రాత్రి వేళల్లో తరలిస్తున్నారు..!
జిల్లాలో బెరైటీస్ అక్రమ రవాణా కొనసాగుతోంది. అడ్డుకట్ట వేసేందుకు అటవీశాఖ అధికారులు చేస్తున్న ప్రయత్నాలు పూర్తిగా సఫలమవడం లేదు. అధికారుల కళ్లుగప్పి విలువైన ఖనిజాన్ని రాత్రి వేళ సరిహద్దులు దాటిస్తున్నారు.
గార్లలో ఆగని బెరైటీస్ అక్రమ రవాణా
భద్రతకు నోచుకోని బెరైటీస్ ఖనిజ నిల్వలు(పాత చిత్రం)
ఈనాడు, మహబూబాబాద్, న్యూస్టుడే, గార్ల: జిల్లాలో బెరైటీస్ అక్రమ రవాణా కొనసాగుతోంది. అడ్డుకట్ట వేసేందుకు అటవీశాఖ అధికారులు చేస్తున్న ప్రయత్నాలు పూర్తిగా సఫలమవడం లేదు. అధికారుల కళ్లుగప్పి విలువైన ఖనిజాన్ని రాత్రి వేళ సరిహద్దులు దాటిస్తున్నారు. ముఖ్యంగా గార్ల మండలం నగరం, బాలాజీతండా, కోట్యానాయక్తండా, పాతపోచారం పరిసరాల్లో సుమారు వంద ఎకరాల్లో విస్తరించిన ఈ బెరైటీస్ నిక్షేపాలను గతంలో సర్కారు అనుమతులతో తవ్వకాలు చేశారు. పలు కారణాలతో కొన్నాళ్లుగా పనులు ఆగాయి. దాంతో తరలించడానికి సిద్ధంగా ఉన్న ఖనిజాల నిల్వలు కుప్పలుగా ఉన్నాయి. వాటి రక్షణగా అటవీశాఖ అధికారులు నిక్షేపాలున్న గుట్ట చుట్టూ కందకాలు తీశారు. కనకవర్షం కురిపిస్తున్న ఆ ఖనిజంపై అక్రమార్కుల కన్నుపడింది. అడ్డంకులను దాటుకొని రహస్యంగా టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు.
ఖనిజ విలువ ఇదీ
బెరైటీస్ ఖనిజాలలో నాణ్యమైన దాన్ని పెట్రోలియం శుద్ధి చేసేందుకు, రంగుల తయారీకి తదితరాల వాటిలో వినియోగిస్తుంటారు. నాణ్యత లేని దాన్ని సిమెంట్ తయారీకి వాడతారు. ఒక్కో టిప్పరులో సుమారు 35 టన్నులు, ట్రాక్టర్లలో దాదాపు 6 టన్నుల ఖనిజం పడుతుందని గతంలో అక్కడ పనిచేసిన వ్యక్తులు చెబుతున్నారు. నాణ్యమైన ఖనిజం టన్నుకు రూ. 10 వేల చొప్పున, నాణ్యత లేని దానికి టన్నుకు రూ.6 వేల చొప్పున ధర పలుకుతుందని తెలిసింది. ఈ లెక్కన టిప్పరు ఖనిజాన్ని రూ. 3.50 లక్షలు, ట్రాక్టరు ఖనిజాన్ని రూ. 60 వేల చొప్పున విక్రయిస్తున్నట్లు సమాచారం.
యంత్రాలను వినియోగిస్తూ
స్థానిక, ఖమ్మం, కడప ప్రాంతానికి చెందిన అక్రమార్కులే ఈ వ్యవహరానికి పాల్పడుతున్నారు. నిక్షేపాలున్న ప్రాంతం నిర్జన ప్రదేశంలో ఉండడంతో రాత్రి అయితే చాలు అక్రమార్కులు ఆ ప్రాంతంలో యంత్రాలు, ట్రాక్టర్లతో వాలిపోతారు. కందకాలను యంత్రంతో పూడ్చేసి లోపలికి చొరబడతారు. ఆ యంత్రాన్ని ఉపయోగించి ట్రాక్టర్లలో ఖనిజాన్ని నింపుకుంటారు. ఆ తర్వాత బెరైటీస్తో ఉన్న వాహనాలు బయటికి వెళ్లగానే ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు యథావిధిగా జేసీబీతో కందకాలను తీస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. మేడారం జాతర సమయంలో టిప్పర్ల ద్వారా వందల టన్నులు, గత నెలలోనూ ట్రాక్టర్ల ద్వారా తరలించినట్లు తెలిసింది. వారి అక్రమాలకు సెలవు రోజులను ఎంచుకుంటున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఖమ్మం కేంద్రంగా ఖనిజాన్ని క్రషర్లలో పొడిగా మార్చి అక్కడి నుంచి కడప జిల్లా తదితర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. అక్రమాలను అడ్డుకోవడాన్ని ‘మామూలు’గా తీసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతను పెంచి విలువైన ఖనిజం తరలకుండా చూడాలని, పరిశ్రమ నెలకొల్పి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.
పట్టుబడిన ఘటనలు ఇలా
- గతేడాది పాత పోచారం నుంచి కమలాపురం వెళ్లే దారిలో బెరైటీస్తో కూడిన లారీని పోలీసులు పట్టుకున్నారు. బాధ్యులపై కేసు నమోదు చేశారు. ఈ ఖనిజాన్ని సూర్యాపేట జిల్లా కోదాడ వైపు తరలించాలనుకున్నట్లు తెలిసింది.
- గతేడాది సెప్టెంబరులో రాత్రివేళ ట్రాక్టర్లో ఖనిజాన్ని తరలించేందుకు అక్రమార్కులు ప్రయత్నించారు. వర్షంతో ఆ ప్రాంతం బురదగా ఉండడంతో వాహనం అందులో కూరుకుపోగా తెల్లవారితే దొరికిపోతామనే భయంతో అక్రమార్కులు విలువైన రాళ్లను కిందవేసి వెళ్లారు.
- తాజాగా నిక్షేపాలున్న ప్రాంతానికి రెండు ట్రాక్టర్లు ఖనిజాన్ని తరలించేందుకు వచ్చినట్లు గుర్తించిన పోలీసులు వాటిని స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు.
బేస్క్యాంపులను ఏర్పాటు చేశాం
రమేష్, డీఆర్వో
ఖనిజాల నిల్వల ప్రాంతాల్లో కందకాలను తవ్వాం. నిక్షేపాలున్న ప్రాంతంలో బేస్క్యాంపులను ఏర్పాటు చేశాం. అక్కడ వాచర్లను నియమించాం. బీట్ అధికారి కూడా స్థానికంగానే ఉంటున్నారు. ఖనిజ అక్రమ తరలింపునకు పాల్పడేవారిపై చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎక్కడ తూటా పేలినా ఇక్కడ ఉలికిపాటు!
[ 04-05-2024]
మావోయిస్టు ఉద్యమ ప్రస్థానంలో ఉమ్మడి వరంగల్ జిల్లాది కీలకపాత్ర. పీపుల్స్వార్ ఉద్యమంలో చేరి కీలక పదవులను చేపట్టారు. -
ఓరుగల్లు వాసికి భారాస అవకాశం
[ 04-05-2024]
వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గానికి జరిగే ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఏనుగుల రాకేశ్రెడ్డిని తమ అభ్యర్థిగా భారాస ప్రకటించింది. -
మట్టి కప్పుతూ.. మాయ చేస్తూ..!
[ 04-05-2024]
ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కళ్ల ముందే.. దోచేస్తున్నా.. రైతులు ఏమీ చేయలేని పరిస్థితుల్లో మిన్నకుండి పోతున్నారు. -
జాతీయ రహదారి.. అభివృద్ధికి మార్గసూచి!
[ 04-05-2024]
రాష్ట్రంలో జాతీయ రహదారుల అనుసంధానం కలిగిన జిల్లాల్లో ఖమ్మం తర్వాత ఉమ్మడి వరంగల్ ఉంటుంది. ఇవి వరంగల్, మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గాల పరిధిలో ఎనిమిది ప్రాంతాల్లో దాదాపు 847.62 కి.మీ. విస్తరించాయి. -
రేపటి నీట్కు పకడ్బందీ ఏర్పాట్లు
[ 04-05-2024]
ఇంటర్మీడియట్ బైపీసీ పూర్తి చేసిన విద్యార్థులకు వైద్య విద్యలో ప్రవేశాల కోసం ఈ నెల 5న ఆదివారం నిర్వహించనున్న జాతీయ అర్హత పరీక్ష -2024 (నీట్)కు నగరంలో పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టారు. -
ఓటు సామాజిక బాధ్యత
[ 04-05-2024]
ప్రజాస్వామ్యంలో ఓటు సామాజిక బాధ్యత అని, ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ పిలుపునిచ్చారు. -
‘కడియంది వెన్నుపోట్ల చరిత్ర’
[ 04-05-2024]
ఓటర్లు తనను ఆశీర్వదిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని భాజపా వరంగల్ ఎంపీ అభ్యర్థి అరూరి రమేష్ అన్నారు. -
వేసవి సెలవులు.. ఆటపాటలతో బాలానందం కొలువు
[ 04-05-2024]
వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేందుకు బాలలు సిద్ధమయ్యారు. -
మట్టిని కొల్లగొడుతున్నారు!
[ 04-05-2024]
జిల్లా కేంద్రంలో మొరం, మట్టి వ్యాపారాన్ని కొందరు గుత్తేదారులు యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. -
కేంద్రంలో ఇండియా కూటమిదే అధికారం
[ 04-05-2024]
‘రాష్ట్రంలో గత ప్రభుత్వం స్కీముల పేరిట అన్ని పథకాలను స్కాములుగా తయారు చేసి ఆర్థికంగా విధ్వంసం సృష్టించింది.. దేశసమైక్యతను దెబ్బతీసిన భాజపా ఈ ఎన్నికల్లో ఓడిపోతుంది.. -
నోరు మెదపని వారిని లోక్సభకు పంపొద్దు: సీతారాంనాయక్
[ 04-05-2024]
నోరు మెదపని వారిని పార్లమెంట్కు పంపొద్దని భాజపా ఎంపీ అభ్యర్థి అజ్మీర సీతారాంనాయక్ కోరారు. -
దివ్యాంగులు, వయోవృద్ధులు ఇంటి నుంచే ఓటు
[ 04-05-2024]
వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం ఎన్నికల అధికారులు శుక్రవారం నుంచి ఇంటి వద్దనే ఓటింగ్ ప్రక్రియను చేపట్టారు. -
8న లక్ష్మీపురంలో ప్రధాని మోదీ బహిరంగ సభ
[ 04-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ జిల్లా ఖిలావరంగల్ మండలం తిమ్మాపురం గ్రామంలోని లక్ష్మీపురంలో ఈ నెల 8న నిర్వహించనున్న ప్రధాని మోదీ బహిరంగ సభకు భాజపా శ్రేణులు శుక్రవారం స్థలాన్ని పరిశీలించారు. -
ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు జాబితాలో తప్పులు
[ 04-05-2024]
వరంగల్ జిల్లా ఖానాపురంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు జాబితాలో తప్పులు చోటు చేసుకున్నాయి. -
రూ.2తో ఓటు సవాలు
[ 04-05-2024]
కేవలం రూ.2లతో ఓటును సవాలు (ఛాలెంజ్) చేసే అవకాశం పోలింగ్ కేంద్రంలో కూర్చునే ఏజెంట్కు మాత్రమే ఉంటుంది. -
దావూద్ ఇబ్రహీం, చోటా షకీల్ తెలుసు..
[ 04-05-2024]
వ్యాపారి నుంచి రూ.5 కోట్లు వసూలు చేశారు. డబ్బులు ఇవ్వాలని బాధితుడు నిలదీస్తే ‘మాకు దావూద్ ఇబ్రహీం, చోటా షకీల్ తెలుసు. -
ద్విచక్రవాహనంతో సహా బావిలో పడి ఒకరి మృతి
[ 04-05-2024]
రోడ్డు పక్కనున్న వ్యవసాయ బావిలో ద్విచక్రవాహనం పడిపోవడంతో ఒకరు మృతి చెందిన సంఘటన వరంగల్ జిల్లా సంగెం మండలం ఆశాలపల్లిలో చోటు చేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
ముందు మీరు రాయ్బరేలీలో గెలవండి.. రాహుల్కు సలహా ఇచ్చిన చెస్ దిగ్గజం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/05/24)
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
-
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం