logo

నామపత్రాలను ఉపసంహరించుకొనే వారెందరు?

జిల్లాలో లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు నామపత్రాలు దాఖలు చేసిన వారిలో తొలిరోజు శనివారం ఎవరూ ఉపసంహరించుకోలేదు.

Published : 28 Apr 2024 03:46 IST

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: జిల్లాలో లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు నామపత్రాలు దాఖలు చేసిన వారిలో తొలిరోజు శనివారం ఎవరూ ఉపసంహరించుకోలేదు. ఈనెల 29వ తేదీ మధ్యాహ్నం 3గంటల వరకు గడువు ఉంది. 28వ తేదీ ఆదివారం సెలవు దినం కావడంతో సోమవారం పలువురు తమ నామపత్రాలను ఉపసంహరించుకొనే అవకాశం ఉంది. విశాఖ లోక్‌సభ స్థానానికి 33 మంది, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు 119 మంది అభ్యర్థుల నామపత్రాలు ఆమోదం పొందాయి. వీరిలో ఎంత మంది ఉపసంహరించుకుంటారో సోమవారం తేలనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని