logo

నవ వధువు ఆత్మహత్య

వివాహం జరిగిన 19 రోజులకే ఓ నవ వధువు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఏటూరునాగారం మండలంలోని రాంనగర్‌ గ్రామంలో చోటు చేసుకుంది.

Updated : 23 Apr 2024 05:46 IST

 కోమలిక  (పాతచిత్రం)
ఏటూరునాగారం, న్యూస్‌టుడే: వివాహం జరిగిన 19 రోజులకే ఓ నవ వధువు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఏటూరునాగారం మండలంలోని రాంనగర్‌ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్థుల కథనం ప్రకారం.. మంగపేట మండలం కమలాపురం గ్రామానికి చెందిన కోమలిక(20)కు ఈ నెల 4న రాంనగర్‌ గ్రామానికి చెందిన నూకల గోవింద్‌తో పెద్దలు వివాహం జరిపించారు. పెళ్లి అయిన తర్వాత ముభావంగా కనిపించడంతో.. ఆమె భర్త ఎందుకలా ఉంటున్నావని ప్రశ్నించారు. ఇష్టం లేని పెళ్లి చేశారని చెప్పడంతో.. తల్లిదండ్రుల వద్దకు పంపించారు. కూతురుకు నచ్చజెప్పి మళ్లీ అత్తవారింటికి పంపించారు. రెండు రోజుల కిందట తమ తల్లిగారింటికి వెళ్లివద్దామని భర్తతో చెప్పడంతో.. వారిద్దరు కలిసి కమలాపురం వచ్చారు. తల్లిదండ్రులు రొయ్యూరులోని  బంధువుల పెళ్లికి వెళ్లగా, భర్తతో కలిసి ఉన్న కోమలిక ఆదివారం మధ్యాహ్నం పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబసభ్యులు ఏటూరునాగారం తరలించారు. అక్కడి పరీక్షించిన వైద్యుడు పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో.. వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రికి తీసుకెళ్లగా, చికిత్స పొందుతూ.. సోమవారం మధ్యాహ్నం మృతి చెందారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని