ఆస్కార్కు గుర్తుగా సొంతూర్లో గ్రంథాలయం
ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటునాటు’ పాట రాసి అంతర్జాతీయ స్థాయిలో ఆస్కార్ పురస్కారం పొందారు ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్. భూపాలపల్లి జిల్లా చల్లగరిగెలో జన్మించి తన కలంతో కమ్మని పాటలెన్నో రాస్తూ లక్షలాది ప్రేక్షకుల అభిమానం చూరగొన్నారు.
ప్రముఖ గీత రచయిత చంద్రబోస్
ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటునాటు’ పాట రాసి అంతర్జాతీయ స్థాయిలో ఆస్కార్ పురస్కారం పొందారు ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్. భూపాలపల్లి జిల్లా చల్లగరిగెలో జన్మించి తన కలంతో కమ్మని పాటలెన్నో రాస్తూ లక్షలాది ప్రేక్షకుల అభిమానం చూరగొన్నారు. ఇటీవల వరంగల్ ఎస్.ఆర్. విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసి గౌరవించింది. ఈ సందర్భంగా ‘ఈనాడు’ చంద్రబోస్ను పలకరించగా ఓరుగల్లుతో తనకున్న చిన్ననాటి జ్ఞాపకాలు పంచుకున్నారు.
ఈనాడు, వరంగల్: నేను పుట్టి పెరిగింది చల్ల గరిగె. వరంగల్తో ఎంతో అనుబంధం ఉంది. ఈ మట్టి వాసన చూసినా, ఈ గాలి పీల్చినా చెప్పలేనంత ఆనందం కలుగుతుంది. ఇక్కడకు వస్తేనే అమ్మ ఒడిలో ఉన్న అద్భుతమైన భావన కలుగుతుంది. నేను జూనియర్ కాలేజీలో చదివేటప్పుడు హనుమకొండలోని కేడీసీలో పాటల కార్యక్రమాలు జరిగేవి. అప్పటి గాయకులు శంకరన్న, సారంగపాణన్న పాటలు వింటూ ఎంతో స్ఫూర్తి పొందాను. శంకరన్న కంజర పట్టుకుని చక్కగా పాడేవారు. ఓరుగల్లు అంటేనే ఒక రకమైన ఉత్తేజం, చైతన్యం. ఎంతో మంది వరంగల్ కవులు, కళాకారుల నుంచి నేను ఎంతో నేర్చుకుని ఈ స్థాయికి వచ్చాను. ఎస్.ఆర్. ట్యుటోరియల్కు వచ్చి చదువుకున్నాను. వరదారెడ్డిని గురువుగా భావిస్తా. నేను చదువుకున్న సంస్థే నాకు డాక్టరేట్ ఇవ్వడం ఎంతో గర్వంగా భావిస్తున్నా.
చారిత్రక సంపదకు నిలయం
నా చిన్నతనంతో పోలిస్తే ఇప్పుడు ఓరుగల్లు ఎంతో అభివృద్ధి చెందింది. రహదారులు, భవనాలు, నగరం రూపురేఖలు మారిపోయాయి. ఎంతో అభివృద్ధి జరిగింది. ఇక్కడి చారిత్రక ప్రాంతాలకు కొదువ లేదు. రామప్ప ఆలయానికి యునెస్కో దక్కింది. నేను 29 ఏళ్లుగా పాటల ప్రయాణం చేస్తున్నానంటే కారణం వరంగలే. నా బాల్యంలో చల్లగరిగెలో అనేక జానపద పాటలు వినేవాడిని. అప్పటి కళాకారుల్లా నేను పాటలు పాడి ప్రజల అభిమానాన్ని చూరగొనాలని అనుకునేవాడిని. వారిని ఆదర్శంగా తీసుకొని అంచెలంచెలుగా ఎదిగా.
సాహిత్యంపై అభిలాష పెంచింది...
నా పాట నాటునాటుకు ఆస్కార్ పురస్కారం వచ్చాక మా సొంతూరు చల్లగరిగెలో ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఏదైనా చేయాలనుకున్నాం. మా శ్రీమతి సుచిత్ర ఆలోచనతో ఊళ్లో పాడుబడిన గ్రంథాలయం బాగు చేయాలని సంకల్పించాం. ఆస్కార్ అవార్డుకు గుర్తుగా ఆంగ్ల అక్షరం ‘ఓ’ ఆకారంలో గ్రంథాలయం రెండంతస్తుల్లో నిర్మిస్తున్నాం. ఇప్పటికి 80 శాతం పనులు పూర్తయ్యాయి. నాకు సాహిత్యంపై అభిలాష పెరగడానికి గ్రంథాలయమే కారణం కాబట్టి దాన్ని బాగు చేసి ఊరి రుణం తీర్చుకోవాలనుకున్నా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిశ్శబ్ద సమయం.. అభ్యర్థుల అంతర్మథనం
[ 12-05-2024]
లోక్సభ ఎన్నికల పోరు చివరి దశకు చేరుకుంది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు శనివారం సాయంత్రం ప్రచారానికి తెరపడింది. -
ప్రచారం.. ఎవరెక్కడ ముగించారంటే..!
[ 12-05-2024]
నెల రోజుల ఎన్నికల ప్రచారానికి తెరపడింది. వరంగల్ లోక్సభ నియోజకవర్గంలో పోటీ పడుతున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారం చివరి రోజైన శనివారం సాయంత్రం 5 గంటల వరకు ప్రజలను కలిసే ప్రయత్నం చేశారు. -
ఓట్ల పండగకు సొంతూళ్లకు పయనం
[ 12-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్కు సమయం దగ్గరపడటంతో ప్రజలు తమ సొంతూళ్లకు పయనమయ్యారు. -
కాకతీయ వైభవం ఉట్టిపడేలా పోలింగ్ కేంద్రాలు
[ 12-05-2024]
హనుమకొండ జిల్లాలో పోలింగ్కు సర్వం సిద్ధమైందని జిల్లా ఎన్నికల అధికారిణి సిక్తా పట్నాయక్ తెలిపారు. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
[ 12-05-2024]
లోక్సభ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి (ఆర్వో), కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. -
ఓటు వేయడం సామాజిక బాధ్యత
[ 12-05-2024]
‘ఓటు కేవలం హక్కు మాత్రమే కాదు. సామాజిక బాధ్యతగా ఓటర్లు గుర్తించాలి. వేసవి ఎండలు, అకాల వర్షాల దృష్ట్యా పోలింగ్కు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. -
స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు
[ 12-05-2024]
ఈనెల 13న నిర్వహించే లోక్సభ ఎన్నికల్లో జిల్లా ప్రజలు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ కోరారు. -
పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి
[ 12-05-2024]
మే 13న జరగనున్న లోక్సభ ఎన్నికలను పురస్కరించుకొని జిల్లాలో పోలింగ్ సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. -
మావోయిస్టు ప్రభావిత కేంద్రాల్లో పటిష్ఠ భద్రత
[ 12-05-2024]
సోమవారం జరగనున్న లోక్సభ ఎన్నికల నిర్వహణకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని జిల్లా ఎసీˆ్ప శబరీష్ అన్నారు. -
మాతృమూర్తులూ.. మరవొద్దు ఓటు!
[ 12-05-2024]
అమ్మ.. పిల్లల కోసం ఎంతటి త్యాగమైనా చేస్తుంది.. గోరుముద్దలను తినిపించి వారిని గొప్పవారిగా తీర్చిదిద్దుతుంది..ఆప్యాయతానురాగాలు పంచి మాతృత్వపు మాధుర్యం రుచి చూపిస్తుంది..వారి బంగారు భవిష్యత్తు కోసం మరో పనికి శ్రీకారం చుట్టాలి.. -
పోస్టుకార్డులతో ఓటరు చైతన్యం
[ 12-05-2024]
ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించడంతో పాటు ఓటు వేసేలా చైతన్యం కలిగించేందుకు స్వయం కృషి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పోస్ట్కార్డులతో ఓట్ ఫర్ షూర్(vote for sure) పేరిట వినూత్న ప్రచారం నిర్వహించారు. -
క్షణాల్లో పోల్ చీటీ ప్రత్యక్షం
[ 12-05-2024]
ఒకప్పుడు అన్ని రాజకీయ పార్టీ కార్యకర్తలు ఇంటికి పోల్ చీటీ తెచ్చి ఇచ్చేవారు. -
ఎన్నికల విధుల ఉద్యోగులకు వేతనం ఖరారు
[ 12-05-2024]
ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు, అధికారులకు ఎన్నికల సంఘం వేతనాలు ఖరారు చేసింది. -
సామగ్రి సకాలంలో కేంద్రాలకు చేరేలా చర్యలు
[ 12-05-2024]
ఈవీఎం స్ట్రాంగ్రూంలు, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను పోలీసు ఉన్నతాధికారులతో కలిసి జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి ప్రావీణ్య శనివారం రాత్రి పరిశీలించారు. -
144 సెక్షన్ విధిస్తూ ఉత్తర్వులు
[ 12-05-2024]
లోక్సభ ఎన్నికల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉంటుందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు. -
పోలింగ్ కేంద్రం లేని పంచాయతీ!
[ 12-05-2024]
ప్రజాస్వామ్య వ్యవస్థ పరిఢవిల్లాలంటే వయోజనులందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి.
తాజా వార్తలు (Latest News)
-
ఓట్ల పండుగ.. హైదరాబాద్లో బోసిపోయిన రహదారులు
-
నాలుగో ఆర్థిక శక్తి.. 2025లో జపాన్ను దాటనున్న భారత్!
-
29వసారి ఎవరెస్టు అధిరోహణ.. చరిత్ర సృష్టించిన నేపాల్ షెర్పా
-
విధుల్లో చేరిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్ సిబ్బంది.. 2 రోజుల్లో పూర్తిస్థాయి సర్వీసులు
-
ఒక్క ఓటేనన్న ఉదాసీనత వద్దు.. మీ ఓటే చరిత్రను మార్చేయొచ్చు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM