ధర పెరిగింది.. వినోదం తగ్గింది
గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సైతం అంతర్జాలం, వినోదాన్ని చేరువ చేయాలన్న లక్ష్యంతో తెదేపా ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన ఏపీ ఫైబర్ నెట్ పథకం వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్లక్ష్యానికి గురైంది.
ఏపీ ఫైబర్ నెట్ను పేదలకు అందని ద్రాక్షలా చేసిన జగన్
ఆదాయార్జనే లక్ష్యంగా వైకాపా ప్రభుత్వ పనితీరు
పెందుర్తి, వేపగుంట, పరవాడ, సబ్బవరం, న్యూస్టుడే: గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సైతం అంతర్జాలం, వినోదాన్ని చేరువ చేయాలన్న లక్ష్యంతో తెదేపా ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన ఏపీ ఫైబర్ నెట్ పథకం వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్లక్ష్యానికి గురైంది. పల్లె ప్రజలకు ఫైబర్ నెట్ అందని ద్రాక్షలా మారింది. పెందుర్తి మండలం రాంపురం గ్రామంలో ఫైబర్ నెట్ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు 2018లో ప్రతిపాదించారు. అనంతరం ప్రభుత్వం మారడంతో మూలకు చేరింది. ప్రస్తుతం పెందుర్తి రెవెన్యూ మండలం పరిధిలోని ఒక్క పెందుర్తిలో మాత్రమే ఏపీ ఫైబర్ నెట్ అందుబాటులో ఉంది. అదికూడా అరకొరే. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత డేటా సరఫరాను పరిమితం చేశారు. తెలుగు ఛానెళ్లలో కోత విధించారు. రెండు, మూడు రకాల ప్యాకేజీలను ప్రవేశపెట్టి ఆదాయార్జనే లక్ష్యంగా పని చేస్తోంది. తెదేపా హయాంలో రూ.250 ఛార్జీగా వసూలు చేయగా ప్రస్తుతం ప్రాథమిక ప్యాకేజీకి రూ.350 వసూలు చేస్తున్నారు. అప్పట్లో డేటా వినియోగం 15ఎంబీ వేగంతో అపరిమితంగా ఉండేది. ప్రస్తుతం 20ఎంబీ వేగంతో 200జీబీ డేటా మాత్రమే సరఫరా చేస్తున్నారు.
ఛానెళ్లలో కోత..
గతంలో ఏపీ ఫైబర్ నెట్ ద్వారా తక్కువ ఖర్చుతో అధిక ఛానళ్లు, ఎక్కువ డేటా వచ్చేది. ప్రస్తుతం ధర పెరగడంతో పాటు ఛానెళ్లలో కోత విధించారు. వివిధ రకాల ప్యాకేజీల కారణంగా వినియోగదారులపై భారం పెరిగింది. డేటా పరిమితం చేయడంతో అంతర్జాలం వినియోగం కూడా తగ్గింది. దీంతో ప్రయివేటు ఆపరేటర్లపై ఆధారపడాల్సిన పరిస్థితి.
కిల్లి రమేశ్, పెందుర్తి
సక్రమంగా వచ్చిన రోజు లేదు
ఏపీ ఫైబర్ నెట్ తెదేపా ప్రారంభించిన తొలినాళ్లలో చక్కగా వచ్చేది. టీవీ, అంతర్జాలం, ఫోన్కు అనుసంధానం చేసినా బాగా పని చేసేవి. గతంలో ఈ మూడింటికి చాలా తక్కువ రుసుం వసూలు చేసేవాళ్లు. దీంతో ప్రతీఒక్కరూ ముందుకొచ్చేవారు. వైకాపా ప్రభుత్వం వచ్చిన తరువాత నెలవారీ రుసుమును పెంచేశారు. సిగ్నల్స్ సక్రమంగా పనిచేసిన రోజు ఒకటీ లేదు.
జీ.ఎస్.రెడ్డి, నరవ
సెటప్ బాక్సులు లేకపోవడం విడ్డూరం
ఏపీలో అద్భుతంగా పనిచేసే ఫైబర్ నెట్ పథకాన్ని జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నీరుగార్చి నిర్వీర్యం చేసింది. చంద్రబాబు హయాంలో 100 ఎంబీపీఎస్ వేగంతో చాలా చక్కగా ఇంటర్నెట్ వచ్చేది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది కనెక్షన్లు తీసుకున్నారు. అలాంటి ఏపీ ఫైబర్ నెట్ను సెటప్ బాక్సులు లేవని చెప్పడం విడ్డూరంగా ఉంది.
కె.రామకృష్ణ రాజు నల్లరేగులపాలెం
సకాలంలో కనెక్షన్లు ఇవ్వలేకపోతున్నారు..
ఎంతో ప్రయోజనకరంగా ఉండే ఫైబర్ నెట్కు ప్రజల నుంచి డిమాండ్ ఉన్నప్పటికీ వైకాపా ప్రభుత్వం సకాలంలో కనెక్షన్లు ఇవ్వలేకపోతోంది. వాస్తవానికి ఫైబర్ నెట్ అద్దె కేవలం రూ. 150 మాత్రమే ఉండేది. దీంట్లో కేవలం ఛానెళ్ల కోసం రూ.100 చెల్లించగా మిగిలిన రూ.50 సెటప్ బాక్సు కోసం చెల్లించాల్సి ఉంటుంది. సెటప్ బాక్సు విలువ రూ.4 వేలు తీర్మానం అయ్యేదాక వసూలు చేసేవాళ్లు.
రొంగలి దేముడు, రావులమ్మపాలెం
అధ్వానంగా ఇంటర్నెట్
గతంలో అన్ని రకాల ఛానెల్స్ వచ్చేవి. నెలకు రూ.150 నుంచి రూ.200 మధ్య చెల్లించేవాళ్లం. వైకాపా వచ్చిన తర్వాత చాలా ఛానెల్స్ను ఆపేశారు. అయినా నెలకు రూ.350కి పెంచేశారు. ఇంటర్నెట్ అధ్వానంగా వస్తోంది. ప్రైవేట్ నెట్వర్కులు ఇంతకంటే తక్కువగా ఇస్తున్నాయి. తరచూ సేవలు మొరాయిస్తున్నాయి.
గండి మహేశ్, పరవాడ
విద్యార్థులకు ఎంతగానో ఉపకరించేది
చంద్రబాబు ముందుచూపుతో యువత, విద్యార్థులకు సైతం ఉపయోగపడేలా ఫైబర్ నెట్ను తీసుకొచ్చారు. కొవిడ్ సమయంలో ఆన్లైన్లో పాఠాలు వినేందుకు విద్యార్థుల ఎంతగానో ఉపయోగించుకున్నారు. వైకాపా ప్రభుత్వం దీని నిర్వహణ గాలికొదిలేసింది. దీంతో విద్యార్థులు మళ్లీ ఇబ్బందులకు గురవుతున్నారు.
మౌళి, జెర్రిపోతులపాలెం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విశాఖలో నోట్ల కట్టల కలకలం.. కారులో రూ.కోటిన్నర వదిలేసి పరార్..
[ 12-05-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో విశాఖ నగరంలో భారీగా నగదు పట్టుబడింది. -
అయిదేళ్ల పాలన.. అంతులేని వేదన.. తలరాతలు మార్చుకునే తరుణమిదే
[ 12-05-2024]
జిల్లాలో వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబాలే ఎక్కువ. సుమారు 2 లక్షల ఎకరాల్లో పంటలు సాగుచేస్తున్నా వారి బతుకులు బాగుపడడం లేదు. విత్తు నుంచి ఎరువుల వరకు ధరలు పెంచేశారు. అయిదేళ్లలో వ్యక్తిగతంగా ఒక్క రాయితీ యంత్రమూ ఇవ్వలేదు. -
అవంతిపై ‘ట్రోల్స్’కు అవధుల్లేవ్!
[ 12-05-2024]
భీమిలి వైకాపా అభ్యర్థి అవంతి శ్రీనివాస్ (ముత్తంశెట్టి)పై సామాజిక మాధ్యమాల్లో ట్రోల్స్ హల్చల్ చేస్తున్నాయి. ఊసరవెల్లి రంగులు మార్చినంత తేలికగా పార్టీ మార్చారంటూ పోస్టులు పెడుతున్నారు. -
ఐదేళ్ల నరకం వే(ఓ)టేస్తేనే.. నవశకం!!
[ 12-05-2024]
వైకాపా అయిదేళ్ల పాలనలో అన్ని రంగాలను నిర్వీర్యం చేశారు. ‘మూడు విధ్వంసాలు.. ఆరు ఆక్రమణలు’ అన్నట్లుగా కొందరు నాయకులు వీరంగం సృష్టించారు. -
ఆస్తి మాది.. హక్కులు సమాధి..!!
[ 12-05-2024]
ముఖ్యమంత్రి నుంచి... మంత్రుల వరకు అందరూ ల్యాండ్ టైటిలింగ్ చట్టం వల్ల ప్రమాదం ఏమీ లేదు అని చల్లగా చెబుతున్నారు!! కానీ... ప్రమాదకరమైన చట్టం తెచ్చి ప్రజల జీవితాలతో ఆడుకుంటారా అని మరో వైపు జనం మండిపడుతున్నారు!! -
పాలన దగా.. బడుగుజీవి భగభగ!
[ 12-05-2024]
ఆదాయం గుప్పెడంత పెరుగుతుంటే ఖర్చులు కొండలా పెరుగుతున్నాయి. తప్పనిసరి అవసరాలకు, తప్పించుకోలేని ఖర్చులకు మధ్య జనం కిందమీదా పడుతున్నారు. అన్నింటికీ బటన్ నొక్కుతున్నామని చెబుతున్న జగన్ పాలనలో ధరల తగ్గింపు బడ్జెట్ బటన్ నొక్కడం మరిచిపోయాడని బడుగుజీవి ఆగ్రహంతో ఉన్నాడు. -
‘దక్షిణం’లో కూటమి భారీ ర్యాలీ
[ 12-05-2024]
దక్షిణ నియోజకవర్గ కూటమి(జనసేన) అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ శనివారం నియోజకవర్గ పరిధిలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల ప్రచారానికి ఘనంగా ముగింపు ఇస్తూ మూడు పార్టీల శ్రేణులు భారీగా తరలివచ్చాయి. -
పోలింగ్కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
[ 12-05-2024]
విశాఖ జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి కావచ్చాయని, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ ఈనెల 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ మల్లికార్జున వెల్లడించారు. -
ఓటు నీ ఆయుధం.. మరువకు ఏ క్షణం..!
[ 12-05-2024]
అర్హులైన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని క్రెడాయ్ ప్రతినిధులు కోరారు. ఈమేరకు శనివారం సూర్యబాగ్ ప్రాంతంలో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశారు. -
మత్స్యకారుల సంక్షేమానికి ప్రాధాన్యం: శ్రీభరత్
[ 12-05-2024]
సముద్రాన్ని నమ్ముకున్న మత్స్యకారుల సంక్షేమానికి తెదేపా కూటమి ప్రభుత్వంలో తగిన ప్రాధాన్యం కల్పిస్తామని విశాఖ కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ అన్నారు. -
కూటమి అభ్యర్థులకు బీసీ సంఘం మద్దతు
[ 12-05-2024]
రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాల్లో తెదేపా కూటమి అభ్యర్థులకు బీసీ సంక్షేమ సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశాన శంకరరావు వెల్లడించారు. -
యువతా.. తొలిసారి ఓటేస్తున్నారా..!
[ 12-05-2024]
కొత్తగా ఓటు నమోదు చేసుకున్న 18-19ఏళ్ల యువత ఈ ఎన్నికల్లో తొలిసారి ఆ అమూల్యమైన హక్కును వినియోగించుకోవడానికి ఉవ్విళ్లూరుతున్నారు. అయితే తొలిసారి కావడంతో ఓటు ఎలా వేయాలో తెలియక కొందరిలో ఆందోళన ఉంటుంది. -
‘తెదేపా కూటమితో... ప్రగతి, ప్రజా సంక్షేమం’
[ 12-05-2024]
తెదేపా కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో రాష్ట్ర ప్రగతి, ప్రజా సంక్షేమం సాధ్యమవుతాయని విశాఖ పశ్చిమం తెదేపా అభ్యర్థి పి.గణబాబు అన్నారు. -
ప్రచారం పరిసమాప్తం.. కూటమిదే పైచేయి..!
[ 12-05-2024]
జిల్లాలో హోరాహోరీగా సాగిన ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల షెడ్యూలు విడుదలైన మార్చి 16 నుంచే అభ్యర్థులు ప్రచారానికి శ్రీకారం చుట్టారు. జిల్లాలో ఏడు అసెంబ్లీ, ఒక లోక్సభ స్థానానికి గత నెల 18న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది.
తాజా వార్తలు (Latest News)
-
29వసారి ఎవరెస్టు అధిరోహణ.. చరిత్ర సృష్టించిన నేపాల్ షెర్పా
-
విధుల్లో చేరిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్ సిబ్బంది.. 2 రోజుల్లో పూర్తిస్థాయి సర్వీసులు
-
ఒక్క ఓటేనన్న ఉదాసీనత వద్దు.. మీ ఓటే చరిత్రను మార్చేయొచ్చు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
అభిమానులారా.. మ్యాచ్ ముగిశాక వెళ్లొద్దు.. మీకో స్పెషల్ ఉంది: వైరల్గా చెన్నై పోస్టు
-
హైదరాబాద్కు భారీ వర్ష సూచన.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: జీహెచ్ఎంసీ