బకాయిలు రావు.. పనులు సాగవు..
ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు గత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ‘మన ఊరు మన బడి’ కార్యక్రమం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా చేపట్టిన పాఠశాలల మరమ్మతులు, నూతన నిర్మాణాల పనులకు నిధుల కొరత ఏర్పడటంతో.. సుమారుగా ఏడాది కాలంగా పనులు నిలిచిపోయాయి.
బడులకు వేసవి సెలవులు ప్రకటించినా అసంపూర్తి పనులను ప్రస్తావించిన ఊసే లేదు. గుత్తేదారులు, యాజమాన్య కమిటీలు రావాల్సిన బిల్లుల కోసం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. జూన్ 4 వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో.. అప్పటి వరకు ఒక్క రూపాయి కూడా విడుదలయ్యే అవకాశాలు లేవు.
ములుగు పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో అసంపూర్తిగా నిర్మాణం చేసిన భననం ఇది. గతేడాది ‘మన ఊరు మన బడి’ కార్యక్రమం కింద సుమారు రూ.6 లక్షల నిధులతో పనులు ప్రారంభించారు. బిల్లులు రాకపోవడంతో.. మధ్యలోనే నిలిపివేశారు.
పనులు పూర్తయినా.. బిల్లులు చెల్లించని ములుగులోని ప్రాథమిక పాఠశాల
ములుగు, న్యూస్టుడే: ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు గత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ‘మన ఊరు మన బడి’ కార్యక్రమం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా చేపట్టిన పాఠశాలల మరమ్మతులు, నూతన నిర్మాణాల పనులకు నిధుల కొరత ఏర్పడటంతో.. సుమారుగా ఏడాది కాలంగా పనులు నిలిచిపోయాయి. గతేడాది మే చివరి నాటికి పనులు పూర్తి చేయాలని గడువు విధించినప్పటికీ.. బిల్లులు రాకపోవడంతో.. గుత్తేదారులు, పాఠశాల యాజమాన్య కమిటీలు పనులను మధ్యలోనే నిలిపివేశారు. దీంతో ఆయా పాఠశాలల్లో విద్యార్థులకు తిప్పలు తప్పడం లేదు.
రూ.3.19 కోట్ల బకాయిలు
కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాఠశాల యాజమాన్య కమిటీల పద్ధతిని పక్కన పెట్టి ఐకేపీ మహిళా సంఘాల ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు పనులు చేపట్టాలని నిర్ణయించి నిధులు కూడా కేటాయించింది. ‘మన ఊరు మన బడి’ పనులకు సంబంధించి ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేయలేదు. జిల్లా పరిధిలో మొత్తం 125 బడుల్లో ‘మన ఊరు మన బడి’ కింద 2,839 పనులు చేపట్టగా, వీటి విలువ రూ.21.79 కోట్లుగా నమోదైంది. ఇందులో 2,407 పనులకు రూ.18.60 కోట్లు చెల్లించారు. ఇంకా రూ.3.19 కోట్ల పనులకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఈ పనులను మూడు ఇంజినీరింగ్ శాఖలకు అప్పగించారు. ఇందులో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖకు వాజేడు, వెంకటాపురం, కన్నాయిగూడెం మండలాలు కేటాయించారు. గిరిజన సంక్షేమ శాఖకు ములుగు, గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం, మంగపేట మండలాలు ఉండగా, ఈడబ్ల్యూఐడీసీ కింద వెంకటాపూర్ మండలాన్ని కేటాయించారు.
మొదటి విడత 125 బడుల ఎంపిక
జిల్లాలో మొత్తం 348 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలున్నాయి. మొదటి విడతలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో 125 ఎంపిక చేసి మరమ్మతులు, అదనపు గదుల నిర్మాణం మొదలగు పనులు చేపట్టారు. ఇందులో 77 ప్రాథమిక, 17 ప్రాథమికోన్నత, 33 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. మొత్తం తొమ్మిది మండలాలుండగా, ఒక్కో మండలంలో నాలుగు బడులను ఎంపిక చేసి వాటిని మోడల్ స్కూల్స్గా తీర్చిదిద్దాలని నిర్ణయించి ఎట్టకేలకు పూర్తి చేశారు. రూ.30 లక్షల లోపున్న పనులను పాఠశాల యాజమాన్య కమిటీలు, ఆపైనున్నవి టెండరు ద్వారా గుత్తేదారుకు అప్పగించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అనుమతి లేని క్లినిక్లు.. అర్హత లేకున్నా చికిత్సలు
[ 03-05-2024]
ఉమ్మడి వరంగల్లో వైద్యం వ్యాపారమైంది. నకిలీ వైద్యులు దీన్ని వ్యాపారంగా మలుచుకొని రూ.కోట్లు సంపాదిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా 75 శాతం నకిలీ వైద్యులు ప్రైౖవేటు మెడికల్ ప్రాక్టీషనర్స్, రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ క్లినిక్ల పేరిట చిన్నస్థాయి ఆసుపత్రులు నిర్వహిస్తున్నారు. -
వసతులు కల్పిస్తేనే పండగలా పోలింగ్
[ 03-05-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు మౌలిక సదుపాయాలు కల్పించాలని ఇప్పటికే భారత ఎన్నికల సంఘం జిల్లాల ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. -
ఎన్కౌంటర్లో చనిపోయింది సుష్మిత కాదా..!
[ 03-05-2024]
ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతంలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో తెలంగాణకు చెందిన ముగ్గురు మావోయిస్టులు మృతిచెందినట్లు వార్తలొచ్చాయి. వీరిలో హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం సూధన్పల్లికి చెందిన మావోయిస్టు దళ సభ్యురాలు తిక్క సుష్మిత -
పాత వారికి ప్రాధాన్యం.. కొత్త వారికి గౌరవం
[ 03-05-2024]
పార్టీలో మొదటి నుంచి పనిచేస్తున్న పాత వారికి ప్రాధాన్యం ఇస్తూనే.. ఇటీవల కాంగ్రెస్లో చేరిన వారిని గౌరవించుకుందామని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. -
మోదీ నాయకత్వంలో దేశం పురోగతి
[ 03-05-2024]
మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తోందని భాజపా ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్ అన్నారు. గురువారం రాత్రి ఐనవోలు మండల కేంద్రంలో నిర్వహించిన భాజపా కార్నర్ మీటింగ్లో కేంద్ర మాజీ మంత్రి పొన్ను రాధాకృష్ణన్తో కలిసి మాట్లాడారు. -
అమలుకు నోచని హామీలతో కాంగ్రెస్ మోసం
[ 03-05-2024]
అమలుకు నోచని హామీలతో మోసం చేసి.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఎవరూ నమ్మడం లేదని వరంగల్ లోక్సభ నియోజకవర్గ భారాస అభ్యర్థి డాక్టర్ సుధీర్కుమార్ అన్నారు. -
‘భాజపావి బ్లాక్మెయిల్ రాజకీయాలు’
[ 03-05-2024]
దేశంలో మరోసారి అధికారంలోకి రావడానికి భాజపా బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తోందని వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య విమర్శించారు. -
దేశం కోసం మరోసారి మోదీ..
[ 03-05-2024]
దేశం కోసం, ధర్మం కోసం మూడోసారి మోదీని ప్రధాని కావాలని ప్రజలు నిర్ణయించుకున్నారని, 400కు పైగా పార్లమెంటు స్థానాల్లో భాజపా గెలుపు ఖాయమని కామారెడ్డి ఎమ్మెల్యే టి.వెంకటరమణారెడ్డి, భువనగిరి లోక్సభ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బూరనర్సయ్య గౌడ్ అన్నారు. -
నేటి నుంచి ‘ఇంటి వద్ద ఓటింగ్’
[ 03-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ ఈ నెల 13న జరగనుంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోస్టల్ బ్యాలెట్ ఓటర్లు, 85 ఏళ్లపై బడిన ఓటర్లు, దివ్యాంగులు ఇంటి వద్దనే ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. -
ఎండలు బాబోయ్..
[ 03-05-2024]
జిల్లాలో రోజురోజుకు ఎండ దంచి కొడుతోంది. ఉదయం 8 గంటల నుంచే భానుడు ప్రతాపాన్ని చూపుతుండటంతో బయటకు వెళ్లలేని పరిస్థితి.. జన సంచారం లేక రోడ్లు, దుకాణాలు వెలవెలబోతున్నాయి. -
ఇంటి నుంచి ఓటుకు అర్హులు 866
[ 03-05-2024]
పోలింగ్ కేంద్రాలకు వెళ్లలేని వారు తమ ఓటు హక్కును తాము ఉన్నచోటనే వినియోగించుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం వివిధ వర్గాలవారికి అవకాశం కల్పించింది. -
టీ హబ్కు జబ్బు
[ 03-05-2024]
ములుగు జిల్లా ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన ‘టీ హబ్’కు జబ్బు చేసింది. సుమారు 20 రోజులుగా పరీక్షలు నిర్వహించడం లేదు. విద్యుత్తు సమస్య కారణంగా యంత్రాలు పనిచేయకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. -
అభ్యర్థులు నచ్చకపోతే.. నోటా
[ 03-05-2024]
రాజ్యాంగం కల్పించిన వజ్రాయుధం ఓటుహక్కు. ఓటరు తనకు నచ్చిన అభ్యర్థిని ఎన్నుకునేందుకు దీన్ని వినియోగిస్తారు. ఒకవేళ వారెవరూ నచ్చకుంటే నోటా (నన్ ఆఫ్ ద అబోవ్)ను సంధించొచ్చు. -
ఓట్ల గని ఎవరికో?
[ 03-05-2024]
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి.. రోజురోజుకు ఎన్నికల వేడి రాజుకుంటోంది.. రాష్ట్రానికి వెలుగులు నింపే సింగరేణి నల్లసూరీల ఓట్లు కూడా కీలకంగా మారనున్నాయి. వరంగల్, మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గాల పరిధిలో సింగరేణి కార్మిక ఓటర్లు ప్రభావం చూపనున్నారు. -
ఇంటి నుంచి ఓటుకు స్పందన కరవు
[ 03-05-2024]
ప్రతీసారి ఎన్నికల్లో వృద్ధులు.. దివ్యాంగులు అతికష్టం మీద పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేయడం చూస్తుంటాం. అయితే గత శాసనసభ ఎన్నికల నుంచి ఇంటివద్దే ఓటువేసేందుకు వారికి ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించింది. -
పొదుపు సంఘాలకు సోలార్ ప్లాంట్ల నిర్వహణ
[ 03-05-2024]
ప్రభుత్వం నుంచి రుణాలు తీసుకొని చిరు వ్యాపారాలు నిర్వహిస్తున్న, ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్న పొదుపు సంఘాల మహిళలు మరింత ఆర్థికంగా బలపడే విధంగా ప్రభుత్వాలు మరో అవకాశం కల్పించాయి. -
వల పన్నారు.. రూ.5 కోట్లకు ముంచారు!
[ 03-05-2024]
వరంగల్ నగరానికి చెందిన ఓ ఉద్యోగి అడ్డదారిలో భారీగా సంపాదించాలనుకున్నాడు. మరో ఇద్దరిని కలుపుకొని స్థానికంగా ఉండే ఓ బడా పత్తి వ్యాపారికి వల వేశారు. -
సెలవులో ఉద్యోగి.. కదలని దస్త్రాలు
[ 03-05-2024]
గ్రేటర్ వరంగల్ టౌన్ప్లానింగ్ విభాగం తీరు ఎవరికి వారే అన్నట్లుగా ఉంది. పెద్ద భవనాల అనుమతులు పెద్ద సార్లు, చిన్నాచితక భవనాల అనుమతులు కిందిస్థాయి అధికారులు చూస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
సునీత, వైఎస్ షర్మిల పిటిషన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు
-
సూచీలకు ‘హెవీ’ స్ట్రోక్.. 700 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రోహిత్ తర్వాత పాండ్యనే కెప్టెన్.. మరింత బాధ్యతగా ఆడాలి: మాజీ క్రికెటర్
-
భారత కంపెనీపై దిల్లీ హైకోర్టుకు టెస్లా.. కారణం ఇదే..
-
నా స్థాయికి తగ్గ బౌలింగ్ చేయలేకపోయా: ముంబయి స్టార్ ఆల్రౌండర్
-
బజాజ్ కొత్త పల్సర్ NS400Z.. టాప్ స్పీడ్ 154kph