logo

పెళ్లి చేసుకోలేదని మహిళపై హత్యాయత్నం

విరుదునగర్‌ జిల్లా రాజపాళయానికి చెందిన పెరుమాళ్‌సామి, జ్యోతి భార్యాభర్తలు. వీరికి ముగ్గురు కుమార్తెలున్నారు. మూడో కుమార్తె పాండిసెల్వి వస్త్ర దుకాణంలో పని చేస్తోంది.

Published : 30 Apr 2024 00:47 IST

నిందితుడు గుణశేఖర్‌
ప్యారిస్‌, న్యూస్‌టుడే: విరుదునగర్‌ జిల్లా రాజపాళయానికి చెందిన పెరుమాళ్‌సామి, జ్యోతి భార్యాభర్తలు. వీరికి ముగ్గురు కుమార్తెలున్నారు. మూడో కుమార్తె పాండిసెల్వి వస్త్ర దుకాణంలో పని చేస్తోంది. ఈమెకు వివాహమై భర్తతో గొడవల కారణంగా పుట్టింట్లో ఉంటోంది. ఈ నేపథ్యంలో ఆమెకు మదురైకి చెందిన గుణశేఖర్‌ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఇటీవల వారి మధ్య గొడవ జరగడంతో పాండిసెల్వి అతనితో మాట్లాడటం మానేసింది. ఈ క్రమంలో వివాహం చేసుకోవాలని  గుణశేఖర్‌ ఆమెను బలవంతం చేయసాగాడు. ఆమె అంగీకరించకపోవడంతో గుణశేఖర్‌ పాండిసెల్విపై కిరోసిన్‌ పోసి నిప్పంటించాడు. పాండిసెల్వి సోదరి కాపాడడానికి యత్నించగా ఆమెకు కూడా మంటలు అంటుకున్నాయి. వారి కేకలు విన్న స్థానికులు అక్కడకు చేరుకుని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న గుణశేఖర్‌ని సోమవారం అరెస్టు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని