logo

తెదేపా అధినేత పర్యటన వాయిదా

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మే 3, 4 తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నారు.

Published : 29 Apr 2024 03:09 IST

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మే 3, 4 తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నారు. 3న మార్కాపురం, 4న దర్శిలో నిర్వహించనున్న బహిరంగ సభల్లో ఆయన పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. తొలుత ఈ నెల 30న యర్రగొండపాలెం బహిరంగ సభలో ఆయన పాల్గొనేలా షెడ్యూల్‌ ఖరారైంది. అదే రోజున తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఒంగోలులో, హిందూపురం తెదేపా ఎమ్మెల్యే, సినీ కథానాయకుడు బాలకృష్ణ మర్రిపూడిలో నిర్వహించనున్న ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు యర్రగొండపాలెం పర్యటన రద్దు అయినట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని