విజయ్ పుట్టినరోజున గోట్ రెండో సింగిల్
విజయ్ 68వ చిత్రంగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో ‘గోట్’ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్) రూపొందుతున్న విషయం తెలిసిందే.
చిత్రంలో ఓ సన్నివేశం
చెన్నై: విజయ్ 68వ చిత్రంగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో ‘గోట్’ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్) రూపొందుతున్న విషయం తెలిసిందే. జయరామ్, ప్రభుదేవా, మోహన్, ప్రశాంత్, వైభవ్, స్నేహ, లైలా తదితర నటీనటులతో మల్టీ స్టారర్ చిత్రంగా తెరకెక్కుతోంది. చిత్రం తొలి సింగిల్ ‘విజిల్ పోడు’ పాట కొన్ని వారాల కిందట విడుదలై అభిమానుల నుంచి విశేష స్పందన పొందింది. అత్యధిక లైక్, వీక్షణల రికార్డును నెలకొల్పింది. ఈ నేపథ్యంలో చిత్రం రెండో సింగిల్ను విజయ్ పుట్టినరోజైన జూన్ 22న విడుదల చేయనున్నట్టు దర్శకుడు వెంకట్ ప్రభు ప్రకటించారు. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబరు 5న సినిమా విడుదల కానుందని చిత్రబృందం ప్రకటించింది.
‘సూదు కవ్వుం-2’ బృందానికి అభినందనలు
సినిమా పోస్టరు
చెన్నై, న్యూస్టుడే: నలన్ కుమారసామి దర్శకత్వంలో 2013లో విడుదలై విజయం సాధించిన చిత్రం ‘సూదు కవ్వుం’. చిత్రంలో విజయ్ సేతుపతి, సంజితా శెట్టి, అశోక్ సెల్వన్, బాబి సింహా, రమేశ్ తిలక్, కరుణాకరన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ప్రస్తుతం చిత్రం సీక్వెల్గా ‘సూదు కవ్వుం-2’ రూపొందింది. ఎం.ఎస్.అర్జున్ దర్శకత్వంలో మిర్చి శివ కథానాయకుడిగా నటించారు. సినిమా ట్రైలర్, పాటలు కొన్ని వారాల కిందట విడుదలై సినీ అభిమానుల ఆదరణ పొందాయి. త్వరలో చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు ఎం.ఎస్.అర్జున్, ఛాయాగ్రాహకుడు కార్తిక్ తిల్లైను నటుడు విజయ్ సేతుపతి తన కార్యాలయానికి పిలిపించి అభినందించారు.
స్టార్ ట్రైలర్కు ప్రశంసలు
చెన్నై: ఇళన్ దర్శకత్వంలో కవిన్ నటించిన ‘స్టార్’ చిత్రం ట్రైలర్ను చిత్రబృందం విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనిపై సినీ రంగ ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ట్రైలర్ను చూసిన వెంటనే చిత్రాన్ని చూడాలన్న ఉత్సాహం కలుగుతోందని ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మేనన్ తెలిపారు. సన్నివేశాలు, చిత్రీకరణ విధానం వంటివి ఆకర్షించాయని, ఇదొక మంచి చిత్రంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. నటుడైన మంత్రి ఉదయనిధి కూడా ట్రైలర్ను చూసి చిత్రబృందాన్ని అభినందించారు.
మే 1న దీన రీ రిలీజ్
సినిమాలో ఓ సన్నివేశం
చెన్నై: ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో అజిత్కుమార్, లైలా, సురేశ్ గోపి ముఖ్య తారాగణంగా 2001లో విడుదలైన చిత్రం ‘దీన’. అజిత్కుమార్కు గుర్తింపు తీసుకొచ్చిన చిత్రాల్లో ఇదీ ఒకటి. ఈ చిత్రం విడుదలై 23 ఏళ్లయిన నేపథ్యంలో డిజిటల్ ముద్రణలో సినిమాను రీ రిలీజ్ చేయనున్నారు. అజిత్కుమార్ పుట్టినరోజు సందర్భంగా మే 1న రీ రిలీజ్ చేయనున్నట్టు చిత్రబృందం ప్రకటించారు. ఇదే రోజు అజిత్ చిత్రాలైన ‘బిల్లా’, ‘మంగాత్త’ చిత్రాలూ రీ రిలీజ్ కానుండటం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పూర్వ విద్యార్థులే ఐఐటీ బలం!
[ 14-05-2024]
దేశంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఐఐటీ మద్రాస్ విద్యార్థుల శ్రేయస్సు, దేశం కోసం ఎన్నో ప్రాజెక్టులు తెస్తోంది. భారీగా నిధులు ఖర్చుపెడుతోంది. ఈ విద్యాసంస్థ ఈ తరహాలో దూసుకుపోయేందుకు ఇక్కడ చదివిన పూర్వ విద్యార్థులే కారణమని అంటున్నారు -
పాఠకుల సంఖ్య పెంచుతా: రచయిత శివశంకర్
[ 14-05-2024]
నేటితరం యువత సెల్ఫోన్లకే పరిమితమవుతున్న తరుణంలో వారి దృష్టిని పుస్తకాల వైపు మళ్లించడానికి శాయశక్తులా కృషి చేస్తున్నట్లు ‘బుక్స్ అండ్ రీడర్స్-ఫిలిమ్స్ అండ్ ఫ్యాన్స్ అసోసియేషన్’ అద్యక్షుడు శివశంకర్ పేర్కొన్నారు. -
నాగపట్నం ఎంపీ సెల్వరాజ్ కన్నుమూత
[ 14-05-2024]
నాగపట్నం ఎంపీ సెల్వరాజ్ (67) సోమవారం అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. తిరువారూర్ జిల్లా నీడామంగళం కప్పలుడైయాన్ గ్రామానికి చెందిన సెల్వరాజ్కు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. -
జైలులో ప్రాణానికి ముప్పు: సవుక్కు శంకర్
[ 14-05-2024]
జైల్లో తన ప్రాణానికి ముప్పు ఉందని సవుక్కు శంకర్ ఆందోళన వ్యక్తం చేశాడు. మహిళా పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ప్రముఖ యూట్యూబర్ సవుక్కు శంకర్ను పోలీసులు -
కన్నియాకుమరిలో జోరుగా వర్షాలు
[ 14-05-2024]
కన్నియాకుమరి జిల్లాలో గత కొన్నిరోజులుగా సాధారణం కంటే అధికంగా ఎండలు మండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
ఇంజినీరింగ్లో ఏఆర్ అండ్ వీఆర్ కోర్సు
[ 14-05-2024]
అన్నా విశ్వవిద్యాలయం (ఏయూ) ప్రాంగణంలోని కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ (సీఈజీ) 2024-25 విద్యా సంవత్సరం నుంచి ‘ఆగ్మెంటెడ్ రియాల్టి అండ్ వర్చువల్ రియాల్టి’ (ఏఆర్ అండ్ వీఆర్) మూడేళ్ల డిగ్రీ కోర్సును ప్రారంభించేందుకు ఆలోచిస్తోంది. -
మనస్తాపంతో వివాహిత బలవన్మరణం
[ 14-05-2024]
విళుపురం జిల్లా మరక్కాణం సమీపం కానిమేడు గ్రామానికి చెందిన చక్రవర్తి, వనిత దంపతులకు 16 ఏళ్ల కుమార్తె ఉంది. ఈమె అదే ప్రాంతంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో 11వ తరగతి చదువుతోంది. -
పట్టాలపై పడుకున్న ముగ్గురు యువకులు
[ 14-05-2024]
పట్టాలపై నిద్రించిన ముగ్గురు యువకుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు.. నాగపట్టిణం జిల్లా వేదారణ్యంకు చెందిన కుమారసారథి(18), తులసి నారాయణన్(18), ప్రభాకరన్(18) అనే ముగ్గురు యువకులు -
నడిగర్ సంఘానికి ధనుష్ విరాళం
[ 14-05-2024]
ఆర్థిక సంక్షోభం కారణంగా అర్ధాంతరంగా నిలిచిపోయిన నడిగర్ సంఘం భవన నిర్మాణ పనుల కోసం పలువురు నటులు స్వచ్ఛందంగా తమవంతు విరాళాలు అందిస్తున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు (Latest News)
-
చరణ్ వల్లే ఆ డిప్రెషన్ నుంచి బయటపడ్డా: ఉపాసన
-
హోర్డింగ్ కూలిన ఘటనలో 14కు చేరిన మృతులు.. యాడ్ ఏజెన్సీపై కేసు
-
టీ20 వరల్డ్కప్.. హార్దిక్ను ఎంపిక చేయడం రోహిత్కు ఇష్టం లేదా..?
-
సీఎం ఇంట్లో ఎంపీపై దాడి: ఎవరీ బిభవ్ కుమార్..?
-
ఇరాన్తో డీల్.. భారత్కు అమెరికా వార్నింగ్..!
-
వారణాసితో నా బంధం విడదీయలేనిది: ఎమోషనల్ వీడియో షేర్ చేసిన ప్రధాని మోదీ