తెదేపా, భాజపాలోకి భారీగా చేరికలు
జి.సిగడాం మండలంలో వైకాపాకు కంచుకోటగా ఉన్న వాండ్రంగి గ్రామంలో వైకాపాకు ఎదురుదెబ్బ తగిలింది.
కొత్తూరు: పొన్నుటూరులో తెదేపాలో చేరిన వారితో పాతపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి మామిడి గోవిందరావు
జి.సిగడాం, పొందూరు, కొత్తూరు, న్యూస్టుడే: జి.సిగడాం మండలంలో వైకాపాకు కంచుకోటగా ఉన్న వాండ్రంగి గ్రామంలో వైకాపాకు ఎదురుదెబ్బ తగిలింది. ఆదివారం రాత్రి ఎచ్చెర్ల కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నడుకుదిటి ఈశ్వరరావు, తెదేపా విజయనగరం ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు సమక్షంలో వైకాపా నుంచి కూటమిలోకి భారీగా చేరికలు జరిగాయి. వాండ్రంగి సర్పంచి సాకేటి నాగరాజు, ఎంపీటీసీ సభ్యురాలు బూరాడ శ్రీదేవి, మాజీ సర్పంచి సనపల త్రినాథరావు, ఆ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు బూరాడ వెంకటరమణ, ఎంపీటీసీ మాజీ సభ్యుడు రేగిడి రాంబాబు, ఉప సర్పంచి డబ్బాడ రామారావు, మీసాల అప్పారావుతో పాటు 300 కుటుంబాలు వైకాపాను వీడి తెదేపాలో చేరాయి. ఈ కార్యక్రమంలో తెదేపా మండల అధ్యక్షుడు కుమరాపు రవికుమార్, భాజపా మండల అధ్యక్షుడు వజ్జిపర్తి రఘురాం, కూటమి శ్రేణులు పాల్గొన్నాయి.
- పొందూరు మండలం ధర్మపురం, వీఆర్గూడాం గ్రామాల నుంచి 70 కుటుంబాలు వైకాపాను వీడి తెదేపాలోకి చేరాయి. తెదేపా ఆమదాలవలస ఎమ్మెల్యే అభ్యర్థి కూన రవికుమార్ వీరికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఏఎంసీ మాజీ ఛైర్మన్ అన్నెపు రాము, సువ్వారి మధు, పార్టీ మండల అధ్యక్షుడు సీహెచ్ రామ్మోహన్, గాడు నారాయణరావు, బలగ శంకర్భాస్కర్, బాడాన శేషగిరినాయుడు, మురళీ పాల్గొన్నారు.
- ఎన్నికలు సమీపిస్తున్న వేళ కొత్తూరు మండలంలో వైకాపాకు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తెదేపా పాతపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి మామిడి గోవిందరావు సమక్షంలో వైకాపా నుంచి తెదేపాలోకి వలసలు పెరిగాయి. పొన్నుటూరు సర్పంచి వై.చామంతి, ఉప సర్పంచి వై.సంతోష్కుమార్, కలిగాం సర్పంచి ఎస్.కోటేశ్వరరావు, వైకాపా సీనియర్ నాయకుడు కూన అర్జునరావుతో పాటు 200 పైగా కుటుంబాలు వైకాపా నుంచి తెదేపాలోకి చేరాయి. మామిడి గోవిందరావు వీరికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. సీనియర్ నాయకుడు ఎ.భైరాగినాయుడు, ఎల్.తులసీవరప్రసాద్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉప్పొంగిన వనితోత్సాహం..!
[ 15-05-2024]
జిల్లా వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తారు. గత ఎన్నికల కంటే ఓటింగ్ శాతం పెరగడమే అందుకు నిదర్శనం. ఈసారి మహిళలు పెద్ద ఎత్తున ఓటేసేందుకు తరలి వచ్చారు. నేతల తలరాతలను నిర్ణయించడంలో వారి తీర్పే శాసనం కానుంది. పురుషుల కంటే వారి ఓట్లే ఎక్కువగా పోలయ్యాయి. -
గాలి కూటమి వైపే..!
[ 15-05-2024]
జిల్లా వ్యాప్తంగా సోమవారం అర్ధరాత్రి దాటే వరకు సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కొనసాగింది. పలుచోట్ల ఉద్రిక్తతల నడుమ ప్రక్రియ ముగిసింది. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో ఓటరు తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైంది.. అభ్యర్థులు ఫలితాల కోసం వేచి చూస్తున్నారు. -
మార్టులన్నారు.. మాట మార్చారు..!
[ 15-05-2024]
స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక స్వావలంబనకు మండలానికో మహిళా మార్టు ఏర్పాటు చేస్తామని గతంలో వైకాపా ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేసింది. ఆ తరువాత నియోజకవర్గానికి ఒకటేనని ప్రకటించింది. చివరకు పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన శ్రీకాకుళం, నరసన్నపేట నియోజకవర్గాల్లో మాత్రమే ఏర్పాటు చేసి ఊరుకుంది. -
తెదేపా కార్యకర్తపై దాడి
[ 15-05-2024]
మందస మండలం హరిపురంలో మంగళవారం తెదేపా కార్యకర్త కనగల రామారావుపై అదే గ్రామానికి చెందిన వైకాపా కార్యకర్త కర్ర అనిల్ దాడి చేశాడు. హరిపురంలోని 162 పోలింగ్ కేంద్రంలో రామారావు తెదేపా తరఫున ఏజెంటుగా ఉన్నారు. -
తెదేపాకు ఓటేశారని ఇంటికి తాళం
[ 15-05-2024]
తెదేపాకు ఓటేశారనే అక్కసుతో వైకాపా శ్రేణులు ఓ కుటుంబంపై కక్ష కట్టిన ఉదంతమిది. పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘం పరిధి చినబడాంకు చెందిన పి.మన్మధరావు భార్య సుజాతతో కలిసి ఓటు వేయడానికి విజయనగరం నుంచి వచ్చారు. -
తీర్పు భద్రం
[ 15-05-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లా ఓటర్ల తీర్పును ఎన్నికల అధికారులు భద్రపరిచారు. ఈవీఎంలు, వీవీప్యాట్లను ఎచ్చెర్ల మండలం చిలకపాలెం సమీపంలోని శ్రీ శివాని ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంల్లో మూడంచెల భద్రత నడుమ ఉంచారు. -
ముందే మేల్కొనకుంటే ముప్పే..!
[ 15-05-2024]
జాతీయ రహదారిలో లావేరు మండలం బుడుమూరు కూడలి సమీపంలో 2023 జూన్లో వ్యాన్ టైరు పేలి రోడ్డుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో విజయనగరం జిల్లా డెంకాడ మండలానికి చెందిన ముగ్గురు మృత్యవాత పడ్డారు. ఇందులో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. -
మోదీకి శుభాకాంక్షలు తెలిపేందుకు ప్రత్యేక వస్త్రం
[ 15-05-2024]
ప్రధానమంత్రి నరేంద్రమోదీ మూడోసారి పీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారని, ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు మోదీ, చంద్రబాబు, పవన్కల్యాణ్, లోకేశ్ ముఖ చిత్రాలతో ప్రత్యేక వస్త్రాన్ని తయారు చేస్తున్నట్లు లావేరు మండలంలోని వస్త్రపురికాలనీకి చెందిన బాసిన నాగేశ్వరరావు, లక్ష్మీ తెలిపారు. -
పాము కాటుకు యువకుడి బలి
[ 15-05-2024]
మండలంలోని పెద్దలవునిపల్లి గ్రామానికి చెందిన లఖినాన శివానందం (24) పాము కాటుకు గురై మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి భోజనాలు ముగిసిన తర్వాత శివానందం తల్లి పార్వతి, సోదరుడు పవన్ ఇంట్లో నిద్రపోయారు. అర్ధరాత్రి కట్ల పాము అతడిని కరిచింది. -
వైకాపా నేతలపై ఫిర్యాదు
[ 15-05-2024]
టెక్కలి పంచాయతీ కార్యాలయంలో సోమవారం ఎన్నికల సమయంలో జరిగిన ఘర్షణపై తెదేపా బూత్ ఏజెంట్ రెయ్యి ప్రీతిష్ చంద్ర టెక్కలి పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఖమ్మంలో ఎవరి లెక్కలు వారివే.. భారీ ఆధిక్యంపై కాంగ్రెస్ ధీమా
-
ఆంధ్రప్రదేశ్లో 44 రోజులు... రూ.17 వేల కోట్ల అప్పులు
-
హైదరాబాద్ జూలో తెల్ల పులి మృత్యువాత
-
మాకూ మోదీలాంటి నాయకుడు రావాలి: పాక్-అమెరికన్ వ్యాపారవేత్త
-
ప్రలోభ పెట్టినా ‘చెవి’లో పువ్వే!.. సహకరించని సొంత పార్టీ నేతలు
-
అమ్మకు మందులు తెచ్చేందుకు వెళ్లి అనంతలోకాలకు..