కాలనీలు కాదు.. జగనన్న కహానీలు
మేము కట్టేది కాలనీలు కాదు ఊళ్లు అని సీఎం జగన్ ఇళ్ల పట్టాల పంపిణీ సభల్లో గొప్పలు చెప్పారు. అయిదేళ్లలో చాలమంది లబ్ధిదారులకు పట్టాలను అందజేశారు.
రాజ్యమేలుతున్న సమస్యలు
అసౌకర్యాలతో నిర్మాణానికి ఆసక్తి చూపని లబ్ధిదారులు
మేము కట్టేది కాలనీలు కాదు ఊళ్లు అని సీఎం జగన్ ఇళ్ల పట్టాల పంపిణీ సభల్లో గొప్పలు చెప్పారు. అయిదేళ్లలో చాలమంది లబ్ధిదారులకు పట్టాలను అందజేశారు. ఆయన చెప్పిన ఊళ్లు ఎలా ఉన్నాయోనని పరిశీలిస్తే.. ఊరు కాదు కదా కనీస వసతులు లేని లేఅవుట్లు కనిపించాయి. శివారులో, కొండ సమీపంలో, గెడ్డకు దగ్గరగా.. సౌకర్యాల కల్పనకు అవకాశం లేని ప్రదేశాల్లో స్థలాలు ఇచ్చేయడంతో కట్టేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. ఆయా ప్రాంతాలకు నిర్మాణ సామగ్రి తరలించే సరికి పెనుభారంగా మారుతోందని చెబుతున్నారు. అష్టకష్టాలు పడి కొంతమంది పునాదులు వేసి చేతులెత్తేసిన పరిస్థితులు సైతం ఉన్నాయి. లేఅవుట్లలో మట్టి రోడ్లు, దీపాలు లేని వీధులు, బోర్లు వేయని స్థలాలు వెక్కిరిస్తున్నాయి.
న్యూస్టుడే, కంచిలి గ్రామీణం, ఇచ్ఛాపురం, ఇచ్ఛాపురం గ్రామీణం, పలాస, మందస, పలాస గ్రామీణం
మట్టి రోడ్లు.. దీపాలు లేని వీధులు
రామకృష్ణాపురంలో అసంపూర్తిగా
పలాస నియోజకవర్గంలో పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘం, పలాస, మందస, వజ్రపుకొత్తూరు మండలాల పరిధిలోని 9856 మంది లబ్ధిదారులు ఇళ్ల స్థలాలు ఇచ్చారు. 4855 మంది అర్హులు నిర్మాణానికి నానా పాట్లు పడుతున్నారు. పలాస మండలం రామకృష్ణాపురంలో మట్టిరోడ్లు దర్శనమిస్తున్నాయి. పలు చోట్ల కాలువ నిర్మాణాలు జరగకపోవడంతోపాటు వీధి దీపాలు అమర్చడం లేదు. పైపులైన్లు పూర్తి కాలేదు. ఇసుక అందుబాటులో లేకపోవడంతో అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు.
కట్టేందుకు వెనకడుగు
లొద్దపుట్టి లేఅవుట్లో ఇదీ పరిస్థితి
ఇచ్ఛాపురం మండలంలోని లొద్దపుట్టిలో జగనన్న కాలనీలో మొత్తం 114 మంది లబ్ధిదారులకు పట్టాలు ఇవ్వగా ఇప్పటి వరకు కేలవం 50 మంది మాత్రమే ఇళ్లు నిర్మాణాలు పూర్తి చేశారు. లోతట్టు ప్రాంతం కావడం, ఇళ్లు నిర్మాణాలకు అనువుగా లేకపోవడంతో చాలా మంది అక్కడ నిర్మాణాలు చేపట్టేందుకు వెనకడుగు వేస్తున్నారు.
మౌలిక సౌకర్యాలేవి..?
మందస మండలం హరిపురానికి సంబంధించి రెండు కిలోమీటర్ల దూరంలోని నోతువార వద్ద జగనన్న కాలనీకి లేఅవుట్ వేశారు. ఇప్పటి వరకు విద్యుత్తు సౌకర్యం మినహా మరే వసతులు లేవు బోరు తీయలేదు. సిమెంటు రోడ్లు, కాలువల ఏర్పాటు లేదు.
ఇదేనండీ రోడ్డు
కనీస రహదారి సౌకర్యానికి నోచుకోని ఇచ్ఛాపురం జగనన్న కాలనీ
ఇచ్ఛాపురంలో 2867 ఇళ్లు మంజూరు అయ్యాయి. వేర్వేరు చోట్ల లబ్ధిదారులు స్థలాలు కేటాయించారు. డిగ్రీకళాశాల పక్కనే, రోడ్డుకు దగ్గరగా ఉన్న ప్రాంతంలోనే ఇళ్ల పనులు జరుగుతుండగా మిగతా ప్రాంతాలు కొండకు దగ్గరల్లో, దూర ప్రాంతాల్లో కేటాయించడంతో నిర్మాణ సామగ్రి తరలించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఖర్చు తడిసి మోపెడవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వేలల్లో ఇళ్లు మంజూరు అయితే కేవలం 148 మాత్రమే ఇప్పటి వరకూ పూర్తయ్యాయి.
డ్రైనేజీలు ఎక్కడ?
పలాస మండలంలోని మామిడిమెట్టు, చిన్న మామిడిమెట్టు, రంగోయి, గురుదాసుపురం, చిన్నగురుదాసుపురం, సున్నాదేవి, చిన్న సున్నాదేవి, రామకృష్ణాపురం గ్రామాల ప్రజలకు....మామిడిమెట్టు లే అవుట్లో ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఈ గ్రామాల నుంచి 38 మంది లబ్ధిదారులున్నారు. ఇక్కడికి చేరుకునేందుకు రహదారులు లేవు. అష్టకష్టాలు పడుతున్నారు.
గుత్తేదారుకు అప్పగింత
ఇల్లు కట్టలేక, మధ్యలో వదల్లేక, అసౌకర్యాల నడుమ అవస్థలు పడలేక గుత్తేదారుకు అప్పగించేశాం. ఇక్కడ చూస్తే, వీధి దీపాలు తప్ప ఏ సౌకర్యం లేదు.
పి.జ్యోతి, ఇచ్ఛాపురం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎండలో మాడిస్తే.. మీ కళ్లు చల్లబడ్డాయా?
[ 03-05-2024]
మాది గార మండలం తూలుగు పంచాయతీ జాఫ్రాబాదు గ్రామం. ఆటోలో 7 కి.మీ. ప్రయాణించి ఎండలో గార మండల కేంద్రానికి వచ్చాం. బ్యాంకులో డబ్బులు ఇవ్వట్లేదు. -
పసుపు దండు ఉత్సాహం
[ 03-05-2024]
పాతపట్నం నియోజకవర్గంలో పసుపుదండు ఉత్సాహం ఉరకలెత్తింది.. ఏ దారి చూసినా పసుపు జెండాలే రెపరెపలాడాయి. -
దేవుడా.. ఇదేం పాలన..?
[ 03-05-2024]
నోరెత్తితే దేవుడి పేరు పలికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయిదేళ్ల పాలనలో ఆ భగవంతుడి ఆలనాపాలన సైతం పట్టించుకోలేదు.. -
మన్యం మౌన రోదన.. వినిపించలేదా జగనన్న..!
[ 03-05-2024]
అత్యవసరమైతే వారి కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఆసుపత్రికి వెళ్లాలంటే డోలీనే గతి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దేవుడి మీద భారం వేయాల్సిందే. ఇదీ జిల్లాలోని గిరిజన గ్రామాల్లో పరిస్థితి. ఇందుకు ప్రధాన కారణం ఆయా ప్రాంతాలకు సరైన రహదారి సౌకర్యాలు లేకపోవడం. -
ఏళ్లుగా అదే పరిస్థితి.. సాగు నీరందని దుస్థితి
[ 03-05-2024]
వజ్రపుకొత్తూరు, నందిగాం మండలాలను కలిపి ఉన్న వంశధార 60 ఆర్ఎల్ కాలువపై పలు చోట్ల సిమెంట్ పనులు పాడై కనీస మరమ్మత్తులకు నోచుకోవడంలేదు. -
కిడ్నీ రోగుల కుటుంబాలకు అండగా నిలవండి
[ 03-05-2024]
ఉద్దానంలో మూత్రపిండాల రోగులకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అండగా నిలవాలని ఇచ్ఛాపురం నియోజకవర్గ జనసేన సమన్వయకర్త దాసరి రాజు విజ్ఞప్తి చేశారు. -
చంద్రన్నతోనే సంక్షేమం
[ 03-05-2024]
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే గ్రామాల అభివృద్ధి జరిగిందని, వైకాపా పాలనలో విధ్వంసం చోటు చేసుకుందని తెదేపా నాయకులు తెలిపారు. -
ఒక్క రోడ్డయినా వేసినపాపాన పోలేదు
[ 03-05-2024]
ఇచ్ఛాపురం, పలాస పట్టణాల్లో రహదారులు అధ్వానంగా మారాయి. కీలక మార్గాలు ఛిద్రమై, గోతులతో నిండి ఉండడంతో ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. -
ఇసుక మూటలే.. కాంక్రీట్ గోడ..!
[ 03-05-2024]
ఎల్ఎన్పేట మండలంలో వంశధార నది వద్ద మెగా రక్షిత మంచినీటి పథకం బావుల నుంచి నీరు సరఫరా చేసే వంతెన శిథిలమైంది.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల వేళ.. ‘సూపర్ సీఎం’ సతీమణిపై బదిలీ వేటు
-
ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్.. ప్రభుత్వ అప్లికేషన్లకు ఇకపై లేబుల్స్
-
ఉగ్రదాడులకు కుట్ర.. ఉక్రెయిన్ ‘ఏజెంట్’ను చంపిన రష్యా
-
శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
-
ఓటీటీలోకి వచ్చేసిన త్రిగుణ్ ‘లైన్ మ్యాన్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఎన్నికల నేపథ్యంలో.. కేజ్రీవాల్కు బెయిల్ అంశాన్ని పరిశీలిస్తాం - సుప్రీంకోర్టు