అన్నొచ్చాడు.. అడ్డంగా బాదేశాడు..!
‘అన్నొస్తున్నాడని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పిండి. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యుత్తు ఛార్జీలు తగ్గించేస్తామని కూడా గట్టిగా చెప్పండి’ అని సీఎం జగన్ ప్రతిపక్ష నేత హోదాలో ఊరూరా ఊదరగొట్టారు.
ఇష్టానుసారం విద్యుత్తు ఛార్జీలు పెంచేసిన వైకాపా ప్రభుత్వం
సామాన్యులపై సర్దుబాటు పేరుతో రూ.కోట్లలో భారం
‘అన్నొస్తున్నాడని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పిండి. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యుత్తు ఛార్జీలు తగ్గించేస్తామని కూడా గట్టిగా చెప్పండి’ అని సీఎం జగన్ ప్రతిపక్ష నేత హోదాలో ఊరూరా ఊదరగొట్టారు. అది నమ్మి గద్దెనెక్కించిన జనాలకు దిమ్మతిరిగే షాకిచ్చారు. అయిదేళ్లలో బిల్లులు ఇష్టానుసారం పెంచేసి సామాన్యుల నడ్డి విరిచేశారు. అంతటితో ఆగకుండా ట్రూ అప్, సర్దుబాటు అంటూ వివిధ సాకులు చూపుతూ అదనంగా బాదేశారు.
ఈనాడు డిజిటల్ శ్రీకాకుళం, న్యూస్టుడే గుజరాతీపేట(శ్రీకాకుళం): వైకాపా సర్కారు అన్ని వర్గాల విద్యుత్తు వినియోగదారులపైనా ఛార్జీల భారం మోపింది. కొన్ని వర్గాలకు కనెక్షన్లకు టారిఫ్లలో మార్పులు చేయకుండా.. స్లాబులు పెంచేసి దొడ్డిదారిలో అడ్డంగా దోచేసింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 8,55,428 విద్యుత్తు కనెక్షన్లు ఉన్నాయి. వీటన్నింటినిపై అయిదేళ్లలో రూ.కోట్ల భారం మోపారు. ట్రూఅప్ (వాస్తవ విద్యుత్తు సరఫరా వ్యయం), ఇంధన కొనుగోలు ఖర్చు సర్దుబాటు (ఎఫ్పీపీసీఏ) పేర్లతో అదనంగా వడ్డించారు. గృహ కనెక్షన్లకు సంబంధించిన బిల్లులపై వీటి ప్రభావం రూ.వందల్లో ఉంటే.. వాణిజ్య రంగాల కనెక్షన్లపై రూ.వేలల్లో కనిపించింది.
- 2014-15 నుంచి 2018-19 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి నష్టాలు వచ్చాయనే సాకు చూపించారు. ఆ సమయంలో వినియోగించిన ప్రతి యూనిట్కు 20 పైసల మేర లెక్క కట్టి బిల్లులో అదనంగా వసూలు చేశారు.
- 2023 సంవత్సరానికి సంబంధించి నాలుగు త్రైమాసికాల్లో విద్యుత్తు ఛార్జీలు పెంచుతూ వచ్చారు. ఇందులో మొదటి త్రైమాసికంలో రూ.4 కోట్లు భారం మోపగా.. రెండు, మూడు, నాలుగు త్రైమాసికాలకు రూ.13 కోట్ల చొప్పున బాదారు. వీటి ఫలితంగా ఒక్కసారిగా పెద్దమొత్తంలో వచ్చిన బిల్లులను చెల్లించలేక నిరుపేదలు లబోదిబోమన్నారు.
- ఏడాదిలో విద్యుత్తు కొనుగోలు, ఇతర ఖర్చులకు ఏపీ విద్యుత్తు నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ) అనుమతించిన మొత్తానికి అదనంగా చేసిన ఖర్చును ట్రూఅప్ పేరుతో డిస్కంలు వసూలు చేశాయి. తూర్పు ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ శ్రీకాకుళం సర్కిల్ పరిధిలో మొత్తం 8,55,428 కనెక్షన్లు ఉండగా వాటిల్లో గృహ, వాణిజ్య, పారిశ్రామిక కనెక్షన్లుపైనే ఎక్కువగా భారం మోపారు. ఒక్క ఏడాది వ్యవధిలోనే వాటిపై రూ.42 కోట్లు అదనపు భారం మోపారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
సంపాదనంతా దీనికే సరిపోతుంది
మా ఇంట్లో ఫ్యాను, రెండు బల్బులు, ఫ్రిజ్ ఉన్నాయి. ఇంటి ఆవరణలో చిన్న కిల్లీ బడ్డి నడుపుతున్నాను. గతంలో ప్రతి నెలా రూ.250 నుంచి రూ.300 మధ్య వరకు విద్యుతు బిల్లు వచ్చేది. కొంత కాలం నుంచి విపరీతంగా వస్తోంది. సంపాదనంతా కరెంట్ బిల్లుకే సరిపోతుంటే.. ఇంకేమి తిని బతకాలి.?
టి.లక్ష్మీ, డొంకూరు గ్రామం, కవిటి మండలం
అంతా బిల్లు ఎలా చెల్లించాలి...
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకు విద్యుత్తు ఉచితంగా ఇస్తామన్నారు. అయిదేళ్లపాటు అదనపు యూనిట్లకు బిల్లు చెల్లించాలని అడగలేదు. ఇప్పుడేమో ఏకంగా రూ.24 వేలు బిల్లు వచ్చింది. చెల్లించకుంటే కనెక్షన్ తీసేస్తామని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికీ విద్యుత్తు ఛార్జీలు పెరిగిపోయాయి. కూలీ పనులు చేసుకుంటూ బతికే మాలాంటి వాళ్లం అంత బిల్లు ఎలా చెల్లించగలం.
మజ్జి మాధవరావు, ఎస్సీ కాలనీవాసి, శ్రీముఖలింగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఖండాంతరాలు దాటి ఓట్ల పండగకు.. సొంత ఊర్లకు చేరుకుంటున్న ప్రవాసాంధ్రులు
[ 12-05-2024]
ఓటు వజ్రాయుధం లాంటిది. ప్రజాస్వామ్య పరిరక్షణలో దానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. అయిదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో చాలామంది ఓటు వేసేందుకు ముందుకు రాకపోవడంతో పోలింగ్ తక్కువగా నమోదవుతోంది. -
తెదేపాలోకి కొనసాగిన చేరికలు
[ 12-05-2024]
కొత్తపేటలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్షో నిర్వహిస్తున్న టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థి అచ్చెన్నాయుడు సమక్షంలో సంతబొమ్మాళి మండలం తోటాడ పంచాయతీకి చెందిన వారు వైకాపా నుంచి తెదేపాలో చేరారు. -
వెబ్ కాస్టింగ్ పరిశీలన పక్కాగా జరగాలి
[ 12-05-2024]
వెబ్ కాస్టింగ్ పరిశీలన పక్కాగా జరగాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ పేర్కొన్నారు. జీపీఎస్, వెబ్ కాస్టింగ్ పరిశీలకులతో కంట్రోల్ రూమ్లో శనివారం ఆయన సమీక్ష నిర్వహించారు. -
వంశధార నదిలో మునిగి బాలిక మృతి
[ 12-05-2024]
వంశధార నదిలో మునిగి బాలిక మృతి చెందిన ఘటన శనివారం హిరమండలంలో చోటుచేసుకుంది. ఎస్సై జి.నారాయణస్వామి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కొమనాపల్లి గ్రామానికి చెందిన తెంబూరు సంజనశ్రేయ (9) తన తల్లిదండ్రులతో కలిసి రుగడ గ్రామం సమీపంలోని వంశధార నదికి స్నానానికి వెళ్లింది. -
క్షేత్రసహాయకుడికి షోకాజ్ నోటీస్ జారీ
[ 12-05-2024]
సంతబొమ్మాళి మండలం నౌపడ ఉపాధి హామీ క్షేత్రసహాయకుడిగా విధులు నిర్వహిస్తున్న బొమ్మాళి రామారావుకు షోకాజ్ నోటీస్ జారీ చేసినట్లు ఎంపీడీవో ఉమా సుందరి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జలవనరులపై జగనాసురుడి విధ్వంసం..!
[ 12-05-2024]
అన్న వేసిన బాటలో ఇసుకాసురులు చెలరేగిపోయారు. వైకాపా పాలనలో జగన్ అనుచరులు జలవనరులను ధ్వంసం చేశారు. జిల్లాను సస్యశ్యామలం చేసే వంశధార, నాగావళి, మహేంద్రతనయ, బాహుదా నదులు ఘోషించేలా అనుమతులతో పని లేకుండా పరిమితికి మించి ఇసుకను తోడేశారు. -
ఒడిశా మద్యం పట్టివేత
[ 12-05-2024]
ఎన్నికల వేళ భారీ ఎత్తున మద్యం దొరుకుతోంది. శుక్రవారం అర్ధరాత్రి మెళియాపుట్టి మండలం పట్టుపురం సమీపంలో ఒడిశాకి చెందిన మద్యం సీసాలు ఆటోలో ఉన్నట్లు టెక్కలి ఎస్ఈబీ అధికారులు గుర్తించారు. -
ఇదేనా ‘ధర్మ’ పాలన..?
[ 12-05-2024]
జిల్లా రాజకీయాల్లో తల పండిన నేత ధర్మాన ప్రసాదరావు. వైకాపా ప్రభుత్వంలో రెవెన్యూ శాఖకు మంత్రిగా వ్యవహరించారు. ఆయన ప్రాతినిధ్యం వహించిన శ్రీకాకుళం నియోజకవర్గ అభివృద్ధికి చేసింది శూన్యం. -
ప్రచారానికి తెర
[ 12-05-2024]
నియోజకవర్గంలో ప్రచారానికి తెరపడింది. తెదేపా అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు శనివారం విస్తృతంగా ప్రచారం చేపట్టారు. సూపర్-6 పథకాల ప్రయోజనాలను వివరించారు. -
పోస్టర్ రూపకల్పనలో ప్రథమ స్థానం
[ 12-05-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నిర్వహించిన స్వీప్ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ ఎందుకు ఓటెయ్యాలి అంశంపై పోస్టర్ పోటీలు జరిగాయి. -
గేటు గండం
[ 12-05-2024]
పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘంలో కాశీబుగ్గ, తాళభద్ర రైల్వే లెవల్క్రాసింగ్ గేట్లు, ఇచ్ఛాపురం పరిధిలో పశ్చిమ మండలం, పురపరిధి రత్తకన్న ప్రాంతాలను కలిపే రైల్వే ఉత్తరకేబిన్ గేట్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
మద్యం పారుతోంది
[ 12-05-2024]
ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి మండలాల్లోని ఒడిశా సరిహద్దు గ్రామాల్లో ఏర్పాటు చేసిన తనిఖీ కేంద్రాలు మూతపడటంతో ఒడిశా మద్యం అక్రమంగా రవాణా అవుతోంది. -
కాంగ్రెస్తోనే సుస్థిర పాలన
[ 12-05-2024]
కాంగ్రెస్ పార్టీతోనే దేశంలో సుస్థిర పాలన సాధ్యమని శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి పి.పరమేశ్వరరావు అన్నారు. కాశీబుగ్గలో శనివారం విలేకరులతో మాట్లాడారు.
తాజా వార్తలు (Latest News)
-
టీవీ సీరియల్ నటి పవిత్రా జయరాం కన్నుమూత
-
రూ.58, రూ.59తో బీఎస్ఎన్ఎల్లో 2 కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు
-
తొలిసారిగా పంది కిడ్నీ మార్పిడి చేయించుకున్న వ్యక్తి మృతి
-
పంత్ లేకపోవడం వారికి నష్టమే.. మమ్మల్ని దిల్లీ ఓడించడం కష్టమే: బెంగళూరు కోచ్
-
విరాట్ కోహ్లీపై విమర్శలు వద్దు.. మరింత ప్రమాదకరంగా మారతాడు: హేడెన్
-
112 ఏళ్ల నుంచి తప్పనిసరి ఓటింగ్..!