12 జిల్లాల సరిహద్దుల్లో సోదాలు
తమిళనాడులో 12 జిల్లాల సరిహద్దుల్లో ఫ్ల్లయింగ్స్క్వాడ్ సోదాలు జరుగుతున్నాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సత్యప్రద సాహు తెలిపారు.
సత్యప్రద సాహు
ఆర్కేనగర్, న్యూస్టుడే: తమిళనాడులో 12 జిల్లాల సరిహద్దుల్లో ఫ్ల్లయింగ్స్క్వాడ్ సోదాలు జరుగుతున్నాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సత్యప్రద సాహు తెలిపారు. చెన్నైలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇతర రాష్ట్రాలకు నగదు, వస్తువులు తీసుకెళ్లడాన్ని నిషేధించడానికే సోదాలు జరుపుతున్నామని పేర్కొన్నారు. తిరువణ్ణామలై, వేలూర్, కృష్ణగిరి, సేలం, ఈరోడ్, నీలగిరి, కోవై, తేని, నెల్లై, కన్యాకుమారి, తెంకాశీ, తిరుప్పత్తూర్ తదితర జిల్లాలో 57 బృందాలు మూడు షిఫ్ట్లుగా పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. మిగిలిన జిల్లాలో ఇలాంటి తనిఖీలు లేవన్నారు. పోలింగ్రోజున శాతం గందరగోళానికి కారణం యాప్లో దొరికిన సమాచారం మేరకు లెక్కించడమేనన్నారు. యాప్లో కొందరు మాత్రమే అప్లోడ్ చేయడంతో గందరగోళం ఏర్పడిందన్నారు. ఎన్నికలు నిర్వహించే అధికారి సంతకం చేసి ఇచ్చేందుకు సమాచారం అందడంలో ఆలస్యమవుతున్నందున యాప్ ద్వారా మీడియాకు అప్డేట్ ఇచ్చామన్నారు.
50వేలకుపైగా నగదు తీసుకెళ్లొచ్చు
ఆర్కేనగర్: తమిళనాడు- పుదుచ్చేరిలో 40 లోక్సభ నియోజకవర్గాలకు ఎన్నికలు ముగిశాయి. మరికొన్ని రాష్ట్రాలలో జూన్ 1వరకు ఆరు విడతలుగా పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిబంధనలు అమల్లో ఉన్నాయి. తమిళనాట పోలింగ్ పూర్తయినందున ఫ్లయింగ్స్క్వాడ్ సోదాలు తగ్గాయి. చెన్నైలో మొత్తం 53 బృందాలు వాహన తనిఖీలు చేపట్టిన నేపథ్యంలో ప్రస్తుతం శాసనసభ నియోజకవర్గానికొకటి చొప్పున 18 మాత్రమే సోదాలకు ఉన్నాయి. ఎన్నికల అధికారులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో పోలింగ్ పూర్తయిన నేపథ్యంలో నగదు స్వాధీనానికి సంబంధించి సదరు వ్యక్తులు ఎన్నికల కార్యాలయాలను సంప్రదించి తగిన పత్రాలు చూపి తీసుకోవచ్చని తెలిపారు. చెన్నైలో కార్పొరేషన్ సహాయ కమిషనర్ ఉమామహేశ్వరి ఇందుకు నియమితులయ్యారని చెప్పారు. జిల్లాల్లోని ఫ్లయింగ్స్క్వాడ్లను రద్దు చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించిందన్నారు. రాష్ట్ర సరిహద్దుల్లో మాత్రమే సోదాలు కొనసాగుతాయన్నారు. వ్యాపారులు, ప్రజలు నష్టపోకూడదని ఎన్నికల కమిషన్ పలు సడలింపులు చేసిందన్నారు. అందులో భాగంగా ఇప్పుడు రూ.50వేలకు పైగా నగదు తీసుకెళ్లొచ్చని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్ట్రాంగ్గా ఉన్నట్టేనా?
[ 04-05-2024]
తెన్కాశి పార్లమెంటులో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్రూమ్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. 210 సీసీ కెమెరాలు ఏర్పాటుచేస్తే 90 పనిచేయట్లేదని తేలింది. -
ఎండ నుంచి ఉపశమనానికి గ్రీన్ నెట్స్
[ 04-05-2024]
ఎండలు భగ్గుమంటుండంతో వాహన చోదకులు సిగ్నళ్ల వద్ద నిలబడేందుకు ఇబ్బంది పడుతున్నారు. వారికి ఉపశమనం కలిగించేందుకు కోవై, తిరుప్పూర్ కార్పొరేషన్ల తరఫున తాత్కాలిక పందిళ్లు ఏర్పాటు చేశారు. -
విజయకాంత్ స్మారక ప్రదేశానికి ప్రపంచ రికార్డులో చోటు
[ 04-05-2024]
నటుడు, డీఎండీకే వ్యవస్థాపకుడు దివంగత విజయకాంత్ స్మారక ప్రదేశానికి ప్రపంచ రికార్డులో చోటు దక్కింది. ‘కెప్టెన్’ అనారోగ్యంతో గతేడాది డిసెంబరులో మృతి చెందగా కోయంబేడులోని డీఎండీకే ప్రధాన కార్యాలయం ప్రాంగణంలో అంత్యక్రియలు నిర్వహించిన విషయం తెలిసిందే. -
పెరిగిన విమాన సర్వీసులు
[ 04-05-2024]
వేసవి రద్దీతో నగరం నుంచి పలు ప్రాంతాలకు వెళ్లే విమాన సర్వీసుల సంఖ్య పెరిగింది. పాఠశాలలు, కళాశాలలకు పరీక్షలు ముగిసి సెలవులు ప్రకటించడంతో అనేక మంది కుటుంబాలతో కలిసి సెలవులు గడిపేందుకు వెళ్తున్నారు. -
నీళ్లట్యాంకులో మలం కలిపారని వదంతులు
[ 04-05-2024]
రాణిపేట సమీపం నౌలాక్ పంచాయతీ సిప్కాట్ వద్ద ఉన్న ప్రభుత్వ మహోన్నత పాఠశాల సమీపంలో లక్ష లీటర్ల సామర్థ్యమున్న నీళ్ల ట్యాంకు ఉంది. -
ఎలక్షన్ రెండో సింగిల్ విడుదల
[ 04-05-2024]
‘ఉరియడి’, ‘ఫైట్ క్లబ్’ చిత్రాలతో గుర్తింపు పొందిన నటుడు విజయకుమార్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ‘ఎలక్షన్’. లోక్సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ‘ఎలక్షన్’ అనే టైటిల్ చిత్రంపై సినీ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచింది. -
ఊటీలో 10 రోజులపాటు పుష్ప ప్రదర్శన
[ 04-05-2024]
ఊటీలో మొదటిసారిగా ఈ నెల 10 నుంచి 20వ తేదీ వరకు పది రోజులపాటు పుష్ప ప్రదర్శన నిర్వహించనున్నట్లు నీలగిరి కలెక్టర్ అరుణ తెలిపారు. -
వీఐటీ ప్రవేశ పరీక్షలో ఏపీ విద్యార్థికి 3వ స్థానం
[ 04-05-2024]
వేలూర్ వీఐటీ విశ్వవిద్యాలయంలో 2024 విద్యా సంవత్సరానికిగాను ఇంజినీరింగ్లో ప్రవేశాలకు ఇటీవల ప్రవేశ పరీక్షలు నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
ముందు మీరు రాయ్బరేలీలో గెలవండి.. రాహుల్కు సలహా ఇచ్చిన చెస్ దిగ్గజం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/05/24)
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
-
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం