20 రోజుల్లో రూ.190 కోట్లు
చెన్నై కార్పొరేషన్లో ఏప్రిల్ 20 వరకు రూ.190 కోట్ల ఆస్తిపన్ను వసూలైంది. ఈ నెలాఖరులోపు చెల్లిస్తే 5శాతం రాయితీ పొందొచ్చని కార్పొరేషన్ ప్రకటించింది.
చెన్నై కార్పొరేషన్లో ఆస్తిపన్ను వసూలు
నెలాఖరులోపు చెల్లించేవారికి 5 శాతం రాయితీ
ఆర్కేనగర్, న్యూస్టుడే: చెన్నై కార్పొరేషన్లో ఏప్రిల్ 20 వరకు రూ.190 కోట్ల ఆస్తిపన్ను వసూలైంది. ఈ నెలాఖరులోపు చెల్లిస్తే 5శాతం రాయితీ పొందొచ్చని కార్పొరేషన్ ప్రకటించింది. చెన్నై కార్పొరేషన్ ఆదాయంలో ఆస్తిపన్ను ప్రధానమైనది. నగరంలోని 13.59 లక్షల ఆస్తి యజమానుల నుంచి అర్ధ సంవత్సరానికి రూ.850 కోట్లు, ఏడాదికి రూ.1,700 కోట్లు అందుతుంది. ఏప్రిల్ 30లోపు మొదటి అర్ధ సంవత్సరానికి, అక్టోబరు 30లోపు రెండో అర్ధానికి చెల్లించాలి. గడువులోపు చెల్లిస్తే 5శాతం, అత్యధికంగా రూ.5 వేల వరకు రాయితీ అందుతుంది. ఆ తర్వాత చెల్లిస్తే ఒకశాతం ప్రత్యేక వడ్డీ విధిస్తారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కార్పొరేషన్ లక్ష్యం దాటి రూ.1,800 కోట్లు వసూలైంది. ఇది అంతకుముందు సంవత్సరానికి కంటే రూ.227 కోట్లు అధికం. ఈ ఏడాది 2.31 లక్షల మంది పన్ను చెల్లించి 5శాతం రాయితీ పొందారు. మిగిలినవారు కూడా 30లోపు చెల్లించి రాయితీ పొందాలని కార్పొరేషన్ కోరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చిత్తడి నేలలపై అంతులేని నిర్లక్ష్యం
[ 03-05-2024]
భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమవుతున్న నగరాలు, ప్రాంతాలు రాష్ట్రంలో ఎక్కువే. వాటినుంచి కాపాడే సత్తా ఉన్న చిత్తడినేలలు మాత్రం నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. ఫలితంగా కొన్ని అన్యాక్రాంతమవడంతో పాటు ఆక్రమణలకు గురవుతున్నాయి. -
ఆలయ ఉత్సవాల్లో ఘర్షణ
[ 03-05-2024]
ఆలయ ఉత్సవాల్లో ఒక వర్గం వారు ప్రార్థన చేయడానికి నిరాకరించడంతో ఏర్పడిన ఘర్షణ భారీ విధ్వంసానికి దారి తీసింది. పోలీసుల కథనం మేరకు.. జిల్లాలోని ఓమలూరు సమీపం తీవట్టిపట్టి వద్ద హిందూ దేవాదాయ శాఖ -
డ్రైవరు రహిత రైళ్లలో అధునాతన వసతులు
[ 03-05-2024]
మెట్రో రెండో దశ మార్గంలో రానున్న డ్రైవరు రహిత రైళ్లలో అధునాతన వసతులు సమకూరనున్నాయి. బోగీల్లో ఆనుకుని కూర్చునేందుకు వీలుగా సీట్లు, డ్రైవర్ల వీక్షణ (డ్రైవర్స్ వ్యూ), సెల్ఫోన్లకు ఛార్జింగు వంటి పలు సదుపాయాలతో బోగీ నిర్మాణం జరగనుంది. -
నేపథ్య గాయని ఉమా రమణన్ కన్నుమూత
[ 03-05-2024]
నేపథ్య గాయని ఉమా రమణన్(71) ఆరోగ్య సమస్యలతో కన్నుమూశారు. కొద్ది నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చెన్నై అడయారులోని నివాసంలో బుధవారం రాత్రి 7.45 గంటలకు తుదిశ్వాస విడిచినట్టు ఆమె భర్త రమణన్ వెల్లడించారు. -
కర్ణాటక కాంగ్రెస్కు వ్యతిరేకంగా పోరాటం
[ 03-05-2024]
కావేరి జలాల వ్యవహారంలో కర్ణాటక కాంగ్రెస్కు వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్ధమని టీఎన్సీసీ అధ్యక్షుడు సెల్వ పెరుంతగై తెలిపారు. తేనాంపేటలోని కామరాజర్ ఆడిటోరియంలో గురువారం విలేకర్లతో మాట్లాడారు. -
దుర్గాస్టాలిన్ బోటు షికారు
[ 03-05-2024]
ముఖ్యమంత్రి స్టాలిన్ కుటుంబంతో పాటు కొడైకెనాల్లో విశ్రాంతి తీసుకునేందుకు వెళ్లారు. బుధవారం సాయంత్రం కొడైకెనాల్ చెరువులో స్టాలిన్ సతీమణి దుర్గాస్టాలిన్ పడవ సవారీ చేశారు. -
సర్పాలతో జాగ్రత్త!
[ 03-05-2024]
వేసవి ఎండలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో సర్పాలు ఖాళీ స్థలాలు, గృహాలలోకి చొరబడే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అటవీశాఖ సూచిస్తోంది. -
దాహార్తి తీరుస్తున్న నెమ్మెలి నిర్లవణీకరణ పథకం
[ 03-05-2024]
రాష్ట్ర రాజధాని తాగునీటి అవసరాలు తీర్చేందుకు పూండి, పుళల్, చెంబరంబాక్కం, చోళవరం, వీరాణం చెరువు నుంచి దక్షిణ చెన్నై ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. -
స్వీయ కాన్పుతో బిడ్డను చంపుకొన్న నర్సుపై హత్యయత్నం కేసు
[ 03-05-2024]
సన్నిహితుడి ద్వారా గర్భవతి అయిన ఓ నర్సు స్వీయ కాన్పునకు యత్నించి బిడ్డను చంపిన ఘటనలో నగర పోలీసులు ఆమెపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. -
అజిత్ రాజకీయాల్లోకి వస్తే స్వాగతిస్తాం : జయకుమార్
[ 03-05-2024]
నటుడు అజిత్కుమార్ రాజకీయాల్లో వస్తే స్వాగతిస్తామని అన్నాడీఎంకే మాజీ మంత్రి జయకుమార్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘అప్రమత్తంగా ఉండండి’ : ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
-
ఎన్నికల వేళ.. ‘సూపర్ సీఎం’ సతీమణిపై బదిలీ వేటు
-
ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్.. ప్రభుత్వ అప్లికేషన్లకు ఇకపై లేబుల్స్
-
ఉగ్రదాడులకు కుట్ర.. ఉక్రెయిన్ ‘ఏజెంట్’ను చంపిన రష్యా