అవాస్తవ ప్రచారం తగదు: ముఖ్యమంత్రి స్టాలిన్
విజయబాటలో ఇండియా కూటమి వెళ్తున్నందున ఓటమి భయంతో మోదీ అవాస్తవ ప్రచారాలు చేస్తున్నారని ముఖ్యమంత్రి స్టాలిన్ విమర్శించారు. ఆయన విడుదల చేసిన ప్రకటనలో.. వెనుకబడిన, అణగారిన, షెడ్యుల్డ్ తెగల జీవితాల్లో వెలుగు నింపేందుకు 50శాతం రిజర్వేషన్ల పరిమితి తొలగించాలని రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ కోరుతున్నాయన్నారు.
ఆర్కేనగర్, న్యూస్టుడే: విజయబాటలో ఇండియా కూటమి వెళ్తున్నందున ఓటమి భయంతో మోదీ అవాస్తవ ప్రచారాలు చేస్తున్నారని ముఖ్యమంత్రి స్టాలిన్ విమర్శించారు. ఆయన విడుదల చేసిన ప్రకటనలో.. వెనుకబడిన, అణగారిన, షెడ్యుల్డ్ తెగల జీవితాల్లో వెలుగు నింపేందుకు 50శాతం రిజర్వేషన్ల పరిమితి తొలగించాలని రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ కోరుతున్నాయన్నారు. ఈ పిలుపు ఇండియా కూటమిలో, దేశం మొత్తం ప్రతిధ్వనించడం ప్రారంభమైందని తెలిపారు. ఉత్తరప్రదేశ్ ప్రజలకు మేలుచేసే దీనిపై మోదీ ఎప్పుడూ మాట్లాడలేదని, హామీ ఇవ్వలేదన్నారు. ఆయన విద్వేష ప్రచారం మాత్రమే చేస్తున్నారన్నారు. మతోన్మాద ప్రచారం వదిలిపెట్టకుండా రాష్ట్రాల మధ్య వివాదాలు పెట్టాలని చూస్తున్నారన్నారు. రాష్ట్రంలో మహిళల కోసం తీసుకొచ్చిన పథకాలతో ఎందరో లబ్ధి పొందుతున్నారని గుర్తు చేశారు. బస్సుల్లో ఉచిత ప్రయాణం కారణంగా మెట్రో రైళ్లలో రద్దీ లేదని అంటున్నారన్నారు. కేటాయించిన నిధులు ఇవ్వకుండా చెన్నై మెట్రో రెండోదశ విస్తరణ ప్రాజెక్ట్ అడ్డుకున్న మోదీ వాస్తవాలు దాచిపెట్టి నిందలు మోపుతున్నారని తెలిపారు. భాజపా విభజన కలలు ఎప్పటికీ ఫలించబోవన్నారు.
ఇండియా కూటమిదే అధికారం: సెల్వపెరుంతగై
కోయంబత్తూరు, న్యూస్టుడే: కేంద్రంలో జూన్ 4 తర్వాత ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని టీఎన్సీసీ అధ్యక్షుడు సెల్వపెరుంతగై ధీమా వ్యక్తం చేశారు. కోయంబత్తూరులో శనివారం జరిగిన పార్టీ కార్యకర్తల సమవేశంలో పాల్గొన్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. అగ్రనేత రాహుల్గాంధీ చేపట్టిన జోడోయాత్రతో పార్టీ బలోపేతమైందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికల్లో చేస్తున్న విషపూరిత ఆరోపణలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని, ఆ పార్టీ ఘోర పరాజయం పాలవడం ఖాయమన్నారు. రాష్ట్రంలో కామరాజర్ పాలన తీసుకురావాలన్నది ప్రతి కార్యకర్త ఆకాంక్ష అని, ఆ దిశగా కృషి చేస్తామన్నారు. 2026లో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో డీఎంకేతో పొత్తుకు సంబంధించి పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని పునరుద్ఘాటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జయలలిత సిద్ధాంతాలపై జగడం
[ 02-06-2024]
జయలలిత హిందుత్వవాది అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయవర్గాల్లో పెనుదుమారం రేపుతున్నాయి. అన్నామలై ఇటీవల విలేకర్లతో మాట్లాడుతూ.. -
కాషాయ వస్త్రాలతో సూర్యారాధన
[ 02-06-2024]
కన్నియాకుమరిలోని వివేకానంద స్మారక మండపంలో ప్రధాని మోదీ ధ్యానం ముగిసింది. శనివారం ఉదయం 5.50కు కాషాయ వస్త్రాలతో బయటకొచ్చిన ప్రధాని సూర్యారాధన చేశారు. -
త్వరలో పిత్తల మాత్తి విడుదల
[ 02-06-2024]
మాణిక్క విద్య దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పిత్తల మాత్తి’. ఇందులో ఉమాపతి రామయ్య, సంస్కృతి, బాల శరవణన్, తంబి రామయ్య, దేవదర్శిని, విద్యుల్లేఖ రామన్, ‘ఆడుకళం’ నరేన్, ‘కాదల్’ సుకుమార్ తదితరులు నటించారు. -
‘కలైజ్ఞర్ 100’ ప్రదర్శన ప్రారంభం
[ 02-06-2024]
దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి శతజయంతి ముగింపు వేడుకలు సందర్భంగా ప్యారిస్ కార్నర్లోని రాజా అన్నామలై హాలులో ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను నటుడు ప్రకాశ్రాజ్ శనివారం ప్రారంభించారు. -
షరతులతో పర్యాటకులకు అనుమతి
[ 02-06-2024]
ప్రధాని మోదీ ధ్యానం సందర్భంగా గురువారం కన్నియాకుమరి వివేకానంద స్మారక మండపానికి పర్యాటకులను అనుమతించలేదు. శుక్రవారం అనుమతించారు. లగేజీ, సెల్ఫోన్లు తదితరాలను తీసుకెళ్లనివ్వలేదు. -
భాజపా రికార్డు సృష్టిస్తుంది
[ 02-06-2024]
లోక్సభ ఎన్నికల్లో భాజపా రికార్డు సృష్టించి ప్రధాని మోదీ మూడోసారి ప్రధాని అవుతారని కేంద్ర సహాయ మంత్రి ఎల్.మురుగన్ ధీమా వ్యక్తం చేశారు. -
చెన్నైలో తల్లిపాల విక్రయంపై నిఘా
[ 02-06-2024]
చెన్నైలో తల్లిపాల విక్రయాలపై నిఘా పెట్టేందుకు 18 బృందాలు ఏర్పాటు చేసినట్లు ఆహారభద్రతాశాఖ అధికారులు తెలిపారు. చెన్నై మాధవరం ప్రాంతంలో చట్టవిరుద్ధంగా తల్లిపాలు సీసాల్లో పెట్టి విక్రయిస్తున్న ప్రైవేట్ మందుల దుకాణానికి
తాజా వార్తలు (Latest News)
-
పాముకాటుకు, ముల్లుకు తేడా తెలీదా డాక్టరూ!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/06/24)
-
జీతం డబ్బులడిగిన కుమారుడు.. తుపాకీతో కాల్చి చంపిన తండ్రి
-
టీ20 ప్రపంచకప్.. బంగ్లాతో వార్మప్ మ్యాచ్లో టీమ్ఇండియా ఘన విజయం
-
సిద్ధార్థ్- అదితిల క్యూట్ పిక్స్.. రెబా మోనికా బీచ్ స్టిల్
-
బెంగాల్లో భాజపాదే పైచేయి.. ఒడిశాలో నవీన్కు షాక్..!