ఐఎస్ఐ మద్దతుదారుడి అరెస్టుకు ప్రతీకారంగానే కోయంబత్తూరులో బాంబు పేలుళ్లకు కుట్ర
ఐఎస్ఐ మద్దతుదారుడిని అరెస్టు చేసినందుకే కోయంబత్తూరులో బాంబు పేలుళ్లకు కుట్ర చేసినట్లు తెలిసింది.
సైదాపేట, న్యూస్టుడే: ఐఎస్ఐ మద్దతుదారుడిని అరెస్టు చేసినందుకే కోయంబత్తూరులో బాంబు పేలుళ్లకు కుట్ర చేసినట్లు తెలిసింది. కోయంబత్తూరు కోట్టైమేడు సంగమేశ్వరర్ ఆలయం ముందు 20244 అక్టోబర్ 23న కారు బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఆదే ప్రాంతానికి చెందిన జమేషా ముబిన్ అనే యువకుడు మృతి చెందాడు. దీపావళి ముందు రోజు జనం ఎక్కువగా గుమిగూడే సమయంలో బాంబు పేలుడుకు కుట్ర చేసిన నేపథ్యంలో జమేషా ముబిన్ బలయ్యాడు. ఈ కేసు దర్యాప్తు ఎన్ఐఏ చేపట్టింది. దీనికి సంబంధించి 14 మందిని అరెస్టు చేశారు. ముందే ఈ కేసులో రెండు అభియోగపత్రాలు దాఖలు చేశారు. ముబిన్, ఐఎస్ఐ ముఖ్య మద్దతుదారుడు అయిన ఉమర్ ఫారూక్ సన్నిహితుడు అయిన కోయంబత్తూరు పోత్తనూరు తిరుమలై నగర్కు చెందిన తాహా నజీర్ అనే వ్యక్తి 14వ నేరస్థుడిగా పేర్కొంటూ గత నవంబర్లో ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు. ఇతనిపై చెన్నై పూందమల్లి ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో ప్రస్తుతం అభియోగపత్రం దాఖలు చేశారు. అందులో కోయంబత్తూరు కారు బాంబు పేలుడు గురించి పలు సంచలన విషయాలు వెల్లడించారు. కోయంబత్తూరుకు చెందిన మహ్మద్ అజారుద్దీన్ అనే వ్యక్తి ఐఎస్ఐకు మద్దతుగా పని చేయడంతో 2019లో అరెస్టయ్యాడని, దీనికి ప్రతీకారం తీర్చుకునే విధంగా కోయంబత్తూరులో కారు బాంబు పేలుడు జరిపేందుకు ముబిన్, అతని సహచరులు ప్రణాళిక రచించినట్లు పేర్కొంది. అదృష్టవశాత్తు బాంబు ముందుగానే పేలడంతో పెనుప్రమాదం తప్పినట్లు తెలిపింది. అదేవిధంగా అరెస్టయిన ఉమర్ ఫారూక్ సత్యమంగళం అటవీ ప్రాంతంలో ఐఎస్ఐ మద్దతుదారులకు ఆయుధ శిక్షణ ఇచ్చినట్లు అందులో వివరించింది. అతనితోపాటు తాహా నజీర్ కలిసి కుట్రలు చేసినట్లు, తద్వారా దేశ శాంతిభద్రతలకు విఘాతం కలిగించి, సమైక్యత, మతసామరస్యాన్ని దెబ్బతీసేందుకు ఆ ముఠా పని చేసినట్లు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పూర్వ విద్యార్థులే ఐఐటీ బలం!
[ 14-05-2024]
దేశంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఐఐటీ మద్రాస్ విద్యార్థుల శ్రేయస్సు, దేశం కోసం ఎన్నో ప్రాజెక్టులు తెస్తోంది. భారీగా నిధులు ఖర్చుపెడుతోంది. ఈ విద్యాసంస్థ ఈ తరహాలో దూసుకుపోయేందుకు ఇక్కడ చదివిన పూర్వ విద్యార్థులే కారణమని అంటున్నారు -
పాఠకుల సంఖ్య పెంచుతా: రచయిత శివశంకర్
[ 14-05-2024]
నేటితరం యువత సెల్ఫోన్లకే పరిమితమవుతున్న తరుణంలో వారి దృష్టిని పుస్తకాల వైపు మళ్లించడానికి శాయశక్తులా కృషి చేస్తున్నట్లు ‘బుక్స్ అండ్ రీడర్స్-ఫిలిమ్స్ అండ్ ఫ్యాన్స్ అసోసియేషన్’ అద్యక్షుడు శివశంకర్ పేర్కొన్నారు. -
నాగపట్నం ఎంపీ సెల్వరాజ్ కన్నుమూత
[ 14-05-2024]
నాగపట్నం ఎంపీ సెల్వరాజ్ (67) సోమవారం అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. తిరువారూర్ జిల్లా నీడామంగళం కప్పలుడైయాన్ గ్రామానికి చెందిన సెల్వరాజ్కు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. -
జైలులో ప్రాణానికి ముప్పు: సవుక్కు శంకర్
[ 14-05-2024]
జైల్లో తన ప్రాణానికి ముప్పు ఉందని సవుక్కు శంకర్ ఆందోళన వ్యక్తం చేశాడు. మహిళా పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ప్రముఖ యూట్యూబర్ సవుక్కు శంకర్ను పోలీసులు -
కన్నియాకుమరిలో జోరుగా వర్షాలు
[ 14-05-2024]
కన్నియాకుమరి జిల్లాలో గత కొన్నిరోజులుగా సాధారణం కంటే అధికంగా ఎండలు మండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
ఇంజినీరింగ్లో ఏఆర్ అండ్ వీఆర్ కోర్సు
[ 14-05-2024]
అన్నా విశ్వవిద్యాలయం (ఏయూ) ప్రాంగణంలోని కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ (సీఈజీ) 2024-25 విద్యా సంవత్సరం నుంచి ‘ఆగ్మెంటెడ్ రియాల్టి అండ్ వర్చువల్ రియాల్టి’ (ఏఆర్ అండ్ వీఆర్) మూడేళ్ల డిగ్రీ కోర్సును ప్రారంభించేందుకు ఆలోచిస్తోంది. -
మనస్తాపంతో వివాహిత బలవన్మరణం
[ 14-05-2024]
విళుపురం జిల్లా మరక్కాణం సమీపం కానిమేడు గ్రామానికి చెందిన చక్రవర్తి, వనిత దంపతులకు 16 ఏళ్ల కుమార్తె ఉంది. ఈమె అదే ప్రాంతంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో 11వ తరగతి చదువుతోంది. -
పట్టాలపై పడుకున్న ముగ్గురు యువకులు
[ 14-05-2024]
పట్టాలపై నిద్రించిన ముగ్గురు యువకుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు.. నాగపట్టిణం జిల్లా వేదారణ్యంకు చెందిన కుమారసారథి(18), తులసి నారాయణన్(18), ప్రభాకరన్(18) అనే ముగ్గురు యువకులు -
నడిగర్ సంఘానికి ధనుష్ విరాళం
[ 14-05-2024]
ఆర్థిక సంక్షోభం కారణంగా అర్ధాంతరంగా నిలిచిపోయిన నడిగర్ సంఘం భవన నిర్మాణ పనుల కోసం పలువురు నటులు స్వచ్ఛందంగా తమవంతు విరాళాలు అందిస్తున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు (Latest News)
-
‘ఆ మాటలు సరికాదు’: ఐఎంఏ చీఫ్ వ్యాఖ్యలపై సుప్రీం ఆగ్రహం
-
రికార్డు లాభాల్లో ప్రభుత్వ బ్యాంకులు.. 2023-24లో ₹1.4 లక్షల కోట్లు
-
విమానాల రద్దు.. భర్త కడసారి చూపునకు దూరమై!
-
పిల్లల జీవితాన్ని ఎవరు రిస్క్లో పెట్టమన్నారు: రష్మి
-
దిల్లీ మద్యం కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
-
వైట్హౌస్లో ‘సారే జహాసె అచ్ఛా..’ ‘పానీపూరీ’ల విందు