తగాదా అడ్డుకోబోతే కడతేర్చారు
సోదరి కుటుంబంలో తగాదాను అడ్డుకోబోయిన తమ్ముడు కత్తిపోట్లకు గురై మృతిచెందాడు. దర్శి మండలం రాజంపల్లిలో ఆదివారం ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది.
అక్క కుటుంబ వివాదంలో తమ్ముడి హతం
రాజా వెంకటేష్ మృతదేహం
దర్శి, న్యూస్టుడే: సోదరి కుటుంబంలో తగాదాను అడ్డుకోబోయిన తమ్ముడు కత్తిపోట్లకు గురై మృతిచెందాడు. దర్శి మండలం రాజంపల్లిలో ఆదివారం ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు, మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..తర్లుపాడు మండలం పోతలపాడుకు చెందిన రాజా వెంకటేష్ (19) శనివారం దర్శి మండలం రాజంపల్లిలో నివాసముంటున్న తన సోదరి విజయ వద్దకు వెళ్లాడు. వెంకటేష్ పెద్దమ్మ తిరుపతమ్మ గ్రామంలోనే ఉంటున్నారు. ఆమె కుమార్తె వెంకట రమణకు, అల్లుడు దేవరకొండ వెంకటేశ్వర్లుకు మధ్య గత కొంతకాలంగా కుటుంబ తగాదాలు నడుస్తున్నాయి. దీంతో కుమార్తె తల్లి వద్దే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో భార్యను తనతో పాటు తీసుకెళ్లేందుకు వెంకటేశ్వర్లు ఆదివారం మూడు వాహనాల్లో 30 మందితో రాజంపల్లి వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న వెంకటేష్ పెద్దమ్మ వారింటికి వెళ్లాడు. అక్కడ అప్పటికే గొడవ జరుగుతుండటంతో సర్ది చెప్పేందుకు వెళ్లిన వెంకటేష్పై అక్కడికి వచ్చిన వ్యక్తుల్లో ఒకరు కత్తితో దాడిచేసి విచక్షణారహితంగా పొడిచాడు. తీవ్ర రక్తస్రావంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. అడ్డుకోబోయిన తిరుపతమ్మపై కూడా దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న సీఐ సమీముల్లా, ఎస్సై సుమన్ సిబ్బందితో సంఘటనా ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. మృతుని సోదరి విజయ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కత్తితో దాడిచేసిన వ్యక్తి పరారు కాగా, అక్కడున్న కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వచ్చిన వారిలో ఓ న్యాయవాది కూడా ఉన్నట్లు తెలిసింది.
హోమశాల అగ్నికి ఆహుతి
హోమశాల నుంచి ఎగసిపడుతున్న మంటలు
కంభం (రాచర్ల), న్యూస్టుడే : రాచర్ల మండలం సోమిదేవిపల్లి గ్రామంలో జరుగుతున్న విగ్రహ ప్రతిష్ఠ పూజల కోసం ఏర్పాటు చేసిన హోమశాల అగ్నికి ఆహుతైంది. తాటాకు మట్టలతో వేసిన పందిరికి ఆదివారం మధ్యాహ్నం వేళ ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. అగ్ని కీలలు వ్యాపించడంతో అక్కడున్న అర్చకులు పరుగు పరుగున బయటకు వచ్చారు. పందిరిలో ఉన్న సామగ్రి, మైక్సెట్, లౌడ్ స్పీకర్లు, తదితరు వస్తువులు కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదంతో రూ.లక్ష ఆస్తినష్టం సంభవించిందని స్థానికులు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అగ్ని పరీక్ష దాటి.. నిశిరాత్రీ నిలిచి.. సార్వత్రిక సమరంలో సర్వత్రా చైతన్యం
[ 14-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు సోమవారం జిల్లా వ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు పోటెత్తారు. -
కర్రపెత్తనం రాతియుగ మనస్తత్వం
[ 14-05-2024]
దాష్టీకాలే ఊపిరిగా గెలుపు కోసం మళ్లీ కుటిల వ్యూహాలనే నమ్ముకున్నారు వైకాపా నేతలు. -
ఓటరు గర్జించే.. భానుడు తలవంచె
[ 14-05-2024]
ఎన్నాళ్లో వేచిన.. ఉదయం రానే వచ్చింది. పోలింగ్ పర్వదినమైన సోమవారం నాడు భానుడు చండ ప్రచండంగా చెలరేగిపోయినా.. ఈదురు గాలులతో వరుణుడు బీభత్సం సృష్టించినా.. వజ్రాయుధం ధరించిన ఓటర్ ఒక్క అడుగూ వెనక్కువేయలేదు. -
దర్శిలో ఉద్రిక్తత
[ 14-05-2024]
పోలింగ్ చివరి దశలో సోమవారం సాయంత్రం దర్శిలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. -
వసతుల్లేక.. అవస్థ
[ 14-05-2024]
నేతల తలరాతలు మార్చే కీలకమైన ఎన్నికల నిర్వహణలో యంత్రాగం వైఫల్యం కొట్టొచ్చినట్లు కనపడింది. -
విస్తృత ఏర్పాట్లతో భారీ పోలింగ్: కలెక్టర్
[ 14-05-2024]
జిల్లావ్యాప్తంగా విస్తృత ఏర్పాట్లు చేపట్టడంతో భారీగా పోలింగ్ నమోదైందని కలెక్టర్ దినేష్కుమార్ తెలిపారు. -
కదన రంగంలో కూటమి
[ 14-05-2024]
తాజా వార్తలు (Latest News)
-
ముంబయి ఇండియన్స్లో రెండు వర్గాలు.. కలిసి ప్రాక్టీస్ చేయని ఆటగాళ్లు!
-
అవసరమైతే బైడెన్ను చంపాలనుకున్నా.. వైట్హౌస్పై దాడి కేసులో నేరాన్ని అంగీకరించిన సాయి వర్షిత్
-
ఐరోపా మోస్ట్వాంటెడ్ ‘ది స్కార్పియన్’ అరెస్టు..!
-
అత్యాధునిక ఫీచర్లతో జీపీటీ-4o.. అందరికీ ఫ్రీ
-
చరణ్ వల్లే ఆ డిప్రెషన్ నుంచి బయటపడ్డా: ఉపాసన
-
హోర్డింగ్ కూలిన ఘటనలో 14కు చేరిన మృతులు.. యాడ్ ఏజెన్సీపై కేసు