గుర్తుంచుకుందాం..
రాజకీయ పార్టీ అంటే ముందుగా గుర్తొచ్చేది పార్టీల గుర్తులు. వాటి ఆధారంగానే ఓటు వేస్తుంటాం. మన దేశంలో పార్టీల గుర్తుల కేటాయింపు ఎలా జరిగింది..? జాతీయ పార్టీల గుర్తుల్లో ఎలాంÇటి మార్పులు వచ్చాయో తెలుసుకుందాం..
రాజకీయ పార్టీ అంటే ముందుగా గుర్తొచ్చేది పార్టీల గుర్తులు. వాటి ఆధారంగానే ఓటు వేస్తుంటాం. మన దేశంలో పార్టీల గుర్తుల కేటాయింపు ఎలా జరిగింది..? జాతీయ పార్టీల గుర్తుల్లో ఎలాంÇటి మార్పులు వచ్చాయో తెలుసుకుందాం..
న్యూస్టుడే, టేకుమట్ల
కాంగ్రెస్.. కాడెడ్ల నుంచి హస్తం వరకు
దేశంలో 1952లో తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గుర్తు ‘కాడెడ్లు’.. ఆ ఎన్నికల్లో ఈ గుర్తుతోనే విజయం సాధించింది. ఆ తర్వాత కాంగ్రెస్లో కాసు బ్రహ్మానందరెడ్డి, ఇందిరాగాంధీ మధ్య వచ్చిన విభేదాలతో పార్టీలో చీలిక ఏర్పడింది. ఇందిరా కాంగ్రెస్తో ఏర్పడిన కాంగ్రెస్(ఐ)కి ఎన్నికల సంఘం 1971లో ‘ఆవు దూడ’ గుర్తు కేటాయించింది. అదే గుర్తుతో ఎన్నికల్లో పోటీ చేశారు. అనంతరం చీలిపోయిన కాంగ్రెస్.. భారత జాతీయ కాంగ్రెస్ పేరుతో 1977లో విలీనమైంది. దీంతో ఎన్నికల సంఘం ‘హస్తం’ గుర్తును కేటాయించింది. అప్పటి నుంచి ఇదే గుర్తుతో కాంగ్రెస్ ఎన్నికల బరిలో నిలుస్తోంది.
భాజపా.. వెలిగే దీపం నుంచి కమలం..
1951లో శ్యాంప్రసాద్ ముఖర్జీచే ‘జన సంఘ్ పార్టీ’ని దిల్లీలో స్థాపించారు. జనసంఘ్ పార్టీ గుర్తు.. ‘వెలిగే దీపం’.. 1977లో జనసంఘ్ పార్టీ ‘జనతా పార్టీ’లో విలీనమైంది. ఆ తర్వాత ‘రైతు నాగలి’ గుర్తును కేటాయించడంతో పోటీ చేస్తూ వచ్చింది. 1980లో జనతా పార్టీ నుంచి బయటకు వచ్చిన పూర్వపు జన సంఘ్ నాయకులతో భారతీయ జనతా పార్టీ(భాజపా)ని స్థాపించారు. అప్పటి నుంచి భాజపా ‘కమలం’ గుర్తుతో ఎన్నికల్లో పోటీ చేస్తూ వస్తోంది.
పీడీఎఫ్ నుంచి బరిలో..
1952 సార్వత్రిక ఎన్నికల సమయంలో కమ్యూనిస్టు పార్టీలపై నిర్బంధం ఉండటంతో పీడీఎఫ్ పేరుతో ఆయా పార్టీల అభ్యర్ధులు బరిలో నిలిచారు. స్వతంత్ర అభ్యర్ధులకు కేటాయించే ‘హస్తం’ గుర్తును ఎన్నికల సంఘం వారికి కేటాయించింది. ఆ తర్వాత సీపీఐకి కంకి కొడవలి, సీపీఎంకు సుత్తి కొడవలి నక్షత్రం, ఏఐఎఫ్బీ (మార్స్కిస్టు)కి సింహం గుర్తులను కేటాయించడంతో ఇవే గుర్తులతో ప్రస్తుతం బరిలో నిలుస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/05/24)
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
-
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం
-
రజనీకాంత్- అమితాబ్ ఆలింగనం.. ఫొటోలు వైరల్