logo

నేడు ఎచ్చెర్లకు బస్సు యాత్ర

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా మంగళవారం జిల్లాకు రానున్నారు.

Published : 23 Apr 2024 03:35 IST

అరసవల్లి, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా మంగళవారం జిల్లాకు రానున్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గం పైడిభీమవరం వద్ద సాయంత్రానికి బస్సు యాత్ర జిల్లాలోకి ప్రవేశించనుంది. అక్కడి నుంచి జాతీయ రహదారిపై రణస్థలం, లావేరు, ఎచ్చెర్ల, ఆమదాలవలస మండలాల్లోని పలు ప్రాంతాల మీదుగా శ్రీకాకుళం నియోజకవర్గం చాపురం గ్రామానికి చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు. బుధవారం ఉదయం  అక్కడి నుంచి బయలుదేరి జాతీయ రహదారిపై నరసన్నపేట మీదుగా టెక్కలి వెళ్తారు. అక్కడ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని