నామినేషన్ల దాఖలుకు నేటితో ఆఖరు
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ ప్రక్రియ గురువారంతో ముగియనుంది.
ఇచ్ఛాపురంలో కూటమి శ్రేణులతో కలిసి ర్యాలీగా నామినేషన్ వేసేందుకు వెళ్తున్న తెదేపా ఇచ్ఛాపురం ఎమెల్యే అభ్యర్థి బెందాళం అశోక్
కలెక్టరేట్(శ్రీకాకుళం), న్యూస్టుడే: సార్వత్రిక ఎన్నికల నామినేషన్ ప్రక్రియ గురువారంతో ముగియనుంది. ఆరు రోజుల నుంచి జిల్లాలోని 8 శాసనసభ, ఒక పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసేందుకు పలువురు అభ్యర్థులు నామపత్రాలను సమర్పించారు. ఇందులో భాగంగా బుధవారం 40 మంది అభ్యర్థులు.. 52 నామినేషన్లు దాఖలు చేశారు. కొందరు అభ్యర్థులు రెండు సెట్ల చొప్పున వేశారు.
8 స్థానాలు.. 34 మంది అభ్యర్థులు..: 8 అసెంబ్లీ స్థానాల నుంచి 34 మంది అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. తెదేపా తరఫున బెందాళం అశోక్(ఇచ్ఛాపురం), బెందాళం నీలోత్పల(ఇచ్ఛాపురం), మామిడి గోవిందరావు(పాతపట్నం), బగ్గు రమణమూర్తి(నరసన్నపేట), వైకాపా నుంచి పిరియా విజయ(ఇచ్ఛాపురం), పిరియా సాయిరాజ్(ఇచ్ఛాపురం), దువ్వాడ శ్రీనివాస్(టెక్కలి), ధర్మాన ప్రసాదరావు(శ్రీకాకుళం), గొర్లె కిరణ్కుమార్(ఎచ్చెర్ల), గొర్లె ప్రమీల(ఎచ్చెర్ల), ధర్మాన కృష్ణదాస్(నరసన్నపేట), ధర్మాన కృష్ణచైతన్య(నరసన్నపేట), భాజపా అభ్యర్థిగా నడుకుదటి ఈశ్వరరావు ఆర్వోకు నామపత్రాలు అందించారు. స్వతంత్ర అభ్యర్థులు కొందరు, ఇతర పార్టీల నుంచి మరికొందరు నామినేషన్లు వేశారు.
26న పరిశీలన : జిల్లాలో దాఖలైన నామినేషన్ల పరిశీలన ఈ నెల 26న జరుగుతుందని కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ తెలిపారు. 29న మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణకు గడువు ఉంటుందని చెప్పారు. అంతకుముందు కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంను ఆయన పరిశీలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎండలో మాడిస్తే.. మీ కళ్లు చల్లబడ్డాయా?
[ 03-05-2024]
మాది గార మండలం తూలుగు పంచాయతీ జాఫ్రాబాదు గ్రామం. ఆటోలో 7 కి.మీ. ప్రయాణించి ఎండలో గార మండల కేంద్రానికి వచ్చాం. బ్యాంకులో డబ్బులు ఇవ్వట్లేదు. -
పసుపు దండు ఉత్సాహం
[ 03-05-2024]
పాతపట్నం నియోజకవర్గంలో పసుపుదండు ఉత్సాహం ఉరకలెత్తింది.. ఏ దారి చూసినా పసుపు జెండాలే రెపరెపలాడాయి. -
దేవుడా.. ఇదేం పాలన..?
[ 03-05-2024]
నోరెత్తితే దేవుడి పేరు పలికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయిదేళ్ల పాలనలో ఆ భగవంతుడి ఆలనాపాలన సైతం పట్టించుకోలేదు.. -
మన్యం మౌన రోదన.. వినిపించలేదా జగనన్న..!
[ 03-05-2024]
అత్యవసరమైతే వారి కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఆసుపత్రికి వెళ్లాలంటే డోలీనే గతి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దేవుడి మీద భారం వేయాల్సిందే. ఇదీ జిల్లాలోని గిరిజన గ్రామాల్లో పరిస్థితి. ఇందుకు ప్రధాన కారణం ఆయా ప్రాంతాలకు సరైన రహదారి సౌకర్యాలు లేకపోవడం. -
ఏళ్లుగా అదే పరిస్థితి.. సాగు నీరందని దుస్థితి
[ 03-05-2024]
వజ్రపుకొత్తూరు, నందిగాం మండలాలను కలిపి ఉన్న వంశధార 60 ఆర్ఎల్ కాలువపై పలు చోట్ల సిమెంట్ పనులు పాడై కనీస మరమ్మత్తులకు నోచుకోవడంలేదు. -
కిడ్నీ రోగుల కుటుంబాలకు అండగా నిలవండి
[ 03-05-2024]
ఉద్దానంలో మూత్రపిండాల రోగులకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అండగా నిలవాలని ఇచ్ఛాపురం నియోజకవర్గ జనసేన సమన్వయకర్త దాసరి రాజు విజ్ఞప్తి చేశారు. -
చంద్రన్నతోనే సంక్షేమం
[ 03-05-2024]
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే గ్రామాల అభివృద్ధి జరిగిందని, వైకాపా పాలనలో విధ్వంసం చోటు చేసుకుందని తెదేపా నాయకులు తెలిపారు. -
ఒక్క రోడ్డయినా వేసినపాపాన పోలేదు
[ 03-05-2024]
ఇచ్ఛాపురం, పలాస పట్టణాల్లో రహదారులు అధ్వానంగా మారాయి. కీలక మార్గాలు ఛిద్రమై, గోతులతో నిండి ఉండడంతో ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. -
ఇసుక మూటలే.. కాంక్రీట్ గోడ..!
[ 03-05-2024]
ఎల్ఎన్పేట మండలంలో వంశధార నది వద్ద మెగా రక్షిత మంచినీటి పథకం బావుల నుంచి నీరు సరఫరా చేసే వంతెన శిథిలమైంది.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల వేళ.. ‘సూపర్ సీఎం’ సతీమణిపై బదిలీ వేటు
-
ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్.. ప్రభుత్వ అప్లికేషన్లకు ఇకపై లేబుల్స్
-
ఉగ్రదాడులకు కుట్ర.. ఉక్రెయిన్ ‘ఏజెంట్’ను చంపిన రష్యా
-
శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
-
ఓటీటీలోకి వచ్చేసిన త్రిగుణ్ ‘లైన్ మ్యాన్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఎన్నికల నేపథ్యంలో.. కేజ్రీవాల్కు బెయిల్ అంశాన్ని పరిశీలిస్తాం - సుప్రీంకోర్టు