గోట్లో విజయకాంత్
నటుడు, డీఎండీకే వ్యవస్థాపకుడు విజయకాంత్ ‘గోట్’ సినిమాలో అతిథిపాత్రలో కనిపించే అవకాశం ఉంది. ఆయన చనిపోయారు కదా అనే కదా మీ ప్రశ్న. కృత్రిమ మేథ పరిజ్ఞానంతో ఆ చిత్రంలో ఆయన రూపాన్ని సృష్టించడానికి నిర్ణయించారు.
విజయకాంత్, విజయ్
చెన్నై, న్యూస్టుడే: నటుడు, డీఎండీకే వ్యవస్థాపకుడు విజయకాంత్ ‘గోట్’ సినిమాలో అతిథిపాత్రలో కనిపించే అవకాశం ఉంది. ఆయన చనిపోయారు కదా అనే కదా మీ ప్రశ్న. కృత్రిమ మేథ పరిజ్ఞానంతో ఆ చిత్రంలో ఆయన రూపాన్ని సృష్టించడానికి నిర్ణయించారు. ఇందుకోసం విజయకాంత్ సతీమణి, డీఎండీకే ప్రధానకార్యదర్శి ప్రేమలతతో చిత్ర దర్శకుడు వెంకట్ ప్రభు పలుమార్లు మాట్లాడారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రేమలత వెల్లడించారు. ‘సెంథూరపాండి’ చిత్రం ద్వారా విజయ్ను నటుడిగా విజయకాంత్ పరిచయం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. దర్శకుడు ఎస్.ఎ.చంద్రశేఖర్, ఆయన కుమారుడైన నటుడు విజయ్పైన విజయకాంత్కు ప్రత్యేక అభిమానమని తెలిపారు. కెప్టెన్ జీవించి ఉంటే ప్రస్తుతం ఏఐ సాంకేతికతతో తన రూపాన్ని చిత్రంలో వాడటంపై అభ్యంతరం చెప్పబోరని పేర్కొన్నారు. విజయ్ తనను కలిసేటప్పుడు కచ్చితంగా మంచి నిర్ణయాన్ని చెబుతానని తెలిపారు.
10 లక్షల వ్యూస్ దాటిని హరా టీజర్
చెన్నై, న్యూస్టుడే: తమిళ చిత్రసీమలో 80, 90లలో అగ్రస్థానంలో ఉన్న కథానాయకుల్లో ఒకరైన మోహన్ ప్రస్తుతం ‘గోట్’లో కీలకపాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. విజయ్ శ్రీజి దర్శకత్వంలో ‘హరా’ అనే చిత్రం ద్వారా మళ్లీ ఆయన కథానాయకుడిగా కనిపించనున్నారు. ఖుష్బూ, యోగిబాబు, దీప, మైమ్ గోపి, శామ్స్, కౌశిక్ తదితరులు ఇతర నటీనటులు. కోయంబత్తూర్ మోహన్రాజ్, జి మీడియా జయశ్రీ విజయ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. టీజర్ను 14న సాయంత్రం విడుదల చేసిన నేపథ్యంలో 24 గంటల్లో 10లక్షల వీక్షణలను యూట్యూబ్లో పొందింది. నిర్మాత మోహన్రాజ్ మాట్లాడుతూ... ఇది తాము నిర్మిస్తున్న రెండో చిత్రమన్నారు. పూర్తిగా కోయంబత్తూర్లో తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. మోహన్కు మళ్లీ కీలక మలుపుగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 93ఏళ్ల వయసులోనూ చారుహాసన్ నటన మెప్పించిందని తెలిపారు.
ఉయిర్ తమిళుక్కు ట్రైలర్ విడుదల
చెన్నై, న్యూస్టుడే: దర్శకుడు అమీర్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఉయిర్ తమిళుక్కు’. చాందిని శ్రీధరన్, ఆనంద్రాజ్, ఇమాన్ అణ్ణాచ్చి, మారిముత్తు, రాజ్కపూర్, సుబ్రమణియ శివ, మహానది శంకర్, రాజసిమ్మన్, శరవణశక్తి తదితరులు ఇతర తారాగణం. మూన్ పిక్చర్స్ బ్యానరుపై ఆదంబావా నిర్మిస్తున్నారు. విద్యాసాగర్ స్వరాలు సమకూర్చారు. చిత్రం విడుదల హక్కులను సురేశ్ కామాచ్చికి చెందిన వి హౌస్ ప్రొడక్షన్ దక్కించుకుంది. పాటలు గతవారం విడుదలైన నేపథ్యంలో ట్రైలర్ను చిత్రబృందం ప్రేక్షకుల ముందుకు తెచ్చింది. రాజకీయ నేపథ్య కథాంశంతో రూపొందింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కునుకు పాట్లు..
[ 02-05-2024]
చేసెందుకు పనెక్కువ ఉంటుంది. శరీరం సహకరించదు, కళ్లు మూసుకుపోతుంటాయి, ఎప్పుడు కునుకేద్దామా అని మనసు లాగేస్తుంటుంది. అటు పని.. ఇటు కాస్తయినా నిద్రపోతే బాగుండనే ఆలోచనలు. -
వృద్ధాప్యం విజయానికి అడ్డుకాలేదు
[ 02-05-2024]
ఆటలాడేందుకు వృద్ధాప్యం అడ్డుకాదని, ముసలితనం శరీరానికేగాని ఆత్మవిశ్వాసానికి కాదని చాటిచెప్పుతున్నారు 76 ఏళ్ల సెల్వరాజ్. ఈ వయసులోనూ ఆయన ఆత్మవిశ్వాసంతో యువకుడిలా క్రీడల్లో సత్తాచాటుతున్నారు. -
పరమత్తిలో 42.5 డిగ్రీలు
[ 02-05-2024]
రాష్ట్రంలో మూడు రోజుల పాటు వేడిగాలుల ప్రభావం ఉంటుందని వాతావరణ పరిశోధన కేంద్రం తెలిపింది. తమిళనాట ఎప్పుడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. -
ఎదురెదురుగా ఢీకొన్న కార్లు ఒకే కుటుంబానికి చెందిన నలుగురి దుర్మరణం
[ 02-05-2024]
కార్లు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాతపడ్డారు. ఈ విషాద ఘటన ఈరోడ్లో చోటుచేసుకుంది. -
మెట్రో రెండోదశలో 300 మలుపులు
[ 02-05-2024]
నగరంలోని మెట్రో రెండోదశలో మూడు వేర్వేరు మార్గాల్లో పనులు శరవేగంగా సాగుతున్నాయి. పూనమల్లి నుంచి పోరూరు కూడలి వరకు ట్రాక్ పనులు ప్రారంభమయ్యాయి. -
వీక్లీ ప్రత్యేక రైళ్లు
[ 02-05-2024]
తాంబరం - సంత్రాగచ్చికి వేసవి రద్దీ కారణంగా వీక్లీ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ రైల్వే మంగళవారం ఓప్రకటనలో తెలిపింది. -
వాహన చోదకులకు మజ్జిగ సరఫరా
[ 02-05-2024]
వేసవి ఎండలు తీవ్రరూపం దాల్చడంతో పలువురు చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. కాంచీపురం ట్రాఫిక్ పోలీసు విభాగం తరఫున వాహన చోదకుల కోసం బుధవారం పట్టణంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. -
బన్రుట్టి బస్టాండులో దాహం కేకలు
[ 02-05-2024]
కడలూర్ జిల్లా బన్రుట్టి నుంచి చెన్నై, కుంబÅŒకోణం, తంజావూర్, విళుపురం, నాగపట్టిణం, పేరావూరణి, చిదంబరం, సీర్గాళి, వేలూర్, చిత్తూరు, తిరువణ్ణామలై, తిరుచ్చి తదితర ప్రాంతాలకు సుమారు 200కు పైగా ప్రభుత్వ, ప్రైవేటు బస్సు లు నడుస్తున్నాయి. -
రాతి క్వారీలో పేలుడు
[ 02-05-2024]
విరుదునగర్ జిల్లా కారియాపట్టి సమీప ఆవియూర్ కడంబన్కుళంలో అదే ప్రాంతానికి చెందిన సేతు, రాజపాళయం శ్రీరామ్లకు చెందిన రాళ్ల క్వారీ ఉంది. -
తండ్రిని చంపిన కుమార్తె అరెస్టు
[ 02-05-2024]
కన్నియాకుమరి జిల్లా పూదప్పాండికి చెందిన సురేష్కుమార్ (46). ఇతనికి వివాహమై ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సురేష్కుమార్కి మద్యం అలవాటు ఉండటంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. -
మళ్లీ విశాల్, ముత్తైయ కాంబో?
[ 02-05-2024]
‘మరుదు’లో కలసి పనిచేసిన నటుడు విశాల్, దర్శకుడు ముతైయ కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనున్నట్టు కోలీవుడ్ సమాచారం. -
సన్ పిక్చర్స్కు ఇళయరాజా నోటీసు
[ 02-05-2024]
రజనీకాంత్ నటిస్తున్న ‘కూలి’ చిత్రం టైటిల్ టీజర్లో తన సంగీతాన్ని అనుమతిలేకుండా వాడినట్టు సన్ పిక్చర్స్కు ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా నోటీసు పంపారు.
తాజా వార్తలు (Latest News)
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?
-
స్విమ్మింగ్ పూల్లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి