జూనియర్ కళాశాల ఉత్తమ ప్రిన్సిపల్గా ప్రభాకర్
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ ప్రిన్సిపాళ్ల జాబితాలో మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం హరిపిరాలకు చెందిన రాపోలు ప్రభాకర్కు చోటు దక్కింది.
రాపోలు ప్రభాకర్
తొర్రూరు, న్యూస్టుడే: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ ప్రిన్సిపాళ్ల జాబితాలో మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం హరిపిరాలకు చెందిన రాపోలు ప్రభాకర్కు చోటు దక్కింది. ఈయన జనగామ జిల్లా దేవరుప్పులలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్గా పని చేస్తున్నారు. 1996లో తొర్రూరు మండలం చిట్యాలలోని ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా చేరారు. 2001లో జేఎల్గా పదోన్నతి పొంది ఏడేళ్ల పాటు నెక్కొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పని చేశారు. 2008 నుంచి 2012 వరకు తొర్రూరులో, 2012 నుంచి 2017 వరకు రంగశాయిపేటలో ఎకనామిక్స్ అధ్యాపకుడిగా పని చేసి 2018లో ప్రిన్సిపల్గా పదోన్నతి పొందారు. 2018 నుంచి దేవరుప్పుల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్గా పని చేస్తున్నారు. ఆయన కళాశాలలో చేరే నాటికి విద్యార్థుల సంఖ్య 150 ఉండగా 350కి పెరిగేలా కృషి చేశారు. గతంలో ఉత్తీర్ణత శాతం 50 ఉండగా ప్రస్తుతం 75 శాతానికి పెంచారు. దీంతో పాటు 5 ఎన్ఎస్ఎస్ శిబిరాలు నిర్వహించి గ్రామాల్లో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పద్మశాలి పేద విద్యార్థులకు దాతల సహకారంతో ఫీజులు చెల్లించడంలో కీలకపాత్ర పోషించారు. గతేడాది మరిపెడ మండలం నిదానపురం గ్రామానికి చెందిన బూర సృజనకు నీట్ కోచింగ్ నిమిత్తం దాతల సహకారంతో రూ.50 వేల నగదు అందజేశారు. చెర్లపాలెం గ్రామానికి చెందిన జంగిచర్ల అజయ్కు రూ.10 వేల సాయం అందించారు. తొర్రూరులో ఆచార్య కొండాలక్ష్మణ్ బాపూజీ విగ్రహం ఏర్పాటులో చురుగ్గా పని చేశాడు. ప్రభాకర్ను కళాశాల అధ్యాపకులు అభినందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజాస్వామ్య పండగకు ఇదే మా ఆహ్వానం
[ 13-05-2024]
ఈ రోజు కులమతాలకు అతీతంగా, దేశమంతా కలిపి జరిపే ఓ వేడుక జరుగుతోంది. అదేనండీ! ప్రజాస్వామ్య పండగ.. ఓటు పర్వదినం. ఈ వేడుకకు ఓటు హక్కు పొందిన వారంతా తరలిరావాలని సాదరంగా ఆహ్వానిస్తున్నా. -
అంతర్జాతీయ నర్సుల దినోత్సవం
[ 13-05-2024]
వరంగల్ మహాత్మా గాంధీ స్మారక(ఎంజీఎం) ఆసుపత్రిలో ఆదివారం ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతిని పురస్కరించుకొని ఎంజీఎం నర్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. -
భారం అనుకోవద్దు.. బాధ్యతగా ఓటేద్దాం!
[ 13-05-2024]
తెలంగాణ శాసనసభ ఎన్నికలు.. గతేడాది నవంబరు 30న జరిగాయి. ఉమ్మడి వరంగల్ 12 అసెంబ్లీ స్థానాల్లోని చాలా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు పోటెత్తారు. కొన్ని చోట్ల దాదాపు 100 శాతానికి చేరువగా ఓటింగ్ నమోదైంది. -
ఓటరు స్లిప్లోనే సమగ్ర సమాచారం
[ 13-05-2024]
ఓటరు స్లిప్ చేతికి అందగానే చాలా మంది వారి పేరు, ఓటరు ఐడీ సంఖ్య, పోలింగ్ బూత్ నెంబర్ చూసుకుంటారు. కానీ దాని మీద ఉండే క్యూఆర్ కోడ్, వెనక వైపు ఉన్న సూచనలను పట్టించుకోరు. -
దూరాభారమైనా బాధ్యతగా.. భావితరాలకు స్ఫూర్తిగా
[ 13-05-2024]
ఇది వాజేడు మండలం బొల్లారం గ్రామం. ఇక్కడ 219 మంది ఓటర్లు ఉండగా, వీరు 6 కి.మీ దూరంలోని ఆర్.గుంటపల్లి గ్రామంలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేస్తున్నారు. ఇదే మండలంలో గుట్టలపై దట్టమైన అడవిలో ఉన్న పెనుగోలు గ్రామంలో 22 మంది ఓటర్లు ఉంటారు. -
వెయ్యి మంది పోలీసులతో పటిష్ఠ భద్రత
[ 13-05-2024]
లోక్సభ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖా పరంగా అన్ని చర్యలు చేపట్టామని ఎస్పీ కిరణ్ ఖరే ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. -
సర్వం సిద్ధం..!
[ 13-05-2024]
మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గం ఎన్నికల పోలింగ్ పక్కాగా నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సోమవారం జరగనున్న ఎన్నికల ప్రక్రియలో విధులు నిర్వహించే సిబ్బంది.. -
అప్రమత్తంగా ఉండాలి
[ 13-05-2024]
పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా పోలీస్ అధికారి సుధీర్ రాంనాథ్ కేకన్ సూచించారు. -
అంతర్జాలం ద్వారా పోలింగ్ నిర్వహణ పర్యవేక్షణ
[ 13-05-2024]
మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ సెగ్మెంట్లలో సోమవారం పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు కలెక్టరేట్లో ఆదివారం ప్రత్యేక ఎన్నికల కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. -
ఎన్నికల నిర్వహణకు భారీ భద్రత
[ 13-05-2024]
సోమవారం జరగనున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఈవీఎంలను పంపిణీ కేంద్రాల నుంచి జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాలకు భారీ భద్రత మధ్య తరలించామని జిల్లా ఎస్పీ శబరీష్ పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏనుగులకు అనారోగ్యం.. 3500కి.మీ వెళ్లి కాపాడిన ‘అంబానీ’ బృందం
-
‘ప్రజ్వల్ మా అమ్మపై అత్యాచారం చేశాడు.. బలవంతంగా నా దుస్తులు విప్పించాడు’
-
స్ట్రెచ్చర్పై వచ్చి ఓటేసిన క్యాన్సర్ బాధితురాలు
-
నిజ్జర్ కేసు దర్యాప్తులో చెప్పుకోదగ్గ అంశాలేవీ బయటపడలేదు: జైశంకర్
-
ఏపీ ఎన్నికలు: ‘హలో ఏపీ బైబై వైసీపీ’ సోషల్మీడియాలో ట్రెండ్