సమన్వయంతో పని చేయండి
జిల్లాలో స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు రానున్న రెండు వారాల పాటు సమన్వయంతో పని చేయాలని ఎన్నికల సాధారణ పరిశీలకులు శేఖర్ విద్యార్థి సూచించారు.
ఎన్నికల సాధారణ పరిశీలకులు శేఖర్ విద్యార్థి
మాట్లాడుతున్న ఎన్నికల పరిశీలకుడు శేఖర్ విద్యార్థి, చిత్రంలో కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్, ఎస్పీ రాధిక, తదితరులు
కలెక్టరేట్(శ్రీకాకుళం), న్యూస్టుడే: జిల్లాలో స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు రానున్న రెండు వారాల పాటు సమన్వయంతో పని చేయాలని ఎన్నికల సాధారణ పరిశీలకులు శేఖర్ విద్యార్థి సూచించారు. కలెక్టరేట్ నుంచి నోడల్ అధికారులతో శనివారం నిర్వహించిన దూరదృశ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి అధికారి ఎన్నికల నిబంధనలకు లోబడి వ్యవహరించాలన్నారు. ఓటరు నిర్భయంగా తమ హక్కు వినియోగించుకునేలా చూడాలని, పోలింగ్ శాతం పెంచేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఒడిశా నుంచి మద్యం అక్రమ రవాణాను అరికట్టాలని, రెండు రాష్ట్రాల్లో ఓటు హక్కు కలిగి ఉన్నవారిని నియంత్రించాలని చెప్పారు. ఇప్పటికే అలాంటి వారి జాబితాను ఆయా ఆర్వోలకు పంపినట్లు స్పష్టం చేశారు. ఓటింగ్ శాతం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మనజీర్ జిలానీ సామూన్ తెలిపారు. ఇప్పటికే సిబ్బందికి శిక్షణ కూడా ఇచ్చామన్నారు. ఎస్పీ రాధిక మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు రూ.4.32 కోట్ల విలువైన మద్యం, బంగారం, గంజాయి స్వాధీనం చేసుకున్నామని, 520 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించామన్నారు. సమావేశంలో ఎన్నికల పరిశీలకులు సందీప్కుమార్, సర్వజ్ ఇక్బాల్ రోహెల్లా, పోలీసు పరిశీలకులు సచింద్ర పటేల్, దిగంబర్ పి.ప్రదాన్, తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఖండాంతరాలు దాటి ఓట్ల పండగకు.. సొంత ఊర్లకు చేరుకుంటున్న ప్రవాసాంధ్రులు
[ 12-05-2024]
ఓటు వజ్రాయుధం లాంటిది. ప్రజాస్వామ్య పరిరక్షణలో దానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. అయిదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో చాలామంది ఓటు వేసేందుకు ముందుకు రాకపోవడంతో పోలింగ్ తక్కువగా నమోదవుతోంది. -
తెదేపాలోకి కొనసాగిన చేరికలు
[ 12-05-2024]
కొత్తపేటలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్షో నిర్వహిస్తున్న టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థి అచ్చెన్నాయుడు సమక్షంలో సంతబొమ్మాళి మండలం తోటాడ పంచాయతీకి చెందిన వారు వైకాపా నుంచి తెదేపాలో చేరారు. -
వెబ్ కాస్టింగ్ పరిశీలన పక్కాగా జరగాలి
[ 12-05-2024]
వెబ్ కాస్టింగ్ పరిశీలన పక్కాగా జరగాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ పేర్కొన్నారు. జీపీఎస్, వెబ్ కాస్టింగ్ పరిశీలకులతో కంట్రోల్ రూమ్లో శనివారం ఆయన సమీక్ష నిర్వహించారు. -
వంశధార నదిలో మునిగి బాలిక మృతి
[ 12-05-2024]
వంశధార నదిలో మునిగి బాలిక మృతి చెందిన ఘటన శనివారం హిరమండలంలో చోటుచేసుకుంది. ఎస్సై జి.నారాయణస్వామి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కొమనాపల్లి గ్రామానికి చెందిన తెంబూరు సంజనశ్రేయ (9) తన తల్లిదండ్రులతో కలిసి రుగడ గ్రామం సమీపంలోని వంశధార నదికి స్నానానికి వెళ్లింది. -
క్షేత్రసహాయకుడికి షోకాజ్ నోటీస్ జారీ
[ 12-05-2024]
సంతబొమ్మాళి మండలం నౌపడ ఉపాధి హామీ క్షేత్రసహాయకుడిగా విధులు నిర్వహిస్తున్న బొమ్మాళి రామారావుకు షోకాజ్ నోటీస్ జారీ చేసినట్లు ఎంపీడీవో ఉమా సుందరి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జలవనరులపై జగనాసురుడి విధ్వంసం..!
[ 12-05-2024]
అన్న వేసిన బాటలో ఇసుకాసురులు చెలరేగిపోయారు. వైకాపా పాలనలో జగన్ అనుచరులు జలవనరులను ధ్వంసం చేశారు. జిల్లాను సస్యశ్యామలం చేసే వంశధార, నాగావళి, మహేంద్రతనయ, బాహుదా నదులు ఘోషించేలా అనుమతులతో పని లేకుండా పరిమితికి మించి ఇసుకను తోడేశారు. -
ఒడిశా మద్యం పట్టివేత
[ 12-05-2024]
ఎన్నికల వేళ భారీ ఎత్తున మద్యం దొరుకుతోంది. శుక్రవారం అర్ధరాత్రి మెళియాపుట్టి మండలం పట్టుపురం సమీపంలో ఒడిశాకి చెందిన మద్యం సీసాలు ఆటోలో ఉన్నట్లు టెక్కలి ఎస్ఈబీ అధికారులు గుర్తించారు. -
ఇదేనా ‘ధర్మ’ పాలన..?
[ 12-05-2024]
జిల్లా రాజకీయాల్లో తల పండిన నేత ధర్మాన ప్రసాదరావు. వైకాపా ప్రభుత్వంలో రెవెన్యూ శాఖకు మంత్రిగా వ్యవహరించారు. ఆయన ప్రాతినిధ్యం వహించిన శ్రీకాకుళం నియోజకవర్గ అభివృద్ధికి చేసింది శూన్యం. -
ప్రచారానికి తెర
[ 12-05-2024]
నియోజకవర్గంలో ప్రచారానికి తెరపడింది. తెదేపా అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు శనివారం విస్తృతంగా ప్రచారం చేపట్టారు. సూపర్-6 పథకాల ప్రయోజనాలను వివరించారు. -
పోస్టర్ రూపకల్పనలో ప్రథమ స్థానం
[ 12-05-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నిర్వహించిన స్వీప్ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ ఎందుకు ఓటెయ్యాలి అంశంపై పోస్టర్ పోటీలు జరిగాయి. -
గేటు గండం
[ 12-05-2024]
పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘంలో కాశీబుగ్గ, తాళభద్ర రైల్వే లెవల్క్రాసింగ్ గేట్లు, ఇచ్ఛాపురం పరిధిలో పశ్చిమ మండలం, పురపరిధి రత్తకన్న ప్రాంతాలను కలిపే రైల్వే ఉత్తరకేబిన్ గేట్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
మద్యం పారుతోంది
[ 12-05-2024]
ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి మండలాల్లోని ఒడిశా సరిహద్దు గ్రామాల్లో ఏర్పాటు చేసిన తనిఖీ కేంద్రాలు మూతపడటంతో ఒడిశా మద్యం అక్రమంగా రవాణా అవుతోంది. -
కాంగ్రెస్తోనే సుస్థిర పాలన
[ 12-05-2024]
కాంగ్రెస్ పార్టీతోనే దేశంలో సుస్థిర పాలన సాధ్యమని శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి పి.పరమేశ్వరరావు అన్నారు. కాశీబుగ్గలో శనివారం విలేకరులతో మాట్లాడారు.
తాజా వార్తలు (Latest News)
-
‘త్రినయని’ సీరియల్ నటి పవిత్రా జయరాం దుర్మరణం
-
రూ.58, రూ.59తో బీఎస్ఎన్ఎల్లో 2 కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు
-
తొలిసారిగా పంది కిడ్నీ మార్పిడి చేయించుకున్న వ్యక్తి మృతి
-
పంత్ లేకపోవడం వారికి నష్టమే.. మమ్మల్ని దిల్లీ ఓడించడం కష్టమే: బెంగళూరు కోచ్
-
విరాట్ కోహ్లీపై విమర్శలు వద్దు.. మరింత ప్రమాదకరంగా మారతాడు: హేడెన్
-
112 ఏళ్ల నుంచి తప్పనిసరి ఓటింగ్..!