామికులకు పనుల్లేవ్.. ఉద్యోగులకు ఒకటినే జీతాల్లేవ్ ! మరో పక్క అన్నం పెట్టే రైతన్న పొలం బీడయ్యింది.. ఇల్లాలికి కుటుంబం భారమైంది. -
వైభవంగా రంగనాయకస్వామి కల్యాణం
[ 12-05-2024]
రాచర్ల మండలం జెల్లివారిపుల్లలచెరువు గ్రామ సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో కొలువైన నెమలిగుండ్ల రంగనాయకస్వామి కల్యాణోత్సవాన్ని శనివారం వైభవంగా నిర్వహించారు. -
అన్నింటా విధ్వంసం.. ఎక్కడా లేదు సంతోషం
[ 12-05-2024]
వైకాపా పాలనలో ఏ ఒక్క వర్గం సంతోషకరంగా లేదు. 2019 నుంచి 2024 వరకు డీఎస్సీ విడుదల చేయకపోవడంతో పాటు ఉద్యోగాలు భర్తీ చేయక, ఉపాధి చూపకపోవడంతో యువతలో అనేక మంది నిరుద్యోగులుగా మారారు. -
జగన్ చట్టం.. జనులకు నష్టం
[ 12-05-2024]
వైకాపా ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారింది. ఎన్నో ఏళ్లుగా తాము అనుభవిస్తున్న భూములకు గత ఎన్నికల కోడ్కు ముందు రీసర్వే పేరుతో రైతులకు నోటీసులు జారీచేసింది. -
ఓటమి భయంతోనే తప్పుడు ప్రచారం
[ 12-05-2024]
ఓటమి భయంతో వైకాపా నాయకులు ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లు తీసేస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ సాధిక్ పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
అభిమానులారా మ్యాచ్ ముగిసినా వెళ్లొద్దు.. మీకో స్పెషల్ ఉంది: వైరల్గా చెన్నై పోస్టు
-
హైదరాబాద్కు భారీ వర్ష సూచన.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: జీహెచ్ఎంసీ
-
‘త్రినయని’ సీరియల్ నటి పవిత్రా జయరాం దుర్మరణం
-
రూ.58, రూ.59తో బీఎస్ఎన్ఎల్లో 2 కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు
-
తొలిసారిగా పంది కిడ్నీ మార్పిడి చేయించుకున్న వ్యక్తి మృతి