సన్ పిక్చర్స్కు ఇళయరాజా నోటీసు
రజనీకాంత్ నటిస్తున్న ‘కూలి’ చిత్రం టైటిల్ టీజర్లో తన సంగీతాన్ని అనుమతిలేకుండా వాడినట్టు సన్ పిక్చర్స్కు ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా నోటీసు పంపారు.
చెన్నై, న్యూస్టుడే: రజనీకాంత్ నటిస్తున్న ‘కూలి’ చిత్రం టైటిల్ టీజర్లో తన సంగీతాన్ని అనుమతిలేకుండా వాడినట్టు సన్ పిక్చర్స్కు ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా నోటీసు పంపారు. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ 171వ చిత్రంగా ‘కూలి’ని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. టైటిల్ టీజర్లో రజనీకాంత్ నటించిన ‘తంగమగన్’లోని ‘వా వా పక్కం వా’ పాట సంగీతం ఉపయోగించారు. తన అనుమతి లేకుండా ఉపయోగించిన ఆ పాట సంగీతాన్ని వెంటనే తొలగించాలని, లేకుంటే ఆ పాటకు తగిన అనుమతి పొందాలని సన్ పిక్చర్స్కు ఇళయరాజా నోటీసు పంపారు. అలా చేయకుంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. తన సంగీతంలోని పాటలను తన అనుమతిలేకుండా స్టేజ్ షోలలో పాడకూడదని, సినిమాల్లోనూ ఉపయోగించకూడదని గతంలో ఇళయరాజా ఆంక్షలు విధించారు. దానిని అతిక్రమించినవారిపై కేసులూ పెడుతుండటం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భవిష్యత్తు మనదే..
[ 15-05-2024]
అభివృద్ధిలో రాష్ట్రం ఉరకలు వేస్తోంది. దేశ సగటుకు మించి ప్రతిభ కనబరుస్తోంది. రానున్న ఆర్థిక సంవత్సరంలో మరింత ప్రగతి సాధించాలని కీలకాంశాల్లో మరింత శ్రమించాలని ఆర్థిక నిపుణులు రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తున్నారు. -
పరువునష్టం కేసులో ఈపీఎస్ విచారణకు హాజరు
[ 15-05-2024]
సెంట్రల్ చెన్నై ఎంపీ దయానిధిమారన్ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామిపై పరువునష్టం దావా వేశారు. ఈ కేసుకు సంబంధించి విచారణకు మంగళవారం ఎడప్పాడి ఎగ్మూర్ కోర్టులో హాజరయ్యారు. -
వివాహ బంధానికి వీడ్కోలు: జీవీ ప్రకాశ్
[ 15-05-2024]
ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాశ్కుమార్ 2013లో గాయని సైంధవిని పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు అన్వి (4) అనే పాప కూడా ఉంది. -
ఆలయాల సందర్శనలో నయనతార దంపతులు
[ 15-05-2024]
కన్నియాకుమరి సమీపంలోని ప్రసిద్ధ సుశీంద్రం తానుమలయస్వామి ఆలయాన్ని ప్రముఖ సినీ నటి నయనతార, ఆమె భర్త విఘ్నేశ్ శివన్ సోమవారం సందర్శించారు. -
ప్లస్వన్లో 91.17 శాతం ఉత్తీర్ణత
[ 15-05-2024]
రాష్ట్రంలో ప్లస్వన్ పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో 91.17శాతం ఉత్తీర్ణత నమోదైంది. రాష్ట్రంలో ప్లస్వన్ వార్షిక పరీక్షలు మార్చి 4 నుంచి 25వ తేదీ వరకు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 8.11 లక్షల మంది రాశారు. -
బస్సు నడుపుతూ స్పృహ కోల్పోయిన డ్రైవర్
[ 15-05-2024]
బస్సు నడుపుతూ డ్రైవరు స్పృహ కోల్పోవడంతో అందులోని 22 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈరోడ్కు చెందిన సెంథిల్రాజా (38) ప్రభుత్వ బస్సు డ్రైవరు. -
ఈపీఎస్ వర్గానికి రెండాకుల గుర్తు కేటాయింపుపై ఎన్నికల సంఘం వివరణ
[ 15-05-2024]
అన్నాడీఎంకేలో ఎడప్పాడి పళనిస్వామి వర్గానికి రెండాకుల గర్తు కేటాయించడంపై సమాచార హక్కు చట్టం కింద అందిన దరఖాస్తుకు ఎన్నికల కమిషన్ వివరణ ఇచ్చింది. -
కంప్యూటర్ సైన్స్, గణితంపై ఆసక్తి
[ 15-05-2024]
ఈ ఏడాది నగర పాఠశాలల్లో ప్లస్వన్ కోర్సుల్లో చేరే వారిలో ఎక్కువ మంది విద్యార్థులు కంప్యూటర్ సైన్స్, గణితం (మ్యాథ్స్) గ్రూపులో చేరడానికి సుముఖంగా కనిపిస్తున్నారు. -
బావిలో మునిగి ముగ్గురు బాలురి మృతి
[ 15-05-2024]
కరూర్ ఆండాంకోవిల్ పుదూర్ కీళ్బాగం ప్రాంతానికి చెందిన రమేష్ కుమారుడు అశ్విన్ (12), అదే ప్రాంతానికి చెందిన శ్రీధర్ కుమారుడు శ్రీవిష్ణు (14), సెల్వన్నగర్కు చెందిన ఇళంగోవన్ కుమారుడు మారిముత్తు (13) స్నేహతులు. -
ఉద్యోగం పేరిట నగదు మోసం
[ 15-05-2024]
సేలం జిల్లా ఏర్కాడుకు చెందిన అస్పరిత్ అజయ్ ఓ ప్రైవేటు విశ్వవిద్యాలయంలో చదువుతున్నాడు. ఇతనికి తన స్నేహితుడు కరికాలన్ ద్వారా పరిచయమైన దినేష్ అనే వ్యక్తి తండ్రి గ్రేటర్ చెన్నై కార్పొరేషన్లో డ్రైవర్గా పని చేస్తూ గుండెపోటుతో మృతి చెందాడు.
తాజా వార్తలు (Latest News)
-
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఊర్వశి హొయలు.. సక్సెస్ జోష్లో అదితి
-
తెలంగాణలో వర్సిటీల ఉపకులపతుల నియామకానికి ఈసీ అనుమతి
-
మ్యూచువల్ ఫండ్ మదుపర్లకు గుడ్న్యూస్.. కేవైసీ నిబంధనల్లో సడలింపు
-
మళ్లీ కలిసిన కేఎల్ - సంజీవ్ గోయెంకా.. అభిమానికి గంభీర్ స్వీట్ రిప్లయ్!
-
ఆర్సీబీ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లుతాడా? చెన్నైతో మ్యాచ్కు వర్షం ముప్పు
-
ఆ షూటింగ్లో రెండు భుజాలకు ఎన్నో గాయాలయ్యాయి: జాన్వీ కపూర్