అవును.. అక్కడ గాలి, నీరు కలుషితమే...
పరవాడ సింహాద్రి థర్మల్ విద్యుత్తు కేంద్రం పరిసర ప్రాంతాల్లో గాలి, నీరు కొంతమేర కలుషితమైనట్లు ఎట్టకేలకు కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) తేల్చింది.
ఎన్జీటీ ఆదేశాలతో ఎన్టీపీసీ పరిసరాల్లో పీసీబీ తనిఖీలు
కాలుష్య నిర్ధారణ కావడంతో థర్మల్ విద్యుత్తు కేంద్రానికి నోటీసులు
ఈనాడు డిజిటల్, అనకాపల్లి
ఎన్టీపీసీ పరిసరాల్లో ఇలా నిత్యం పొగ కనిపిస్తూనే ఉంటుంది
పరవాడ సింహాద్రి థర్మల్ విద్యుత్తు కేంద్రం పరిసర ప్రాంతాల్లో గాలి, నీరు కొంతమేర కలుషితమైనట్లు ఎట్టకేలకు కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) తేల్చింది. జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాల మేరకు ఇటీవల ఎన్టీపీసీ పరిసరాల్లో పీసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
గాలి, నీటి నమూనాలను సేకరించి పరీక్షించగా కొన్ని అంశాల్లో పరిమితికి మించి కాలుష్యం ఉన్నట్లు గుర్తించింది. ఈ మేరకు కాలుష్య నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోనున్నారో వారం రోజుల్లో తెలియజేయాలంటూ ఎన్టీపీసీ సింహాద్రి యూనిట్కు నోటీసులు జారీచేసింది. దీంతో ఇన్నాళ్లు ఎన్టీపీసీ కాలుష్యంపై స్థానికులు చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరినట్లయింది.
విశాఖ శివారు.. అనకాపల్లి జిల్లా పరిధిలోని ఈ థర్మల్ విద్యుత్తు కేంద్రం కాలుష్యం కారణంగా సమీప గ్రామాల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఏళ్ల తరబడి స్థానికులు ఆందోళనలు చేస్తున్నారు. ముఖ్యంగా ఎన్టీపీసీ నుంచి వెలువడే బూడిదతో పక్కనే ఉన్న పిట్టవానిపాలెం వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
* మొదట్లో 600 ఎకరాల్లో యాష్ పాండ్ (బూడిద కొలను) నిర్వహించగా తర్వాత కాలంలో వెయ్యి ఎకరాలకు పైగా విస్తరించడంతో దుమ్ము, ధూళీ అంతా ఇళ్లలోకి నేరుగా చొరబడి కిడ్నీ, గుండె జబ్బులకు గురవుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
* పిట్టవానిపాలేనికి చెందిన బట్టు సతీష్రెడ్డి అనే వ్యక్తి 2021లో ఎన్జీటీలో ఎన్టీపీసీ కాలుష్యంపై కేసు వేశారు. అతని ఫిర్యాదు స్వీకరించిన ఎన్జీటీ తీవ్రంగానే స్పందించింది. కలెక్టర్ సంబంధిత అధికారులను తీసుకుని వెళ్లి స్వయంగా పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. వారిచ్చిన నివేదికను పరిశీలించిన హరిత ట్రైబ్యునల్ 2022 డిసెంబర్ 19న మరోసారి తనిఖీలు నిర్వహించాలని కాలుష్య నియంత్రణ మండలికి సూచింది.
* తాజా ఆదేశాలతో తనిఖీలు చేపట్టగా కాలుష్య నియంత్రణ పాటించడంలో పలు నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు గుర్తించి నివేదికను జిల్లా అధికారుల నుంచి ఎన్జీటీ వరకు అందజేశారు.
కాలుష్య నమోదు ఇలా..
* ఎన్టీపీసీ ఆవరణంతో పాటు బొగ్గు మండించే బాయిలర్లు, బావులు, బూడిద నిల్వచేసే ప్రాంతం, ఫిర్యాదుదారుని ఇంటి సమీపంలో నమూనాలు సేకరించారు. యూనిట్- 4 వద్ద ఉద్గారాలను కొలిచినప్పుడు క్యూబిక్ మీటర్కు 50 మిల్లీ గ్రాములు నమోదవ్వాలి.. కానీ, 68.3గా నమోదైంది. అలాగే నైట్రోజన్ ఆక్సైడ్లు 450 ఎంజీ నమోదు కావాలి కానీ 494.6గా నమోదైంది.
* నాలుగు బావుల వద్ద నీటి నమూనాలు పరిశీలించారు. వాటిలో అన్నీ నిర్దేశిత ప్రమాణాల మేరకు ఉన్నాయి. ఒక్క టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ (టీడీఎస్) లీటర్ 500 మిల్లీ గ్రాముల వరకు అనుమతిస్తారు.. 2000 మి.గ్రా ఉన్నా ఫర్వాలేదు. కానీ ఈ నాలుగు బావుల్లోను 5,884 నుంచి 34,280 మి.గ్రా టీడీఎస్ నమోదవ్వడం విశేషం.
* ఎన్టీపీసీ పరిపాలనా భవనం వద్ద గాలిలో పీఎం10 (ధూళి రేణువులు) క్యూబిక్ మీటర్కు 176 మైక్రో గ్రాములుగా నమోదైంది. అక్కడ 100 మైక్రోగ్రాముల కంటే ఎక్కువ నమోదు కాకూడదు. పీఎం2.5 ధూళి రేణువులు కూడా నిర్దేశిత ప్రమాణం కంటే ఎక్కువగానే నమోదయ్యాయి. గాలి స్వచ్ఛతలో తేడాలు గుర్తించారు.
* ఫిర్యాదుదారుని ఇంటి సమీపంలోనూ పీఎం10 ధూళి కణాలు పరిమితికి మించి నమోదయ్యాయి.
నాడు అలా.. నేడు ఇలా..
విధ్యుత్తు కేంద్రం బూడిదతో ప్రభావితమైన పిట్టవానిపాలెం గ్రామం
కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఇదివరకు ఓసారి ఎన్టీపీసీ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చేసి గాలి నాణ్యత అంతా బాగానే ఉందని నివేదిక ఇచ్చారు. దీపావళి కారణంగా నగరమంతా పొగ వ్యాపించడంతో అక్కడ కూడా అదే తీరున గాలి నాణ్యత లోపం కనిపించింది తప్పితే పెద్దగా తేడా లేదని పేర్కొంది. అయితే ఈ నివేదికను ఎన్జీటీ తిరస్కరించి దీపావళి సమయంలో తనిఖీలు ఎందుకు నిర్వహించారు.. సాధారణ రోజుల్లో పరిశీలించి మరలా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. దీంతో ఈ ఏడాది జనవరి 25 నుంచి 27, 29 తేదీల్లోని ఎన్టీపీసీ పరిసరాల్లో నమూనాలను సేకరించి విశ్లేషించారు. గాలి, నీటి నాణ్యతలో నిర్దేశిత ప్రమాణాలకు మించి కొన్ని అంశాల్లో ఎక్కువ ఉన్నట్లు తేలడంతో ఎన్టీపీసీకి నోటీసులు జారీచేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆటగాళ్లకు మోసగాడు
[ 11-05-2024]
వైకాపా పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన రంగాల్లో క్రీడారంగం ఒకటి. ఐదేళ్లలో క్రీడాభివృద్ధికి రూపాయి ఖర్చు పెట్టలేదు. క్రీడా పరికరాలు సమకూర్చలేదు. మైదానాలు బాగు చేయలేదు. -
వినిపించలేదా.. జగన్ అన్నదాతల ఆత్మఘోష?
[ 11-05-2024]
ప్రస్తుతం ఆయా బాధిత కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నాయి. ఇలాంటివారిని రైతు స్వరాజ్య వేదిక గుర్తించి జీవనోపాధికి ఉన్నంతలో సాయం చేసినా జగన్ సర్కారుకు మాత్రం పరిహారం ఇవ్వడానికి చేతులు రాలేదు. -
పోలింగ్ ముగిసే వరకు అప్రమత్తత: చంద్రబాబు
[ 11-05-2024]
పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ఏమైనా ఇబ్బందులుంటే తన దృష్టికి తేవాలని తెదేపా అధినేత చంద్రబాబు కూటమి అభ్యర్థులు, పార్టీ నేతలకు సూచించారు. -
వైకాపా అరాచక పాలనపై జనం తిరుగుబాటు
[ 11-05-2024]
రాష్ట్రంలో వైకాపా అరాచక పాలనను ప్రజలకు వివరించడంతో వారిలో తిరుగుబాటు మొదలైందని రంపచోడవరం అసెంబ్లీ తెదేపా అభ్యర్థి మిరియాల శిరీషాదేవి పేర్కొన్నారు. -
కూటమితోనే గిరిజనుల అభ్యున్నతి
[ 11-05-2024]
ఎన్డీఏ గెలుపుతోనే గిరిజనుల అభ్యున్నతి సాధ్యమవుతుందని పాడేరు నియోజకవర్గ అభ్యర్థి గిడ్డి ఈశ్వరి పేర్కొన్నారు. శుక్రవారం పాడేరు పట్టణంలో మూడు పార్టీల నాయకులతో కలిసి భారీ ర్యాలీ చేశారు. -
ఈదురుగాలుల బీభత్సం
[ 11-05-2024]
మన్యంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం ఈదురుగాలులతో భారీవర్షం కురిసింది. పెదబయలు మండలంలోని గ్రామాల్లో భారీ వాన పడింది. -
జలాశయాన్ని కప్పేస్తున్నారు..
[ 11-05-2024]
వందల ఎకరాలకు సాగునీరందించే జలాశయాన్ని కొందరు అక్రమార్కులు తమ స్వార్థానికి ఇష్టారాజ్యంగా పూడ్చేస్తున్నారు. ఇదంతా నిరాటంకంగా సాగుతున్నా అధికారులు మాత్రం చూసీచూడనట్లు వదిలేశారు. -
అయిదేళ్ల నరకానికి రెండు రోజుల్లో మోక్షం
[ 11-05-2024]
వైకాపా అయిదేళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలు అనుభవించిన నరకానికి రెండు రోజుల్లో మోక్షం కలగనుందని కూటమి ‘పేట’ అభ్యర్థి వంగలపూడి అనిత అన్నారు. -
యువకులపై యమపాశం
[ 11-05-2024]
జిల్లాలో శుక్రవారం జరిగిన రెండు ప్రమాదాల్లో నలుగురు యువకుల దుర్మరణం పాలై ఆయా కుటుంబాల్లో తీరని విషాదం నింపారు. అందరితో కలివిడిగా ఉండే వారు అనుకోని ప్రమాదంలో మరణించడంతో కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు బోరున విలపించారు. -
మత్తులో ముంచొద్దు.. మీకో దండం
[ 11-05-2024]
రోజంగా చెమటోచ్చి సంపాదించిన మొత్తం ‘జె’ బ్రాండ్ మద్యానికే ధారపోస్తున్నారు. మందుకు బానిసలై ఆరోగ్యాన్ని గుల్ల చేసుకుంటున్నారు. -
ఎన్నికల నిబంధనలకు వైకాపా తూట్లు
[ 11-05-2024]
వైకాపా బరితెగిస్తోంది. ఎన్నికల నిబంధనలకు తూట్లు పొడుస్తున్న వైకాపా నేతలపై చర్యలు తీసుకోవడంలో ఎన్నికల అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. -
బస్సులు రావు.. బాధలు తీరవు!
[ 11-05-2024]
చింతపల్లి, గూడెంకొత్తవీధి మండలాల్లో చాలా గ్రామాలకు గతంలో ఆర్టీసీ బస్సులు నడిపేది. కాలక్రమంలో రహదారులు బాగోలేవంటూ కొన్ని, రాబడి రావడం లేదంటూ మరికొన్ని రద్దు చేయడంతో గిరిజనులకు రవాణా కష్టాలు వీడటం లేదు.
తాజా వార్తలు (Latest News)
-
డెంగీ రాకను చెప్పే హిందూ మహాసముద్రం
-
రూ.10 లక్షలిస్తే నేనే రాసిపెడతా.. ‘నీట్’లో ఓ టీచర్ నిర్వాకం
-
రామ్తో నెట్ఫ్లిక్స్ వెబ్సిరీస్?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం