logo

3న జిల్లాకు జనసేనాని

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మే 3న జిల్లాలో పర్యటించనున్నారు. ఆ రోజున గిద్దలూరు, దర్శి, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించనున్న ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారు.

Published : 29 Apr 2024 03:10 IST

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మే 3న జిల్లాలో పర్యటించనున్నారు. ఆ రోజున గిద్దలూరు, దర్శి, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించనున్న ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారు. ఒంగోలు పార్లమెంట్‌ తెదేపా అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డి ఇటీవల పవన్‌ కల్యాణ్‌ను కలిశారు. ఆయా నియోజకవర్గాల్లో కూటమి చేపట్టే ప్రచారానికి రావాలని ఆహ్వానించారు. ఈ మేరకు ఒకే రోజు మూడు చోట్ల నిర్వహించనున్న బహిరంగ సభల్లో పవన్‌ పాల్గొంటారని ఆయా నియోజకవర్గ అభ్యర్థులకు సమాచారం అందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని