డబ్బన్నావ్.. డబ్బాకొట్టుకున్నావ్!!
‘మా పాలనలో అక్కచెల్లెమ్మల ఆర్థిక సాధికారతే లక్ష్యంగా ముందడుగు వేశాం. 14 రోజుల పాటు పండగ వాతావరణంలో చేయూత పంపిణీ జరుగుతుంది. ప్రతి ఇంట్లో మహిళలను లక్షాధికారులుగా మార్చాం.’
‘చేయూత’ నాలుగో విడత నిధులేవి జగన్!!
ఇలాగేనా అక్కచెల్లెమ్మలను లక్షాధికారులనుచేసేది
ఉత్తుత్తి బటన్ నొక్కి ఆర్భాటం
జగన్ మాట
‘మా పాలనలో అక్కచెల్లెమ్మల ఆర్థిక సాధికారతే లక్ష్యంగా ముందడుగు వేశాం. 14 రోజుల పాటు పండగ వాతావరణంలో చేయూత పంపిణీ జరుగుతుంది. ప్రతి ఇంట్లో మహిళలను లక్షాధికారులుగా మార్చాం.’
నాలుగో విడత చేయూత పంపిణీ సందర్భంగా సీఎం జగన్
వాస్తవం
‘చేయూత’ నిధుల విడుదలకు బటన్ నొక్కి రెండు నెలలు గడుస్తున్నా నేటికీ మహిళల ఖాతాల్లోకి డబ్బులు రాలేదు. వారంతా డబ్బుల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. తరచూ బ్యాంకులకు వెళ్లి ఎంతో ఆశగా డబ్బులు పడ్డాయేమోనని తనిఖీ చేసుకుంటున్నారు. ఏమీ రాలేదని బ్యాంకు సిబ్బంది చెబుతుండటంతో ఉసూరుమంటూ ఇంటి దారి పడుతున్నారు.
ఈనాడు డిజిటల్, విశాఖపట్నం
నా అక్కచెల్లెమ్మలంటూ ఊదరగొట్టిన జగన్ వారికి కుచ్చుటోపీ పెట్టారు. చేయూత పథకం కింద ఇచ్చే చివరి విడత ఆర్థిక సాయాన్ని ఎగ్గొట్టే ఎత్తుగడ వేశారు. జిల్లాలో చివరి విడత కింద ఒక్కొక్కరికి రూ.18,750 చొప్పున 84,678 మందికి రూ.158.77 కోట్లు చెల్లించాలి. మార్చి 7న అనకాపల్లి జిల్లాలో చేయూత నిధుల విడుదలకంటూ బహిరంగ సభ ఏర్పాటుచేశారు. నాడు బటన్ నొక్కినా నేటికీ ఒక్క రూపాయి కూడా జమ చేయలేదు. ఈ పథకం కింద లబ్ధి పొందుతున్న మహిళలందరూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే. నాలుగు విడతల నిధులు విడుదల చేసినట్లు తాజాగా జగన్ విడుదల చేసిన మ్యానిఫెస్టోలో పేర్కొన్నారు. అయితే నాడు బటన్ నొక్కినా...ఇంకా తమ ఖాతాలకు ఒక్క రూపాయి కూడా రాలేదని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.
లబ్ధిదారుల సంఖ్యలో సగానికి పైగా కోత.. : చేయూత పథకం కింద 45-60 ఏళ్ల మధ్య ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఏడాదికి రూ.18,750 చొప్పున నాలుగేళ్లకు రూ.75 వేలు అందిస్తామని వైకాపా ప్రభుత్వం గొప్పలు చెప్పింది. మూడో విడత సాయం అందించేందుకు 2022లో రాష్ట్రస్థాయిలో 10 దశల తనిఖీ ప్రక్రియ చేపట్టారు. లబ్ధిదారుల సంఖ్యను తగ్గించేందుకు కుట్ర పన్నారు. 300 యూనిట్ల విద్యుత్తు వినియోగం, కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి, ఆదాయపన్ను చెల్లింపుదారుడు, వ్యవసాయ భూమి, నాలుగు చక్రాల వాహనం, పట్టణాల్లో 1000 చ.అడుగుల విస్తీర్ణం కంటే పెద్ద ఇల్లు ఉండటం తదితర కారణాలతో చాలా మందిని అనర్హులుగా మార్చారు. తాము అర్హులమని నిరూపించుకోవడానికి లబ్ధిదారులు సరైన ధ్రువపత్రాలు సమర్పించేందుకు నానా తంటాలు పడ్డారు. ఆ సమయంలో జిల్లాలోని లబ్ధిదారుల సంఖ్యలో సగానికి పైగా తగ్గించారు.
ఉత్తుత్తి బటన్: గతేడాది సెప్టెంబరులోనే నాలుగో విడత నిధులు విడుదల చేయనున్నట్లు తొలుత 2023-24 సంక్షేమ క్యాలెండర్లో ప్రకటించారు. తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇస్తామని క్షేత్రస్థాయికి సమాచారం పంపారు. దీన్ని ఎన్నికల ప్రచారానికి వినియోగించుకునే కుట్రలో భాగంగానే విడుదల సమయం మార్చారు. తొలుత ఫిబ్రవరి 5న విడుదల చేస్తామని.. ఆ తర్వాత 16కు, 21కి, 26కి ఇలా వాయిదాల మీద వాయిదాలు వేశారు. చివరికి మార్చి 7న జరిగిన బహిరంగ సభలో ఉత్తుత్తి బటన్ నొక్కారు.
నిబంధనల కొర్రీలతో ఎగనామం: పేదల సంక్షేమానికి కృషి చేస్తున్నానని చెప్పే జగన్ తెరవెనుక నిబంధనల గిరి గీసి కోతలు పెడుతున్నారు. చేయూత లబ్ధిదారులకు ఏటికేడు ఇలాగే గండి కొడుతున్నారు. సామాజిక పింఛన్, విద్యుత్తు వాడకం వంటి కొర్రీలు వేశారు. తొలి రెండు విడతల్లో లబ్ధి పొందినవారికీ మూడు, నాలుగు విడతల్లో అనర్హుల ముద్ర వేసి ఎగనామం పెట్టారు. జిల్లావ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించి నమూనా చెక్కులు పంపిణీ చేశారు. ఆయా సభలకు రాకుంటే నిధులు రావని బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో ఎండను సైతం లెక్కచేయకుండా పలువురు ఆయా కార్యక్రమాలకు హాజరైనా ప్రయోజనం లేకపోయింది.
జీవీఎంసీ పరిధిలో లబ్ధిదారులు ఇలా..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కీలకం.. మహిళా ఓటర్ల తీర్పు
[ 15-05-2024]
విశాఖ లోక్సభ స్థానానికి 33 మంది, అసెంబ్లీ స్థానాలకు 101 మంది పోటీ చేశారు.పెద్ద సంఖ్యలో అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచినా పోటీ మాత్రం తెదేపా కూటమి, వైకాపా మధ్యే కేంద్రీకృతం అయింది. -
ఈవీఎంలలో అభ్యర్థుల భవిత
[ 15-05-2024]
లోక్సభ, అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసిన అభ్యర్థుల భవిత ఈవీఎంలలో నిక్షిప్తమైంది. పోలింగ్ ముగిసిన అనంతరం ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాలు, కంట్రోలు యూనిట్లను ఏయూ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లలో భద్రపర్చారు. -
సహనానికి పరీక్ష
[ 15-05-2024]
పోలింగ్ రోజున నగరంలోని ఏ కేంద్రం వద్ద చూసినా బారులు తీరిన ఓటర్లు కనిపించారు. గంటల పాటు వరుసల్లో పడిగాపులు కాశారు. తీవ్ర ఉక్కపోతనూ భరించారు. వర్షానికీ వెనుదిరగలేదు. -
ఎన్నికల ఫలితాలపై పందేలు
[ 15-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఘట్టం ముగిసింది. ఫలితాలకు జూన్ 4వ తేదీ వరకు వేచి ఉండాలి. పోలింగ్కు, ఫలితాలకు మధ్య మూడు వారాల వ్యవధి ఉండటంతో అటు అభ్యర్థులు, -
భీమిలిలో రికార్డు విజయం సాధిస్తాం: గంటా
[ 15-05-2024]
భీమిలి నుంచి రికార్డు స్థాయిలో భారీ మెజారిటీతో విజయం సాధిస్తామని తెదేపా ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు. -
యువత ఆధ్యాత్మిక భావం అలవర్చుకోవాలి
[ 15-05-2024]
సమాజంలో ప్రతి ఒక్కరూ ముఖ్యంగా యువత ఆధ్యాత్మిక భావం అలవర్చుకోవాలని కాంక్షిస్తూ ఇస్కాన్ మందిరం (సాగర్నగర్) ఆధ్వర్యంలో నగరంలోని ఆర్కేబీచ్, రుషికొండ తదితర ప్రాంతాల్లో మంగళవారం పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టారు. -
22న సింహగిరిపై వైభవంగా నృసింహ జయంతి
[ 15-05-2024]
వైశాఖ శుద్ధ చతుర్దశిని పురస్కరించుకుని ఈ నెల 22వ తేదీన అప్పన్న ఆలయంలో నృసింహ జయంతి ఉత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహించనున్నట్లు ఈవో సింగల శ్రీనివాసమూర్తి తెలిపారు. -
అంధకారం.. అవాంతరాలను అధిగమించారిలా..
[ 15-05-2024]
ఈదురుగాలులతో కురిసిన వర్షం.. విద్యుత్తు సరఫరా నిలిచి పోలింగ్కు అంతరాయాలు ఓటర్ల చైతన్యం ముందు తలవంచాయి. రోలుగుంట మండలంలోని పలు పోలింగు కేంద్రాల్లో సోమవారం రాత్రి అంధకారం అలుముకుంది. -
సైకోతో ప్రజలే యుద్ధం చేశారు
[ 15-05-2024]
ఐదేళ్లు నరకం చూపించిన సైకో సీఎం జగన్తో ప్రజలే యుద్ధం చేశారని ఎలమంచిలి కూటమి అభ్యర్థి సుందరపు విజయ్కుమార్ తెలిపారు. -
ఆధిక్యంపైనే పేట నేతల లెక్కలు
[ 15-05-2024]
పాయకరావుపేట కూటమి అభ్యర్థి వంగలపూడి అనితతో నాలుగు మండలాలకు చెందిన తెదేపా నాయకులు మంగళవారం నక్కపల్లిలోని ఆమె నివాసంలో భేటీ అయ్యారు. -
ప్రభుత్వంపై అన్ని వర్గాల్లో వ్యతిరేకత
[ 15-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కోరుకున్నారని అనకాపల్లి ఎంపీ భాజపా అభ్యర్థి సీఎం రమేశ్ అన్నారు. -
నర్సీపట్నం చరిత్రలో రికార్డు స్థాయిలో..
[ 15-05-2024]
ప్రజల్లో ఓటు చైతన్యం వెల్లివిరిసింది. రికార్డు స్థాయిలో ఓటింగ్లో పాల్గొని ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటారు. నర్సీపట్నంలో తొలుత పోలింగ్ మందకొడిగా ప్రారంభమైనా చివరిలో పుంజుకుంది. -
సర్కారును సాగనంపాలనే కసితో ఓటేశారు
[ 15-05-2024]
ప్రభుత్వాన్ని గద్దె దించాలనే కసితో ఓటు వేసిన ప్రజలకు అనకాపల్లి అసెంబ్లీ జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణ ధన్యవాదాలు తెలిపారు. -
క్షతగాత్రులకు కేజీహెచ్లో చికిత్స
[ 15-05-2024]
ఓటు వేసేందుకు వెళుతున్న గిరిజనుల వాహనం బోల్తా పడిన ఘటనలో గాయపడ్డ నలుగురు కేజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. -
కూటమిని ప్రజలు నమ్మలేదు: బొత్స
[ 15-05-2024]
కూటమి మాయమాటలు, ప్రలోభాలను ప్రజలు నమ్మలేదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. -
ఉద్యోగుల పేరిట కుటుంబ సభ్యులకు వేతనాలు
[ 15-05-2024]
యశోదా ఆసుపత్రి గ్రూపులో కీలక విభాగంలో పనిచేసిన ఉద్యోగి రూ. 3.26 కోట్ల మొత్తాన్ని పక్కదారి పట్టించాడు. ఉద్యోగులకు చెల్లించే వేతనాల జాబితాలో తన కుటుంబ సభ్యుల పేర్లు చేర్చి, 2021 మే నుంచి 2023 సెప్టెంబరు మధ్య ఈ మొత్తం స్వాహా చేశాడు. -
వేతనాలకు ఉక్కు ఉద్యోగుల ఎదురుచూపులు
[ 15-05-2024]
మే నెల 15వ తేదీ వచ్చినా... ఉక్కు ఉద్యోగులకు వేతనాలు అందకపోవడంతో తీవ్ర నిరాశ, నిస్పృహలో ఉన్నారు. ఇంటి అద్దెలు, నెల వారీ బ్యాంకుల చెల్లింపులు, ఇతర ఖర్చులకు డబ్బుల్లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
అతివలే ముందుండి నడిపారు!
[ 15-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు పోటెత్తారు. గత ఎన్నికలతో పోల్చితే అనకాపల్లి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ఓటింగ్ శాతం పెరిగింది. -
పెరిగిన ఓటింగ్.. కూటమిలో జోష్
[ 15-05-2024]
అభ్యర్థుల భవితవ్యం వెల్లడి కాదు. అయినా ఓటర్లు ఎటు మొగ్గారో అంచనా వేయడానికి పార్టీల నాయకులు, కార్యకర్తలు విశ్వప్రయత్నం చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
భోజనానికి ముందు టీ, కాఫీ తాగుతున్నారా.. బీ అలర్ట్!
-
మెడకు స్కార్ఫ్ చుట్టి.. అంగన్వాడీ టీచర్ హత్య
-
ముసుగు మనుషుల దాడి: డ్రగ్లార్డ్ ‘ది ఫ్లై’ని విడిపించుకొని పారిపోయిన గ్యాంగ్..!
-
పవర్ప్లేలో వికెట్లు కోల్పోవడం పెద్ద దెబ్బే: కేఎల్ రాహుల్
-
మాజీ మంత్రి అఖిలప్రియ బాడీగార్డ్పై హత్యాయత్నం
-
తెలంగాణలో రెండు వారాలు సినిమా ప్రదర్శనల నిలిపివేత!